ఇండియా, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్న విషయం తెలుసు కదా. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆటలకు రాజకీయాలను దూరంగా ఉంచాలని, ప్రతి లీగ్ లో ప్రతి దేశానికి చెందిన ప్లేయర్ కు ప్రాతినిధ్యం ఉండేలా చూడాల్సిన బాధ్యత ఐసీసీదేనని అతడు స్పష్టం చేశాడు.
వసీం అక్రమ్ ఏమన్నాడంటే?

పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ ఐసీసీకి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఈ విషయాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని అతడు కోరాడు. ఆల్-టైమ్ గ్రేటెస్ట్ లెఫ్ట్-ఆర్మ్ పేసర్గా ప్రశంసలు అందుకున్న అక్రమ్.. 'రాజకీయాలను క్రీడల నుండి దూరంగా ఉంచాలి' అని ఐసీసీకి గట్టి సందేశం పంపాడు. దీని ద్వారానే క్రికెట్కు సంబంధించి రెండు దేశాల మధ్య ఉన్న వైరానికి ముగింపు పలకొచ్చని అతడు అభిప్రాయపడ్డాడు.
పాకిస్థాన్ క్రికెటర్లు ఐపీఎల్ (IPL)లో ఆడాలని, అలాగే భారత క్రికెటర్లు కూడా ఇతర లీగుల్లో ఆడాలని ఆకాంక్షిస్తూ అక్రమ్ పాత అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాడు. టీ20 లీగ్ లలో 'ప్రతి దేశం నుండి ఆటగాళ్లను' ఎంపిక చేయాలని అతడు నొక్కి చెప్పాడు.
విజ్డన్ క్రికెట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీం అక్రమ్ మాట్లాడుతూ... “నన్ను క్షమించండి. కానీ క్రికెట్లో నాకు నచ్చనిది రాజకీయం. సూటిగా చెప్పాలంటే, క్రీడలను రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలి. లీగ్ క్రికెట్లో ప్రతి దేశం నుండి ప్రతి ఆటగాడిని ఎంచుకోవాలి. ధైర్యంగా ఉండండి. గొప్పగా వ్యవహరించండి. కానీ దురదృష్టవశాత్తు అది జరగడం లేదు. ఐసీసీ ఇక్కడే జోక్యం చేసుకోవాలి. క్రికెట్ బోర్డులు ఇక్కడే ముందుకు రావాలి. లీగ్ను ఎవరు నిర్వహిస్తున్నారన్నది ముఖ్యం కాదు. టీమ్స్ ఎవరివి అన్నది ముఖ్యం కాదు. ప్రతి దేశం నుండి ప్రతి ఆటగాడిని ఎంపిక చేయాలి” అని అక్రమ్ అన్నాడు.
ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలు ఇలా..
ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే భారత్, పాకిస్తాన్ల మధ్య సంబంధాలు అత్యంత కనిష్ట స్థాయిలో ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత అదుపు తప్పాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సహజంగానే ఇది భారత్-పాకిస్తాన్ క్రికెట్పై స్పష్టమైన ప్రభావాన్ని చూపించింది.
{{/usCountry}}ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే భారత్, పాకిస్తాన్ల మధ్య సంబంధాలు అత్యంత కనిష్ట స్థాయిలో ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత అదుపు తప్పాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సహజంగానే ఇది భారత్-పాకిస్తాన్ క్రికెట్పై స్పష్టమైన ప్రభావాన్ని చూపించింది.
{{/usCountry}}వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలోని రెండు మ్యాచ్లు రద్దు అయ్యాయి. ఇటీవల ముగిసిన ఆసియా కప్లో మూడు భారత్-పాక్ మ్యాచ్లు జరిగినా.. ఆటగాళ్ల మధ్య వాతావరణం స్నేహపూర్వకంగా లేదు. మ్యాచ్ అనంతరం హ్యాండ్ షేక్ చేసుకోకపోవడం, ఆసియా కప్ గెలిచిన భారత ట్రోఫీతో ఏసీసీ చీఫ్ మోసిన్ నఖ్వీ పారిపోవటం వంటి సంఘటనలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి.