...
...
Next Story

US Iran deal : అమెరికా- ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం! ట్రంప్ చేతుల్లో తుది నిర్ణయం.. ఏం చేస్తారు?

US Iran peace deal : యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న క్షణాలు అతి త్వరలో ఆవిష్కృతం అయ్యేడట్టు కనిపిస్తున్నాయి! అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని సమాచారం. అయితే, దీనికి అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్​ ఆమోదం తెలపాల్సి ఉందట.

Published on: May 29, 2026, 05:28:36 IST
Advertisement

అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా-ఇరాన్ ల మధ్య యుద్ధం ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది! ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ 'ఆక్సియోస్' కథనం ప్రకారం.. వాషింగ్టన్, టెహ్రాన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలమై, ఇరుదేశాలు ఒక మధ్యంతర శాంతి ఒప్పందం (ఎంఓయూ) డ్రాఫ్ట్‌ను సిద్ధం చేశాయి. అయితే, దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్’ తిరిగి తెరుచుకోనుంది.

అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన సయోధ్య? (Reuters/AFP)
అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన సయోధ్య? (Reuters/AFP)

గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న వైమానిక దాడులు, ఆర్థిక ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనాల తర్వాత.. ఇరు దేశాలూ సైనిక ఉద్రిక్తతలకు స్వస్తి పలికేందుకు మొగ్గు చూపడం ప్రపంచ దేశాలకు (ముఖ్యంగా భారత్, జపాన్ వంటి చమురు దిగుమతి దేశాలకు) పెద్ద ఉపశమనం కానుంది.

ఈ ప్రతిపాదిత యూఎస్-ఇరాన్ శాంతి ఒప్పందంలోని ముఖ్యాంశాలు, నిబంధనలు ఇక్కడ చూద్దాము..

1. 'స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్' పునరుద్ధరణ..

ప్రపంచంలోని మొత్తం చమురు, సహజ వాయువు సరఫరాలో 20 శాతం వాటా ఈ జలసంధి గుండానే సాగుతుంది. యుద్ధం కారణంగా ఇరాన్ దీనిని మూసివేయగా, అమెరికా ఇరాన్ రేవులపై నౌకాదళ దిగ్బంధనం విధించింది.

ఉచిత రవాణా: కొత్త ఒప్పందం ప్రకారం ఈ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఓడల నుంచి ఎలాంటి 'టోల్ టాక్స్' వసూలు చేయకూడదని అమెరికా స్పష్టం చేసింది.

2. 60 రోజుల చర్చల గడువు.. ఆంక్షల సడలింపు..

ఈ తాత్కాలిక సయోధ్య కాలంలో ఇరుదేశాలు తదుపరి శాశ్వత పరిష్కారం కోసం 60 రోజుల పాటు చర్చలు జరుపుతాయి.

ఈ సమయంలో అమెరికా ఇరాన్‌పై ఉన్న కొన్ని ఆర్థిక ఆంక్షలను సడలించడంతో పాటు వివిధ విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ నిధుల విడుదలను పరిశీలిస్తుంది.

అణు వివాదంపై ఇరాన్ కీలక హామీ..

ఒకవైపు చర్చలు జరుగుతున్నప్పటికీ, అమెరికా తన దూకుడును తగ్గించడం లేదు. బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్‌సెత్‌లు మాట్లాడుతూ.. ఒకవేళ ఇరాన్ ఈ ఒప్పందానికి వెనకాడు వేస్తే అంతకంటే తీవ్రమైన సైనిక దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఒప్పందం ఖరారైతే వచ్చే కొన్ని గంటలు లేదా రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విదేశాంగ వర్గాలు భావిస్తున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe