కెనడాలో నివసిస్తున్న భారతీయులను మరో విషాద వార్త కలిచివేసింది. టొరంటోలో ఉంటున్న 30 ఏళ్ల భారతీయ మహిళ హిమాన్షీ ఖురానా దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 32 ఏళ్ల అబ్దుల్ గఫూరీ అనే వ్యక్తిపై 'ఫస్ట్ డిగ్రీ మర్డర్' కింద కేసు నమోదు చేశారు. హిమాన్షీకి గఫూరీ సన్నిహితుడు అని తెలుస్తోంది.

ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కెనడాలో భారత మహిళ హత్య- అసలేం జరిగింది?
టొరంటో పోలీస్ సర్వీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 19వ తేదీ రాత్రి స్ట్రాచన్ అవెన్యూ, వెల్లింగ్టన్ స్ట్రీట్ వెస్ట్ ప్రాంతంలో ఒక మహిళ అదృశ్యమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు, శనివారం (డిసెంబర్ 20) ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఒక నివాసం లోపలికి వెళ్లారు. అదృశ్యమైన మహిళ మృతదేహాన్ని అందులో గుర్తించారు. ఆమెను హిమాన్షీ ఖురానాగా నిర్ధారించారు.
హిమాన్షీ టొరంటోలోనే నివసిస్తూ ఓ డిజిటల్ క్రియేటర్. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు పోలీసుల రికార్డులతో సరిపోలాయి.
ప్రియుడే హంతకుడా?
ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు.
"మృతురాలికి, నిందితుడికి మధ్య గతంలోనే పరిచయం ఉంది. ఇది సన్నిహిత భాగస్వాముల మధ్య జరిగిన హింస (ఇంటిమేట్ పార్ట్నర్ వయొలెన్స్) అని భావిస్తున్నాము," అని టొరంటో పోలీస్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.
వీరిద్దరూ గతంలో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడు అబ్దుల్ గఫూరీ ఫోటోను విడుదల చేసిన పోలీసులు, అతని ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
భారత దౌత్య కార్యాలయం స్పందన..
కెనడాలో భారత మహిళ దారుణ హత్యపై టొరంటోలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. "యువ భారతీయ పౌరురాలు హిమాన్షీ ఖురానా హత్యకు గురవ్వడం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. గత కొన్ని రోజులుగా స్థానిక అధికారులతో టచ్లో ఉన్నాము. బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాము," అని ఎక్స్లో పేర్కొంది.
{{/usCountry}}కెనడాలో భారత మహిళ దారుణ హత్యపై టొరంటోలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. "యువ భారతీయ పౌరురాలు హిమాన్షీ ఖురానా హత్యకు గురవ్వడం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. గత కొన్ని రోజులుగా స్థానిక అధికారులతో టచ్లో ఉన్నాము. బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాము," అని ఎక్స్లో పేర్కొంది.
{{/usCountry}}కెనడాలో భారతీయులపై దాడులు, హత్యలు పెరుగుతుండటం ఇప్పుడు ప్రవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. హిమాన్షీ కుటుంబం ప్రస్తుతం తీవ్ర దుఃఖంలో ఉంది. తమ బిడ్డను పొట్టనబెట్టుకున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.