ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మామూలుగా ఆడటం లేదు. ఛాంపియన్ టీమ్ లాగే చెలరేగిపోతోంది. బ్యాటింగ్ లో విధ్వంసంతో రికార్డులు తిరగరాస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో సిక్సర్లతో చెలరేగిన ఆర్సీబీ గ్రాండ్ విక్టరీని ఖాతాలో వేసుకుంది.
ఆర్సీబీ విక్టరీ

ఐపీఎల్ 2026లో ఆదివారం (ఏప్రిల్ 5) రాత్రి జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ అదరగొట్టింది. 43 రన్స్ తేడాతో సీఎస్కేను చిత్తు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లకు ఏకంగా 250 రన్స్ చేసింది. ఛేజింగ్ లో చెన్నై 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.
చిన్నస్వామిలో సునామీ
చిన్నస్వామి స్టేడియంలో పరుగుల సునామీ అంటే ఎలా ఉంటుందో ఆర్సీబీ చూపించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు సిక్సర్లతో చెలరేగిపోయింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (46), విరాట్ కోహ్లి (28) టీమ్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. దేవ్ దత్ పడిక్కల్ (50)తో రాణించాడు.
సిక్సర్ల మోత
అయితే ఫిల్ సాల్ట్ వికెట్ పడే సమయానికి 10.4 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 93 మాత్రమే. ఇంకా 100 కూడా దాటలేదు. అలాంటి టీమ్ చివరకు 250 రన్స్ చేసిందంటే అందుకు ప్రధాన కారణం టిమ్ డేవిడ్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 70 నాటౌట్), కెప్టెన్ రజత్ పటీదార్ (19 బంతుల్లో ఓ ఫోర్, 6 సిక్సర్లతో 48 నాటౌట్) విధ్వంసమే.
టిమ్ డేవిడ్, రజత్ మామూలుగా చెలరేగలేదు. సింగిల్స్ తీయడం కంటే సిక్సర్లు కొట్టడమే ఈజీ అన్నట్లు వీళ్ల బ్యాటింగ్ సాగింది. బాల్ ను స్టాండ్స్ లోకి పంపిస్తూ చిన్నస్వామి స్టేడియాన్ని వీళ్లు ఊపేశారు. ముఖ్యంగా టిమ్ డేవిడ్ మామూలుగా బాదలేదు. పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. అతను కొట్టిన ఓ బాల్ స్టేడియం బయటకు వెళ్లింది.
చెన్నై ఇలా
{{/usCountry}}టిమ్ డేవిడ్, రజత్ మామూలుగా చెలరేగలేదు. సింగిల్స్ తీయడం కంటే సిక్సర్లు కొట్టడమే ఈజీ అన్నట్లు వీళ్ల బ్యాటింగ్ సాగింది. బాల్ ను స్టాండ్స్ లోకి పంపిస్తూ చిన్నస్వామి స్టేడియాన్ని వీళ్లు ఊపేశారు. ముఖ్యంగా టిమ్ డేవిడ్ మామూలుగా బాదలేదు. పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. అతను కొట్టిన ఓ బాల్ స్టేడియం బయటకు వెళ్లింది.
చెన్నై ఇలా
{{/usCountry}}కొండంత రన్ ఛేజింగ్ లో సీఎస్కేకు ఆరంభంలోనే షాక్ తగిలింది. సంజు శాంసన్ (9), కెప్టెన్ రుతురాజ్ (7), ఆయూష్ మాత్రె (1) ఫెయిల్ అయ్యారు. దీంతో సీఎస్కే పుంజుకోలేకపోయింది. సర్ఫరాజ్ ఖాన్ (25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 50), ప్రశాంత్ వీర్ (43) పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
కోహ్లి రికార్డు
రన్ మెషిన్ విరాట్ కోహ్లి మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో ఓ టీమ్ పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సీఎస్కేపై కోహ్లి 37 మ్యాచ్ ల్లో 1188 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ (కేకేఆర్ పై 1161) రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.
మరోవైపు ఐపీఎల్ సీఎస్కేపై అత్యధిక స్కోరు రికార్డును ఆర్సీబీ ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా ఐపీఎల్ లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోరు చేసిన టీమ్ గానూ నిలిచింది.