...
...
Next Story

Gold Rate today: బంగారం పైపైకి.. డాలర్ డౌన్.. $4,400లకు పసిడి పరుగు

అమెరికాలో రిటైల్ విక్రయాలు క్షీణించడంతో డాలర్ ఇండెక్స్ బలహీనపడింది. దీనికితోడు అంతర్జాతీయంగా కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు పెరగడంతో పసిడి ధరలు ఔన్సుకు $4,400 మార్కుకు అత్యంత చేరువలో నిలిచాయి.

Updated on: Aug 17, 2026, 09:23:18 IST
Advertisement

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ ఆల్‌టైమ్ రికార్డు స్థాయి దిశగా పరుగులు తీస్తున్నాయి. అమెరికాలో వినియోగదారుల సెంటిమెంట్ పడిపోవడం, రిటైల్ విక్రయాలు మందగించడంతో డాలర్ ఇండెక్స్ ఒత్తిడికి లోనైంది. దీంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడికి మళ్లీ డిమాండ్ పెరిగింది.

Gold Rate today: బంగారం పైపైకి.. డాలర్ డౌన్.. $4,400లకు పసిడి పరుగు
Gold Rate today: బంగారం పైపైకి.. డాలర్ డౌన్.. $4,400లకు పసిడి పరుగు

ఆసియా మార్కెట్లలో స్పాట్ గోల్డ్ 0.4 శాతం పెరిగి ఔన్సుకు 4,391.60 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పసిడి వరుసగా రెండో వారమూ తన సానుకూల జోరును కొనసాగిస్తోంది. డాలర్ ఇండెక్స్ 0.2 శాతం పడిపోవడంతో విదేశీ కొనుగోలుదారులకు బంగారం మరింత చవకగా మారింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను వెంటనే పెంచకపోవచ్చనే అంచనాలు బలపడడం కూడా బంగారం ధరలు పుంజుకోవడానికి సహాయపడింది.

ఉదయం 9.20 గంటలకు ఎంసీఎక్స్‌లో 24 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,55,020గా ఉంది. వెండి ధర కిలోకు రూ. 2,37,361గా ఉంది.

కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు.. పెరిగిన ఆదరణ

చైనా సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున పసిడిని కొనుగోలు చేస్తుండటంతో ఇన్వెస్టర్లలో మళ్లీ ఆసక్తి నెలకొంది. ఏప్రిల్ నెల తర్వాత పసిడి 100-రోజుల మూవింగ్ యావరేజ్ మార్కును దాటడం ఇదే తొలిసారి. ప్రైవేట్ ఇన్వెస్టర్లు కూడా పోర్ట్‌ఫోలియో రక్షణ కోసం పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు.

భౌగోళిక ఉద్రిక్తతలు.. చమురు మార్కెట్ల ప్రభావం

మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హార్ముజ్ జలసంధి సమీపంలో నౌకలపై దాడులు జరగడం, ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతుండటంతో ఇంధన సరఫరాపై అనిశ్చితి నెలకొంది. ఇరాన్, ఒమాన్ దేశాలు జలసంధి నిర్వహణపై ఒప్పందానికి యత్నిస్తున్నప్పటికీ, అమెరికా ఈ చర్చల్లో లేకపోవడం మార్కెట్ వర్గాలను కలవరపెడుతోంది.

నిపుణులు ఏమంటున్నారు?

బుధవారం విడుదల కానున్న ఫెడరల్ రిజర్వ్ జూలై పాలసీ సమావేశ మినిట్స్ ఆధారంగా వడ్డీ రేట్లపై మరిన్ని స్పష్టమైన సంకేతాలు వెలువడే అవకాశముంది.

వెండి, ప్లాటినం ఆ బాటలోనే...

బంగారంతో పాటు ఇతర విలువైన లోహాలు కూడా లాభాల్లో పయనించాయి. వెండి 1.3 శాతం పెరిగి ఔన్సుకు 65.54 డాలర్ల వద్ద నిలిచింది. ప్లాటినం, పల్లాడియం లోహాల ధరలు కూడా స్వల్పంగా పుంజుకున్నాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe