...
...
Next Story

ఇండియాలో ఆడాల్సిందే.. లేదంటే పాయింట్లు వదులుకోండి: బంగ్లాదేశ్‌కు ఐసీసీ వార్నింగ్

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ గట్టి వార్నింగే ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా తమ మ్యాచ్ లను ఇండియాలోనే ఆడాలని తేల్చి చెప్పింది. లేదంటే పాయింట్లు పోతాయనీ వార్నింగ్ ఇచ్చింది. అయితే అలాంటి అల్టిమేటం ఏమీ రాలేదని బంగ్లా బోర్డు చెప్పడం గమనార్హం.

Published on: Jan 7, 2026, 15:58:47 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌ల వేదికల విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య వివాదం రాజుకుంది. భద్రతా కారణాల రీత్యా తాము భారత్‌లో ఆడలేమని బంగ్లాదేశ్ అంటుండగా.. "భారత్‌లో ఆడకపోతే పాయింట్లు కోల్పోవాల్సిందే" అని ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే బీసీబీ ఈ వార్తలను ఖండించింది.

బీసీబీకి ఐసీసీ వార్నింగ్.. అలాంటిదేమీ లేదంటూ..

ఇండియాలో ఆడాల్సిందే.. లేదంటే పాయింట్లు వదులుకోండి: బంగ్లాదేశ్‌కు ఐసీసీ వార్నింగ్
ఇండియాలో ఆడాల్సిందే.. లేదంటే పాయింట్లు వదులుకోండి: బంగ్లాదేశ్‌కు ఐసీసీ వార్నింగ్

భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026కి ముందు పొలిటికల్ హీట్ పెరిగింది. ఐపీఎల్ వివాదం, భద్రతా కారణాల పేరుతో బంగ్లాదేశ్ బోర్డు చేస్తున్న హడావిడి, ఐసీసీ రియాక్షన్ వివరాలు ఇక్కడ చూడండి.

తమ మ్యాచ్‌లను భారత్ నుంచి వేరే దేశానికి మార్చాలని బీసీబీ కోరింది. దీనిపై ఐసీసీ సీరియస్‌గా స్పందిస్తూ.. "షెడ్యూల్ ప్రకారం భారత్‌లోనే ఆడాలి, లేదంటే ఆ మ్యాచ్‌ల పాయింట్లు వదులుకోవాల్సి ఉంటుంది" అని హెచ్చరించినట్లు సమాచారం.

అయితే బీసీబీ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ అమీనుల్ ఇస్లాం ఈ వార్తలను ఖండించారు. ఐసీసీ నుంచి తమకు ఎలాంటి అల్టిమేటం రాలేదని స్పష్టం చేశారు.

బీసీబీ అధికారిక ప్రకటన

ఈ గందరగోళంపై బీసీబీ ఒక లేఖ విడుదల చేసింది. "భారత్‌లో మా జట్టు భద్రతపై మేము వ్యక్తం చేసిన ఆందోళనలకు ఐసీసీ స్పందించింది. బంగ్లాదేశ్ జట్టు టోర్నీలో పూర్తిస్థాయిలో పాల్గొనేలా చూస్తామని, భద్రతకు ఢోకా ఉండదని ఐసీసీ హామీ ఇచ్చింది. మా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. మాకు అల్టిమేటం ఇచ్చారన్న వార్తలు పూర్తిగా అబద్ధం" అని బోర్డు చెప్పడం గమనార్హం.

బంగ్లాదేశ్ బోర్డు "భద్రతా కారణాలు" అని చెబుతున్నా.. దీని వెనుక అసలు కారణం వేరే ఉందని భారత వర్గాల వాదన. బంగ్లా స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ ను ఐపీఎల్ 2026 నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ రిలీజ్ చేసింది. ఇది బీసీసీఐ ఆదేశాల మేరకే జరిగిందని బంగ్లాదేశ్ అనుమానం.

దీనికి నిరసనగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిషేధించింది. ఇప్పుడు వరల్డ్ కప్ వేదికల విషయంలోనూ అభ్యంతరం చెబుతోంది.

ఐసీసీ స్టాండ్ ఏంటి?

బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వస్తే వారికి ఎలాంటి ముప్పు లేదని, దీనిపై విశ్వసనీయమైన సమాచారం ఏదీ లేదని ఐసీసీ స్పష్టం చేసినట్లు తెలిసింది. చివరి నిమిషంలో షెడ్యూల్ మార్చడం కుదరదని, కో-హోస్ట్ అయిన శ్రీలంకకు మ్యాచ్‌లు మార్చడం సాధ్యం కాదని ఐసీసీ భావిస్తోంది.

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వివరాలు

టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. గ్రూప్-సి (Group C)లో ఉన్న బంగ్లాదేశ్ షెడ్యూల్ ఇలా ఉంది.

ఫిబ్రవరి 7: వెస్టిండీస్‌తో (కోల్‌కతా)

ఫిబ్రవరి 9: ఇటలీతో (కోల్‌కతా)

ఫిబ్రవరి 14: ఇంగ్లండ్‌తో (కోల్‌కతా)

ఫిబ్రవరి 17: నేపాల్‌తో (ముంబై)

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe