...
...
Next Story

ITC Q1 FY27 Results: రూ.4,394 కోట్లకు తగ్గిన ఐటీసీ లాభం.. రెవెన్యూ మాత్రం జంప్

ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సిజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ జూన్ త్రైమాసికం (క్యూ1 ఎఫ్‌వై27) ఫలితాలను వెల్లడించింది. కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 16.2 శాతం తగ్గి రూ.4,394.13 కోట్లకు పరిమితమవ్వగా, కార్యకలాపాల ద్వారా వచ్చే రాబడి 27.6 శాతం వృద్ధితో రూ.29,523.30 కోట్లకు చేరింది.

Published on: Jul 31, 2026, 17:46:58 IST
Advertisement

ప్రముఖ బహుళ రంగాల దిగ్గజం 'ఐటీసీ లిమిటెడ్' 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక (Q1FY27) ఆర్థిక ఫలితాలను జూలై 31న విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం (Consolidated Net Profit) వార్షిక ప్రాతిపదికన 16.2 శాతం తగ్గి రూ.4,394.13 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.5,244.20 కోట్లుగా నమోదైంది.

ITC Q1 FY27 Results: రూ.4,394 కోట్లకు తగ్గిన ఐటీసీ లాభం.. రెవెన్యూ మాత్రం జంప్ (REUTERS)
ITC Q1 FY27 Results: రూ.4,394 కోట్లకు తగ్గిన ఐటీసీ లాభం.. రెవెన్యూ మాత్రం జంప్ (REUTERS)

గత త్రైమాసికంతో (Q4FY26) పోలిస్తే కంపెనీ నికర లాభం 18.4 శాతం క్షీణించింది. అయితే, కార్యకలాపాల ద్వారా వచ్చిన రాబడి (Revenue from Operations) మాత్రం ఆకట్టుకుంది. వార్షిక ప్రాతిపదికన 27.6 శాతం, త్రైమాసిక ప్రాతిపదికన 23.9 శాతం వృద్ధి నమోదు చేసి రూ.29,523.30 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో ఈ రాబడి రూ.23,129.35 కోట్లుగా ఉంది. ఇక కంపెనీ ఎబిటా (EBITDA) 24 శాతం తగ్గి రూ.5,181 కోట్లకు చేరింది.

స్టాండలోన్ ప్రాతిపదికన పరిశీలిస్తే, ఐటీసీ నికర లాభం 27.1 శాతం తగ్గి రూ.3,579 కోట్లకు పడిపోగా, రాబడి 14.4 శాతం తగ్గి రూ.16,812 కోట్లకు చేరింది.

సిగరెట్ల విభాగం.. రాబడి పెరిగినా తగ్గిన లాభం

సిగరెట్ల విభాగం గ్రాస్ రాబడి 80.6 శాతం పెరిగి రూ.15,383.55 కోట్లకు చేరింది. అయితే, నికర రాబడి 25 శాతం క్షీణించగా, పన్నుకు ముందు లాభం (PBT) 35 శాతం తగ్గి రూ.3,341.23 కోట్లకు పరిమితమైంది.

వినియోగదారులను నిలబెట్టుకోవడానికి అవసరమైన ధరల మార్పులను వేగంగా అమలు చేస్తున్నామని, పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసేందుకు చేపట్టిన వ్యూహాత్మక చర్యలు ప్రణాళికాబద్ధంగా ఫలితాలనిస్తున్నాయని ఐటీసీ యాజమాన్యం వెల్లడించింది.

ఆకట్టుకున్న ఎఫ్‌ఎమ్‌సిజీ.. పశ్చిమాసియా ప్రతికూలతలతో అగ్రి బిజినెస్

అటు పశ్చిమాసియాలో చోటుచేసుకున్న సైనిక ఘర్షణలు, అంతర్జాతీయ వాణిజ్యానికి ఏర్పడిన విఘాతాల వల్ల అగ్రి బిజినెస్ విభాగం తీవ్రంగా ప్రభావితమైంది. ఫలితంగా అగ్రి విభాగ రాబడి 16.6 శాతం తగ్గి రూ.8,082.06 కోట్లకు, లాభం 18.5 శాతం తగ్గి రూ.353.79 కోట్లకు పడిపోయింది.

పేపర్‌బోర్డ్, ప్యాకేజింగ్ విభాగంలో మెరుగైన ఫలితాలు

పేపర్‌బోర్డ్, పేపర్, ప్యాకేజింగ్ విభాగం రాబడి 9 శాతం పెరిగి రూ.2,307.24 కోట్లకు చేరగా, పన్నుకు ముందు లాభం ఏకంగా 38 శాతం పెరిగి రూ.224.22 కోట్లుగా నమోదైంది. లాభాల మార్జిన్లు 200 బేసిస్ పాయింట్లు మెరుగయ్యాయి.

కలప ధరలు అదుపులోకి రావడం, ఎగుమతులు పెరగడం, సమర్థవంతమైన వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టడం ద్వారా ఈ విభాగంలో మెరుగైన ఫలితాలు సాధించగలిగామని కంపెనీ వెల్లడించింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe