న్యూఢిల్లీ: ఇటీవల సోషల్ మీడియా వేదికగా సెన్సేషన్ సృష్టిస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (Cockroach Janta Party - CJP) దేశవ్యాప్తంగా తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దేశ విద్యావ్యవస్థలో జరుగుతున్న వరుస వైఫల్యాలపై దిల్లీలో త్వరలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్న నేపథ్యంలో, పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముగ్గురు ప్రముఖులను అధికార ప్రతినిధులుగా (Spokespersons) నియమించినట్లు మంగళవారం ప్రకటించింది.
ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అభిజీత్ దిప్కే స్థాపించిన ఈ సంస్థ, తమ నూతన నియామకాల వివరాలను 'ఎక్స్' (X) వేదికగా పంచుకుంది. "భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్ని, చర్చా శైలిని మార్చడానికి సీజేపీ కట్టుబడి ఉంది. సరికొత్త తరం నాయకులు దీనికి నాయకత్వం వహిస్తారు" అని సంస్థ పేర్కొంది.
చీఫ్ స్పోక్స్పర్సన్గా సౌరవ్ దాస్
ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సౌరవ్ దాస్ను కాక్రోచ్ జనతా పార్టీ తమ ముఖ్య అధికార ప్రతినిధిగా (Chief Spokesperson) నియమించింది. న్యాయ, సామాజిక అంశాలపై జర్నలిజంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. నవంబర్ 2025లో దిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగిన కాలుష్య వ్యతిరేక భారీ నిరసన ప్రదర్శనల్లో సౌరవ్ దాస్ కీలక పాత్ర పోషించారు.
పొలిటికల్ రీసెర్చర్, ఫిల్మ్మేకర్ విజేత దహియా
రాజకీయ పరిశోధకుడు, రచయిత, ఫిల్మ్మేకర్ అయిన విజేత దహియాను మరో అధికార ప్రతినిధిగా ఎంపిక చేశారు. దిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (DTU) గ్రాడ్యుయేట్ అయిన దహియా, పలువురు ప్రముఖ యూట్యూబ్ క్రియేటర్ల కోసం రీసెర్చ్, కంటెంట్ ప్రొడక్షన్ విభాగాల్లో పనిచేశారు. ఈయన 'పవర్ ఆఫ్ యూనివర్స్', 'టు హెల్ విత్ దట్ జాబ్' అనే పుస్తకాలను రచించడమే కాకుండా.. 'దరారేన్', 'ఓప్రి పరాయ్' అనే హర్యానా చిత్రాలకు కథ, దర్శకత్వం వహించారు.
మాజీ మెకిన్సే కన్సల్టెంట్ అశుతోష్ రంకా
ప్రపంచ ప్రసిద్ధ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ 'మెకిన్సే & కంపెనీ' (McKinsey & Company) లండన్ శాఖలో పనిచేసిన అశుతోష్ రంకాకు కూడా అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పగించారు. ఐఐటీ కాన్పూర్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) పూర్వ విద్యార్థి అయిన రంకా, గత ఏడాది భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత జైపూర్లో పర్యావరణం, విద్య, యువత సమస్యలపై జరిగిన పలు ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీక్ వివాదానికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారంలో ఈయన కీలక పాత్ర పోషించారు.
జూన్ 6న నిరసనల షెడ్యూల్
{{/usCountry}}ప్రపంచ ప్రసిద్ధ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ 'మెకిన్సే & కంపెనీ' (McKinsey & Company) లండన్ శాఖలో పనిచేసిన అశుతోష్ రంకాకు కూడా అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పగించారు. ఐఐటీ కాన్పూర్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) పూర్వ విద్యార్థి అయిన రంకా, గత ఏడాది భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత జైపూర్లో పర్యావరణం, విద్య, యువత సమస్యలపై జరిగిన పలు ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీక్ వివాదానికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారంలో ఈయన కీలక పాత్ర పోషించారు.
జూన్ 6న నిరసనల షెడ్యూల్
{{/usCountry}}కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే జూన్ 6న భారతదేశానికి తిరిగి రానున్నారు. ఆయన వచ్చిన కొద్దిరోజుల్లోనే నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, సీబీఎస్ఈ (CBSE) వ్యవస్థలోని లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలో శాంతియుత నిరసనలు చేపట్టాలని సీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత నెలలోనే ప్రారంభమైన ఈ డిజిటల్ రాజకీయ వేదిక, విద్యార్థులు, యువత సమస్యలపై గళమెత్తుతూ సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ను సంపాదించుకుంది.