...
...
Next Story

Preity Zinta : డింపుల్​ బ్యూటీకి లగ్జరీ కార్లంటే ప్రేమ! కోట్లు విలువ చేసే ప్రీతి జింటా గ్యారేజ్​ ఇదే..

IPL 2026 : వెండితెరపైనే కాదు, ఐపీఎల్ మైదానంలోనూ మెరిసిపోయే పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా వద్ద ఉన్న లగ్జరీ కార్ల కలెక్షన్ వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Apr 21, 2026, 05:30:09 IST
Advertisement

Preity Zinta cars collection : సినిమాల్లో తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న 'డింపుల్ బ్యూటీ' ప్రీతి జింటా.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు యజమానిగా బిజీగా గడుపుతున్నారు. మైదానంలో తన జట్టును ఉత్సాహపరుస్తూ నిత్యం వార్తల్లో నిలిచే ప్రీతికి, లగ్జరీ వాహనాలంటే కూడా ఎంతో మక్కువ. సాధారణంగా సెలబ్రిటీలు అత్యంత విలాసవంతమైన కార్లను ఇష్టపడతారు, కానీ ప్రీతి జింటా ఎంపిక మాత్రం కాస్త భిన్నంగా, క్లాసిక్‌గా ఉంటుంది. ఆమె గ్యారేజీలో ఉన్న ఆ పవర్‌ఫుల్ వాహనాలపై ఓ లుక్కేద్దాం.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్​ఎస్​ 350డీ

ప్రీతి జింటా.. (PTI)
ప్రీతి జింటా.. (PTI)

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ నుంచి అత్యుత్తమ ఎస్‌యూవీగా పేరున్న జీఎల్​ఎస్ 350డీ ప్రీతి వద్ద ఉంది. 2020లో భారత్‌లో ఈ మోడల్ నిలిపివేసినప్పటికీ, దీని క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇందులో 3.0 లీటర్ వీ6 డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 255 హెచ్​పీ పవర్, 620 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. చివరిగా మార్కెట్లో దీని ధర సుమారు రూ. 97 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు పలికింది.

రాజసం ఉట్టిపడే రేంజ్ రోవర్ వోగ్..

సెలబ్రిటీల గ్యారేజీలో రేంజ్ రోవర్ లేకపోతే అది అసంపూర్ణమే అని చెప్పాలి. ప్రీతి జింటా వద్ద అత్యంత విలాసవంతమైన 'రేంజ్ రోవర్ వోగ్' ఉంది. భారత్‌లో ప్రస్తుతం ఈ మోడల్ అమ్మకాల్లో లేనప్పటికీ, ఒకప్పుడు ఇది లగ్జరీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఆఫ్-రోడ్ ప్రయాణాల్లోనూ, సిటీ రోడ్లపై రాజసంగా దూసుకెళ్లడంలోనూ దీనికి సాటిలేదు. ఇందులో 3.0 లీటర్ డీజిల్ ఇంజన్‌తో పాటు 4.4 లీటర్ డీజిల్ వంటి పవర్‌ఫుల్ ఆప్షన్లను కంపెనీ అందించింది.

మిత్సుబిషి లాన్సర్..

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ప్రీతి జింటా వద్ద ఒకప్పటి ఐకానిక్ సెడాన్ 'మిత్సుబిషి లాన్సర్' కూడా ఉంది. 90వ దశకంలో, 2000 ప్రారంభంలో భారత్ రోడ్లపై ఓ ఊపు ఊపిన ఈ కారు, రాలీ రేసింగ్ పితామహుడిగా గుర్తింపు పొందింది. నమ్మకమైన ఇంజన్, వేగవంతమైన పనితీరు దీని ప్రత్యేకత. 2013లో ఈ మోడల్‌ను భారత మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు.

క్లాసిక్ లెక్సస్ ఎల్​ఎక్స్​ 470..

1. ప్రీతి జింటా వద్ద ఉన్న అత్యంత ఖరీదైన కారు ఏది?

ఆమె వద్ద ఉన్న కార్లలో మెర్సిడెస్ బెంజ్ జీఎల్​ఎస్ 350డీ, రేంజ్ రోవర్ వోగ్ అత్యంత ఖరీదైనవి. వీటి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుంది.

2. ప్రీతి జింటా ఇప్పటికీ మిత్సుబిషి లాన్సర్ వాడుతున్నారా?

అవును, నివేదికల ప్రకారం ఆమె గ్యారేజీలో ఇప్పటికీ ఈ పాత తరం ఐకానిక్ సెడాన్ ఉంది. ఇది ఆమెకు కార్లపై ఉన్న క్లాసిక్ అభిరుచిని తెలియజేస్తుంది.

3. ప్రస్తుతం మార్కెట్​లో రేంజ్ రోవర్ వోగ్ అందుబాటులో ఉందా?

లేదు, రేంజ్ రోవర్ వోగ్ పాత మోడల్. ప్రస్తుతం ల్యాండ్ రోవర్ సంస్థ దీని స్థానంలో సరికొత్త మోడళ్లను భారత మార్కెట్​లో విక్రయిస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks