మంచనీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు బాదేసి, ఏదో ఈవ్ నింగ్ వాక్ కు వెళ్లినంత సులువుగా రికార్డులు తిరగరాసే విరాట్ కోహ్లి మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 28,000 పరుగుల మైల్ స్టోన్ చేరుకున్నాడు. ఇంటర్నెషన్ లో క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో సచిన్ తర్వాత సెకండ్ ప్లేస్ లో నిలిచాడు.
కోహ్లి రికార్డులు

ఆదివారం (జనవరి 11) న్యూజిలాండ్ తో ఫస్ట్ వన్డేలో విరాట్ కోహ్లి అదరగొట్టాడు. ఛేజింగ్ లో 91 బంతుల్లో 93 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్లో 28,000 పరుగులకు చేరుకున్న మూడో ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు అత్యధిక పరుగుల లిస్ట్ లో సచిన్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. వన్డేల్లో వరుసగా అయిదో హాఫ్ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు.
సచిన్ ను అందుకునేనా?
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అతను 664 మ్యాచ్ ల్లో 34357 మ్యాచ్ లు చేశాడు. విరాట్ కోహ్లి 557 మ్యాచ్ ల్లో 28,068 పరుగులు చేశాడు. సచిన్ ను చేరుకోవాలంటే కోహ్లి ఇంకా 6,289 పరుగులు చేయాలి. 37 ఏళ్ల కోహ్లి ఇప్పటికే టెస్టు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఇందులోనే కెరీర్ ఎండింగ్ లో ఉన్నాడు.
గర్వ కారణం
ఈ రకంగా చూసుకుంటే సచిన్ అత్యధిక అంతర్జాతీయ పరుగుల రికార్డును కోహ్లి చేరుకోవడం అసాధ్యంగానే కనిపిస్తోంది. విరాట్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు టీమ్ తో కొనసాగే అవకాశముంది. ఆ తర్వాత వన్డేలకూ అతను వీడ్కోలు పలికే సూచనలున్నాయి. ఏదేమైనా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో తొలి రెండు స్థానాల్లో ఇండియన్ బ్యాటర్లు ఉండటం మనకు గర్వకారణం.
ఇండియా విక్టరీ
న్యూజిలాండ్ తో తొలి వన్డేలో ఇండియా గెలిచింది. 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు సరిగ్గా 300 స్కోరు చేసింది. ఆ టీమ్ లో కాన్వే (56), నికోల్స్ (62), డరిల్ మిచెల్ (84) రాణించారు. ఇండియన్ బౌలర్లలో సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
{{/usCountry}}న్యూజిలాండ్ తో తొలి వన్డేలో ఇండియా గెలిచింది. 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు సరిగ్గా 300 స్కోరు చేసింది. ఆ టీమ్ లో కాన్వే (56), నికోల్స్ (62), డరిల్ మిచెల్ (84) రాణించారు. ఇండియన్ బౌలర్లలో సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
{{/usCountry}}ఛేజింగ్ లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (93), కెప్టెన్ శుభ్ మన్ గిల్ (56), శ్రేయస్ అయ్యర్ (49), రాణించడంతో ఇండియా 6 వికెట్లు కోల్పోయి 49 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది.