ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ చందాదారుల విత్డ్రాయల్ నిబంధనలలో కీలక మార్పులు తీసుకొచ్చింది. 'ఈపీఎఫ్ స్కీమ్ 2026' అమలులోకి రావడంతో పీఎఫ్ సొమ్ము, పెన్షన్ ఉపసంహరణ విధానాలపై పొదుపుదారుల్లో తలెత్తిన అనుమానాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆగస్టు 10న లోక్సభలో అడిగిన ప్రశ్నకు కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభా కరండ్లజే లిఖితపూర్వక సమాధానమిస్తూ నూతన మార్గదర్శకాలను వివరించారు.
ఫైనల్ సెటిల్మెంట్కు వెయిటింగ్ పీరియడ్ ఎంత?

ఉద్యోగం వదిలేసిన వెంటనే పీఎఫ్ ఖాతాలోని మొత్తం సొమ్మును ఒకేసారి తీసుకునేందుకు ఇకపై వీలుండదు.
ఈపీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ (EPF Final Settlement): గడువుకు ముందే పీఎఫ్ ఖాతాను పూర్తిగా క్లోజ్ చేసి మొత్తం నిధులు ఉపసంహరించుకోవడానికి 12 నెలల వెయిటింగ్ పీరియడ్ నిర్దేశించారు.
ఈపీఎస్ పెన్షన్ విత్డ్రావల్ (EPS Withdrawal): ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) కింద వచ్చే ప్రయోజనాలను ఉపసంహరించుకోవడానికి 36 నెలల వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది.
75% వరకు పాక్షిక ఉపసంహరణకు అవకాశం!
వెయిటింగ్ పీరియడ్ విధించినప్పటికీ ఉద్యోగులు అత్యవసర పరిస్థితుల్లో నిధులు పొందకుండా పూర్తిగా అడ్డుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు. అదే సమయంలో పాక్షిక విత్డ్రావల్స్ (Partial Withdrawals), అడ్వాన్స్ నిబంధనలను మరింత సరళతరం చేసినట్లు చెప్పారు.
చందాదారులు తమ ఖాతాలోని నిధుల్లో గరిష్టంగా 75 శాతం వరకు ఈ క్రింది మూడు ప్రధాన విభాగాల కింద ఉపసంహరించుకోవచ్చు:
అత్యవసర అవసరాలు (Essential needs): వైద్య ఖర్చులు, నిరుద్యోగ భృతి, పిల్లల విద్య మొదలైనవి.
గృహ అవసరాలు (Housing needs): ఇల్లు నిర్మాణం, కొనుగోలు లేదా రుణం చెల్లింపులు.
ప్రత్యేక పరిస్థితులు (Special circumstances): ఎలాంటి కారణం చెప్పకుండానే ఏడాదికి రెండుసార్లు తమ పీఎఫ్ బ్యాలెన్స్లో 75% వరకు విత్డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించారు.
"నూతన నిబంధనల ప్రకారం పీఎఫ్ ఖాతాదారులు అత్యవసరాలు, ఇళ్ల నిర్మాణం లేదా ప్రత్యేక పరిస్థితుల్లో ఎలాంటి కారణాలు సూచించకుండానే సంవత్సరానికి రెండుసార్లు తమ బ్యాలెన్స్ నుండి 75% నిధులను ఉపసంహరించుకోవచ్చు" అని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభా కరండ్లజే తెలిపారు.
సీబీటీ ఆమోదంతోనే నిర్ణయం
{{/usCountry}}"నూతన నిబంధనల ప్రకారం పీఎఫ్ ఖాతాదారులు అత్యవసరాలు, ఇళ్ల నిర్మాణం లేదా ప్రత్యేక పరిస్థితుల్లో ఎలాంటి కారణాలు సూచించకుండానే సంవత్సరానికి రెండుసార్లు తమ బ్యాలెన్స్ నుండి 75% నిధులను ఉపసంహరించుకోవచ్చు" అని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభా కరండ్లజే తెలిపారు.
సీబీటీ ఆమోదంతోనే నిర్ణయం
{{/usCountry}}ఈ నూతన నిబంధనలు కార్మికులు, ఉద్యోగ సంఘాల అభిప్రాయాలకు అనుగుణంగానే రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మార్పులన్నీ ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 238వ సమావేశంలో సమగ్రంగా చర్చించిన తర్వాతే ప్రభుత్వానికి సిఫార్సు చేశారని మంత్రి తెలిపారు. ఈ బోర్డులో కార్మిక సంఘాలు, యాజమాన్య ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
కార్మికులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా, ఈపీఎఫ్ఓ కింది చర్యలను వేగవంతం చేస్తోందని ప్రభుత్వం వెల్లడించింది:
ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ బలోపేతం: చందాదారుల సమస్యలను వేగంగా పరిష్కరించడం.
అవగాహన కార్యక్రమాలు: నూతన నిబంధనలపై సభ్యులకు స్పష్టతనివ్వడం.
డిజిటల్ క్లెయిమ్ సెటిల్మెంట్: ఆన్లైన్ అడ్వాన్స్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయడం.