CNG price Hyderabad : అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా దేశంలో ఇంధన ధరల మంట కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం నేరుగా భారతీయ వాహనదారుల జేబులపై పడుతోంది. నిన్న పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇక ఈరోజు, మంగళవారం సీఎన్జీ ధర కిలోకు రూ. 2 మేర జంప్ అయ్యాయి.
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న డ్రోన్లు, క్షిపణుల యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన అవసరాలలో ఐదో వంతు వాటా సరఫరా చేసే అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్’ జలమార్గం దాదాపు మూతపడింది. భౌగోళికంగా ఈ ప్రాంతంపై ఇరాన్కు పట్టు ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు విపరీతంగా అంటుకున్నాయి. దీని ప్రభావంతో గడిచిన 15 రోజుల్లోనే ఇంధన ధరలు పెరగడం ఇది నాలుగోసారి.
ధరల పెంపునకు సంబంధించిన పూర్తి వివరాలు, తాజా రేట్లు ఇక్కడ చూద్దాం:
1. 15 రోజుల్లోపే నాలుగోసారి పెరిగిన సీఎన్జీ ధరలు..
సాధారణ పెట్రోల్ ఖర్చులు భరించలేక సీఎన్జీ వాహనాలకు మారిన మిడిల్ క్లాస్ ప్రజలకు కూడా ధరల సెగ తప్పడం లేదు.
తాజా సవరణలో సీఎన్జీ ధర కిలోకు రూ. 2 పెరిగింది. దీనితో దిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ. 83.09 కి చేరుకుంది.
ఇక హైదరాబాద్లో సీఎన్జీ ధర కిలోకు రూ. 97గా ఉంది. విజయవాడలో రూ. 91గా కొనసాగుతోంది.
కేవలం మూడు రోజుల క్రితమే సీఎన్జీపై రూ. 1 పెంచిన కంపెనీలు, ఇప్పుడు మళ్లీ రూ. 2 పెంచడం గమనార్హం. 15 రోజుల్లో సీఎన్జీ ధర పెరగడం కూడా ఇది నాలుగోసారి.
2. రూ. 100 దాటిన పెట్రోల్.. భారీగా పెరిగిన డీజిల్
ఇరాన్ వివాదం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడిచమురు భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) ధరలను సవరించాయి.
{{/usCountry}}ఇరాన్ వివాదం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడిచమురు భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) ధరలను సవరించాయి.
{{/usCountry}}పెట్రోల్ ధర: లీటరుకు రూ. 2.61 పెరగడంతో.. దిల్లీలో పాత ధర రూ. 99.51 నుంచి ఏకంగా రూ. 102.12 కి చేరింది. 2022 తర్వాత పెట్రోల్ ధర రూ. 100 మార్కును దాటడం ఇదే మొదటిసారి.
డీజిల్ ధర: లీటరుకు రూ. 2.71 పెరగడంతో.. దిల్లీలో ప్రస్తుతం డీజిల్ ధర రూ. 92.49 నుంచి రూ. 95.20 కి చేరింది.
మే 15 నుంచి ఇప్పటివరకు జరిగిన వరుస పెంపులతో కేవలం రెండు వారాల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు రూ. 7.50 మేర పెరగడం గమనార్హం.
చమురు కంపెనీల భారీ నష్టాలు..
ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మే 15న మొదటిసారి ధరలు పెంచడానికి ముందు చమురు మార్కెటింగ్ కంపెనీల రోజువారీ నష్టం దాదాపు రూ. 1,000 కోట్లుగా ఉండేది. ప్రస్తుత ధరల పెంపు తర్వాత ఆ నష్టం "కొద్దిగా తగ్గి రూ. 600 కోట్ల లోపుకు" చేరింది.
కంపెనీలు తమ ప్రస్తుత నష్టాల నుంచే కాకుండా, గతంలో ఆటో ఇంధనాలు, వంటగ్యాస్ (ఎల్పీజీ) పై వచ్చిన నష్టాలను కూడా భర్తీ చేసుకుంటున్నాయి. అందువల్ల రాబోయే రోజుల్లో ఈ ఇంధన ధరల పెంపు కొనసాగవచ్చని ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణులు విశ్లేషిస్తున్నారు.