ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో దూసుకుపోయేందుకు దేశీయ దిగ్గజం హీరో మోటోకార్ప్ సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది! ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 'విడా' ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణికి తోడుగా, కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ను 2027లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా స్పష్టం చేసింది. ఈ కొత్త ఈవీ బైక్లను 'UBEX', 'VXZ' అనే రెండు ప్రత్యేకమైన ప్లాట్ఫారమ్ల ఆధారంగా అభివృద్ధి చేస్తున్నారు.
ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్తో తయారీ..

ప్రస్తుతం ఉన్న విడా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాట్ఫారమ్ నుంచి కాకుండా, పూర్తిగా మోటార్సైకిళ్ల అవసరాలకే ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఆర్కిటెక్చర్పై ఈ బైకులు రానున్నాయి. ఈ రెండు ప్లాట్ఫారమ్లను తొలిసారిగా గతేడాది జరిగిన ఈఐసీఎంఏ 2025 వేదికపై కాన్సెప్ట్ మోడల్స్గా ప్రదర్శించారు.
ఇందులో 'UBEX' ప్లాట్ఫారమ్ ద్వారా స్ట్రీట్-నేకెడ్ ఎలక్ట్రిక్ బైక్ని తీసుకొస్తున్నారు. ఇక రెండవదైన 'VXZ' ప్లాట్ఫారమ్ను అమెరికాకు చెందిన 'జీరో మోటార్సైకిల్స్' సంస్థతో కలిసి అభివృద్ధి చేస్తున్నారు. అడ్వెంచర్ రైడ్స్ను ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని దీన్ని హై-పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్గా తీర్చిదిద్దుతున్నారు. ఈ వీఎక్స్జెడ్ ఆధారిత మోటార్సైకిల్ డిజైన్ పేటెంట్లను కూడా హీరో మోటోకార్ప్ ఇప్పటికే భారత్లో దరఖాస్తు చేసింది.
హీరో ఎలక్ట్రిక్ బైక్- లాంచ్ వివరాలు..
ఈ బైకుల విడుదల తేదీపై హీరో మోటోకార్ప్ ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కౌసల్య నందకుమార్ స్పష్టతనిచ్చారు.
"ఈ ఏడాది ఎలక్ట్రిక్ బైక్లను మార్కెట్లోకి తెచ్చే ప్రణాళికేదీ లేదు. 2027 నాటికి ఈ ఉత్పత్తులు రోడ్డెక్కే అవకాశం ఉంది," అని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ ప్రాజెక్ట్ చాలా వేగంగా ముందుకు సాగుతోందని, రానున్న నెలల్లో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని హీరో మోటోకార్ప్ సీఈఓ హర్షవర్ధన్ చితాలే తెలిపారు.
{{/usCountry}}మరోవైపు ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ ప్రాజెక్ట్ చాలా వేగంగా ముందుకు సాగుతోందని, రానున్న నెలల్లో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని హీరో మోటోకార్ప్ సీఈఓ హర్షవర్ధన్ చితాలే తెలిపారు.
{{/usCountry}}విడా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో తమకు దక్కిన అనుభవాన్ని ఈ కొత్త బైక్స్ తయారీలోనూ వినియోగిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. అయితే స్కూటర్ ప్లాట్ఫారమ్కు భిన్నంగా, పూర్తిగా బైక్ రైడర్ల అవసరాలకు తగినట్టుగా UBEX, VXZ ప్లాట్ఫారమ్లను డిజైన్ చేసినట్లు వెల్లడించారు.
బైక్ పనితీరు, రైడింగ్ సులభతరం కావడం, గ్రేడబిలిటీ, అలాగే ఎక్కువ రేంజ్ అందించేలా మోటార్సైకిల్-స్పెసిఫిక్ టెక్నాలజీతో వీటిని ఇంజనీరింగ్ చేస్తున్నట్లు కౌసల్య నందకుమార్ వివరించారు.
ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలు..
ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో తన పట్టును మరింత బిగించుకోవడంలో భాగంగానే హీరో మోటోకార్ప్ ఈ భారీ ప్రణాళికను అమలు చేస్తోంది. దీనితో పాటు విడా ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా భారీగా పెంచాలని కంపెనీ భావిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి నెలకు 15,000 యూనిట్లుగా ఉన్న విడా ప్రొడక్షన్ కెపాసిటీని, 2027 ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా 45,000 యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.