Tata Electric Cars : టాటా నుంచి ఇక 3 నెలలకు ఒక ఎలక్ట్రిక్​ కారు లాంచ్​! మామూలుగా ఉండవు..

Tata Sierra EV : భారత ఈవీ మార్కెట్​లో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్, 2026 చివరి నాటికి సీయెర్రా ఈవీ, టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్, అవిన్య ఈవీలను విడుదల చేయనుంది. అదిరిపోయే రేంజ్, అధునాతన ఫీచర్లతో రాబోతున్న ఈ కార్ల వివరాను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 16, 2026, 11:20:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్​లో తిరుగులేని రారాజుగా కొనసాగుతోంది టాటా మోటార్స్. ఇప్పటికే టియాగో ఈవీ టిగోర్ ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ వంటి ఆరు విభిన్న మోడళ్లతో అతిపెద్ద పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్నప్పటికీ, టాటా తన జోరును తగ్గించడం లేదు! 2026 చివరి నాటికి కనీసం మరో మూడు కొత్త ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టి తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని కంపెనీ ప్లాన్​ చేస్తోంది. ఏప్రిల్​ నుంచి లెక్కేసుకున్నా.. మొత్తం 9 నెలలు, అంటే ప్రతి మూడు నెలలకు ఒక కొత్త ఎలక్ట్రిక్​ కారు లాంచ్​ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భారత మార్కెట్​లోకి రాబోతున్న ఆ మూడు కొత్త టాటా ఎలక్ట్రిక్ కార్ల వివరాలను ఇక్కడ చూసేయండి..

టాటా అవిన్య ఈవీ..
టాటా అవిన్య ఈవీ..

1. టాటా సీయెర్రా ఈవీ..

ఐకానిక్ 'సీయెర్రా' బ్రాండ్‌ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో టాటా తిరిగి తీసుకువస్తోంది. ఇది 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అంటే.. ఏప్రిల్-జూన్ 2026 మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ దశలో ఈ కారు కనిపించింది.

ఇది టాటా లైనప్‌లో కర్వ్ ఈవీ, హారియర్ ఈవీల మధ్య ఉంటుంది.

టెక్నాలజీ: టాటా కొత్త 'acti.ev+' ప్లాట్‌ఫారమ్‌పై ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ రూపొందుతోంది. ఇది సింగిల్ మోటార్, డ్యూయల్ మోటార్ వేరియంట్లలో లభించే అవకాశం ఉంది.

బ్యాటరీ అండ్​ రేంజ్: ఇందులో 55 కేడబ్ల్యూహెచ్​, 65 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్‌లు ఉండవచ్చు. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో సింగిల్ ఛార్జ్‌పై 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ లభించవచ్చు. అదనంగా, వెహికల్-టు-వెహికల్ (వీ2వీ), వెహికల్-టు-లోడ్ (వీ2ఎల్​) ఛార్జింగ్ ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి.

2. 2026 టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్..

టాటా నుంచి వస్తున్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు 'టియాగో ఈవీ' సరికొత్త హంగులతో రాబోతోంది. ఇది 2026 మూడవ త్రైమాసికంలో, అంటే దీపావళి పండుగ సీజన్ కంటే ముందే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

మార్పులు: కొత్త హెడ్‌ల్యాంప్ సెటప్, రీడిజైన్ చేసిన బంపర్లు, సరికొత్త అలాయ్ వీల్స్‌తో ఈ కారు బయటి వైపు కొత్తగా కనిపిస్తుంది. ఇంటీరియర్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

బ్యాటరీ: ప్రస్తుతం ఉన్న 19.2 కేడబ్ల్యూహెచ్​, 24 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీల కంటే పెద్ద బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను టాటా ఇందులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. దీనివల్ల ప్రస్తుతం ఉన్న 223 - 293 కి.మీ రేంజ్ మరింత పెరగనుంది.

3. టాటా అవిన్య ఈవీ..

టాటా మోటార్స్ నుంచి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రీమియం మోడల్ ఈ ‘అవిన్య’! ఈ ఎలక్ట్రిక్​ కారుపై భారీ అంచనాలే ఉన్నాయని చెప్పుకోవాలి. స్పోర్ట్‌బ్యాక్ బాడీ స్టైల్‌లో ఉండే ఈ కారు 2026 చివరి నాటికి విడుదల కానుంది.

ప్లాట్‌ఫారమ్: ఇది జాగ్వార్ ల్యాండ్ రోవర్ ‘ఎలక్ట్రిఫైడ్ మోడ్యులర్ ఆర్కిటెక్చర్’, టాటా జెన్ 3 ఈవీ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందుతోంది.

రేంజ్ అండ్​ పవర్: సింగిల్ ఛార్జ్‌పై ఈ కారు ఏకంగా 600 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని అంచనా. ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా ఉంటుంది.

పోటీ అండ్​ ధర: మార్కెట్​లో ఇది హ్యుందాయ్ ఐయానిక్ 5, కియా ఈవీ6 వంటి లగ్జరీ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. దీని ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) సుమారు రూ. 35 లక్షల వరకు ఉండవచ్చు.

టాటా అవిన్య ఈవీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. టాటా సీయెర్రా ఈవీ బ్యాటరీ సామర్థ్యం- రేంజ్ ఎంత ఉండవచ్చు

టాటా సీయెర్రా ఈవీ ప్రధానంగా 55 kWh, 65 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 430 కి.మీ నుంచి 500 కి.మీ పైగా రేంజ్ లభించవచ్చని అంచనా. ఇది డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది, దీనివల్ల కేవలం 60 నిమిషాల్లోనే 0-80% వరకు ఛార్జింగ్ చేసుకోవచ్చు.

2. టాటా అవిన్య.. మిగిలిన టాటా ఈవీల కంటే ఎలా భిన్నంగా ఉండబోతోంది?

మిగిలిన టాటా ఈవీలు ప్రస్తుతమున్న పెట్రోల్/డీజిల్ మోడళ్ల ఆధారంగా రూపొందగా, ఈ 'అవిన్య' మాత్రం పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల కోసమే సిద్ధం చేసిన Gen 3 (Born Electric) ప్లాట్‌ఫారమ్​పై వస్తోంది. ఇది జాగ్వార్ ల్యాండ్ రోవర్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే, కేవలం 30 నిమిషాల ఛార్జింగ్‌తో 500 కి.మీ ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉండటం!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More