న్యూఢిల్లీ: దేశంలో సామాన్యుడిపై ధరల భారం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బలహీనమైన రుతుపవనాలు, ఇటీవలి ఇంధన ధరల పెంపు వెరసి రాబోయే నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) పెరగవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన నెలవారీ ఆర్థిక నివేదికలో స్పష్టం చేసింది. మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు ఆటంకాలు ఎదురవుతుండటం దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందని వివరించింది.
హార్ముజ్ జలసంధి సంక్షోభం.. భారత్కు సవాల్

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) లో సరఫరా అడ్డంకులు ఎంతకాలం కొనసాగుతాయనే అంశంపైనే భారత్ బాహ్య ముఖచిత్రం, ధరల అంచనాలు ఆధారపడి ఉన్నాయని నివేదిక తెలిపింది. "దేశీయ ధరల స్థిరత్వానికి ప్రస్తుతం హార్ముజ్ జలసంధి సంక్షోభమే అత్యంత కీలకమైన అంశం" అని ఆర్థిక శాఖ పేర్కొంది.
రవాణా, ఆహార రంగాలపై ప్రభావం
ఉత్పత్తి వ్యయాలు పెరగడం, ఇటీవలి ఇంధన ధరల పెంపు వెరసి రాబోయే రోజుల్లో రవాణా, ఇంధనం, ఆహార రంగాలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. ఇది క్రమంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పెంచేందుకు దారితీస్తుందని నివేదిక అంచనా వేసింది. దీనికి తోడు వర్షపాత కొరత తీవ్రంగా ఉంటే, అది ఆహార ద్రవ్యోల్బణానికి (Food Inflation) దారితీస్తుంది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి తగ్గి, మొత్తం దేశ ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉందని ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే?
దేశ ఆర్థిక వ్యవస్థ స్వల్పకాలిక ముఖచిత్రం ప్రస్తుతం అప్రమత్తమైన స్థితిస్థాపకతను (Cautious Resilience) ప్రదర్శిస్తోందని నివేదిక విశ్లేషించింది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు గరిష్ఠంగా ఉండటం, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం, దేశీయంగా పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే రుతుపవనాల అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం, విధాన నిర్ణేతలు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
గత ఏప్రిల్ నెలలో దేశ వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 3.48 శాతానికి చేరింది. అయితే, ఇది ఇప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించుకున్న గరిష్ఠ పరిమితి లోపే ఉండటం గమనార్హం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి నెలా ఈ ఆర్థిక నివేదికను విడుదల చేస్తుంది.
{{/usCountry}}గత ఏప్రిల్ నెలలో దేశ వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 3.48 శాతానికి చేరింది. అయితే, ఇది ఇప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించుకున్న గరిష్ఠ పరిమితి లోపే ఉండటం గమనార్హం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి నెలా ఈ ఆర్థిక నివేదికను విడుదల చేస్తుంది.
{{/usCountry}}