...
...
Next Story

ఐటీఆర్​ గడువు నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ వరకు.. ఆగస్టులో మీపై ప్రభావం చూపే అంశాలివే!

ఈ కొత్త నెల ఆగస్టు నుంచి దేశంలో అనేక ఆర్థిక, బ్యాంకింగ్ నిబంధనలు మారిపోయాయి. ఐటీఆర్ దాఖలు గడువు, బ్యాంక్ ఛార్జీలు, ఆర్బీఐ పాలసీ నిర్ణయం, తత్కాల్ టికెట్ బుకింగ్, సీకేవైసీ 2.0 వంటి 5 ప్రధాన మార్పుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Aug 1, 2026, 09:13:52 IST
Advertisement

ఆగస్టు నెల ప్రారంభంతో దేశంలో సామాన్య ప్రజల జేబులతో ముడిపడి ఉన్న పలు ఆర్థిక, బ్యాంకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. పన్ను చెల్లింపుదారులు, బ్యాంక్ ఖాతాదారులు, రైల్వే ప్రయాణికులతో పాటు సాధారణ వినియోగదారులపై ఈ మార్పులు నేరుగా ప్రభావం చూపనున్నాయి.

ఆగస్టు 1 నుంచి దేశంలో కనిపించే ఆర్థిక పరమైన మార్పులు..
ఆగస్టు 1 నుంచి దేశంలో కనిపించే ఆర్థిక పరమైన మార్పులు..

కొన్ని బ్యాంకుల రుసుముల సవరణలు, సీకేవైసీ 2.0 అమలు, ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలతో పాటు వ్యాపారులు, నిపుణులకు ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు గడువు ఈ నెలలోనే ముగియనుంది. అదనపు రుసుములు, జరిమానాల పడకుండా సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నెలలో అమల్లోకి వచ్చిన ఆ 5 ముఖ్యమైన మార్పులేంటో వివరంగా తెలుసుకుందాం:

1. వ్యాపారులు, నిపుణులకు ఐటీఆర్ దాఖలు గడువు..

సాధారణ వేతనజీవులకు (ఐటీఆర్-1, ఐటీఆర్-2) జూలై 31తో ముగిసిన గడువు తర్వాత, ఇప్పుడు తదుపరి వర్గం పన్ను చెల్లింపుదారులపై దృష్టి పడింది. అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 (ఆర్థిక సంవత్సరం 2025-26)కు గాను వ్యాపార లేదా వృత్తిపరమైన ఆదాయం ఉండి, ట్యాక్స్ ఆడిట్ అవసరం లేని వ్యక్తులు (ఐటీఆర్-3, ఐటీఆర్-4) ఆగస్టు 31, 2026 లోపు తమ ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఇంట్రాడే ట్రేడర్లు, సెక్షన్ 44ఏడీ, 44ఏడీఏ, 44ఏఈ కింద ప్రిజంప్టివ్ టాక్స్ ఎంచుకున్న వ్యాపారులు ఈ గడువును గుర్తుంచుకోవడం తప్పనిసరి.

2. బ్యాంకింగ్ సేవల రుసుముల్లో మార్పులు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) సమావేశం ఆగస్టు 3 నుంచి ఆగస్టు 5 వరకు జరగనుంది. అనంతరం ఆగస్టు 5న ఆర్బీఐ తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. బ్యాంక్ రుణాలు, డిపాజిట్లు ఉన్న వారికి ఈ నిర్ణయం ఎంతో కీలకం. రెపో రేటులో చేసే ఏ చిన్న మార్పు అయినా హోమ్ లోన్ ఈఎంఐలు, బ్యాంక్ రుణ వడ్డీ రేట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్​డీ) రాబడులపై నేరుగా ప్రభావం చూపుతుంది.

4. కొత్త తత్కాల్ టికెట్ బుకింగ్ విధానం..

కౌంటర్ల వద్ద తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో ఆగస్టు 1 నుంచి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది భారతీయ రైల్వే. నూతన నిబంధనల ప్రకారం ప్రయాణికులు టికెట్ బుకింగ్ చేసుకునే ముందే టోకెన్లను పొందాల్సి ఉంటుంది. గతంలో టోకెన్ తీసుకున్న తర్వాత చాలా సమయం నిరీక్షించి మళ్లీ రావలసి వచ్చేది. కానీ ఈ సవరించిన విధానం వల్ల ప్రయాణికులు ఒక్కసారి వెళ్తేనే తత్కాల్ బుకింగ్ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. దీనివల్ల క్యూ లైన్లలో నిరీక్షణ సమయం తగ్గి, ప్రయాణికులకు బుకింగ్ సులభతరం కానుంది.

5. సీకేవైసీ 2.0 అమల్లోకి..

కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ కేవైసీ కొత్త విధానాన్ని ఆగస్టు 1 నుంచి ప్రారంభించింది. ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ ద్వారా వినియోగదారులు తమ అనుమతి తెలియజేస్తే చాలు.. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ వంటి అన్ని ఆర్థిక సంస్థలు అభ్యర్థి కేవైసీ వివరాలను నేరుగా యాక్సెస్ చేయవచ్చు. గతంలో ప్రతి బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ సంస్థ వద్దకు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా డాక్యుమెంట్లు సమర్పించాల్సి వచ్చేది. కానీ ఈ నూతన డిజిటల్ విధానంతో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks