Hyundai EV : హ్యుందాయ్ నుంచి అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇదే- నెక్సాన్ ఈవీకి పోటీగా..
Electric cars in India : హ్యుందాయ్ తన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ ఎస్యూవీని 2026 చివరి నాటి లేదా 2027లో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం గోవాలో టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు, టాటా నెక్సాన్ ఈవీకి గట్టి పోటీ ఇవ్వనుంది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని విస్తరించే పనిలో వేగంగా నిమగ్నమైంది. ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలో కనిపించిన హ్యుందాయ్ కొత్త సబ్-4 మీటర్ ఎస్యూవీ.. తాజాగా గోవా వీధుల్లో ఎలక్ట్రిక్ వెర్షన్లో ప్రత్యక్షమైంది. ఈ కొత్త ఈవీకి సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి..

హ్యుందాయ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు..
ధరల వ్యత్యాసాన్ని తగ్గించే వ్యూహం-
ప్రస్తుతం హ్యుందాయ్ విక్రయిస్తున్న ఈవీల మధ్య ధరలో భారీ వ్యత్యాసం ఉంది.
క్రెటా ఎలక్ట్రిక్: రూ. 18.02 లక్షల నుంచి రూ. 24.70 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ఐయోనిక్ 5 : రూ. 46.30 లక్షలు (ఎక్స్-షోరూమ్).
వీటిన్నా తక్కువ ధరలో, సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ కొత్త సబ్-4 మీటర్ ఈవీని హ్యుందాయ్ తీసుకురాబోతోంది.
హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు- భారతదేశంలోనే స్వయంగా అభివృద్ధి..
ఈ కొత్త ఈవీకి ఒక ప్రత్యేకత ఉంది! ఇది పూర్తిగా భారతదేశంలోనే గ్రౌండ్-అప్ నుంచి అభివృద్ధి చేసిన మొదటి హ్యుందాయ్ ఎలక్ట్రిక్ వాహనం కావచ్చని తెలుస్తోంది. అయితే, ఇది ప్రత్యేకమైన 'బోర్న్ ఎలక్ట్రిక్' ప్లాట్ఫారమ్పై వస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు.
హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు- డిజైన్, ఫీచర్లు..
టెస్టింగ్ సమయంలో కనిపించిన వివరాల ప్రకారం.. కియా సైరోస్ తరహాలో ఈ కారు బాక్సీ డిజైన్ను కలిగి ఉంది.
ఎక్స్టీరియర్: మెరుగైన ఎయిరోడైనమిక్స్, ఎఫీషియన్సీ కోసం ప్రత్యేకమైన 'ఎయిరో-ఇన్స్పైర్డ్' అలాయ్ వీల్స్ను దీనికి అమర్చారు.
ఇంటీరియర్: క్యాబిన్లో సరికొత్త డ్యూయల్-స్క్రీన్ లేఅవుట్ (ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ కోసం) ఉండే అవకాశం ఉంది.
కనెక్టివిటీ: వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఫీచర్లు ఉంటాయి.
స్టీరింగ్ వీల్: వేన్యూ, వెర్నా మోడళ్లలో చూసినట్లుగా, హ్యుందాయ్ లోగోకు బదులుగా 'నాలుగు చుక్కలు' (Morse code for 'H') కలిగిన త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఇందులో ఉండవచ్చు.
హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు- పోటీ..
ఈ ఈవీని 2026కి చివరి నాటికి లేదా 2027లో లాంచ్ చేసేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, ఇది ప్రధానంగా టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ ఈవీలతో తలపడనుంది.
ఈ హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు పేరు, ధరతో పాటు ముఖ్యమైన రేంజ్ వంటి వివరాలపై సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. రానున్న రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


