...
...
Next Story

Ranji Trophy: ఇండియా క్రికెట్లో హిస్టరీ.. 69 ఏళ్ల తర్వాత తొలిసారి.. రంజీ ట్రోఫీ సొంతం చేసుకున్న జమ్ము కశ్మీర్

Ranji Trophy: అద్భుతం జరిగింది. ఇండియా క్రికెట్లో ఇదో కొత్త హిస్టరీ. 69 ఏళ్ల తర్వాత తొలిసారి జమ్ము కశ్మీర్ రంజీ ట్రోఫీ ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో కర్ణాటకపై విజయం సాధించింది.

Published on: Feb 28, 2026, 16:18:29 IST
Advertisement

ఇండియా డొమెస్టిక్ క్రికెట్లో సంచలనం. 69 ఏళ్ల తమ రంజీ ట్రోఫీ ప్రయాణంలో జమ్ము కశ్మీర్ మొట్టమొదటి సారి ఛాంపియన్ గా నిలిచింది. రంజీ ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. శనివారం (ఫిబ్రవరి 28) రంజీ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటకపై విజయంతో జమ్ము కశ్మీర్ కొత్త చరిత్ర లిఖించింది. భారత దేశవాళీ క్రికెట్లో తన ప్రస్థానాన్ని ఘనంగా చాటింది.

69 ఏళ్ల తర్వాత

జమ్ము కశ్మీర్ టీమ్ (PTI)
జమ్ము కశ్మీర్ టీమ్ (PTI)

1959లో జమ్ము కశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీలో ఆడింది. అప్పటి నుంచి టైటిల్ వేట కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు 69 ఏళ్ల తర్వాత ఆ టీమ్ కల నెరవేరింది. ఇవాళ ఫైనల్లో కర్ణాటకపై విజయంతో తొలిసారి రంజీ ట్రోఫీని సగర్వంగా అందుకుంది. భారత క్రికెట్ చరిత్రలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని చెప్పొచ్చు.

8 సార్లు విజేత

రంజీ ట్రోఫీ 2026 ఫైనల్లో జమ్ము కశ్మీర్ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 సార్లు రంజీ ట్రోఫీ ఛాంపియన్ అయిన కర్ణాటకను జమ్ము కశ్మీర్ ఓడించింది. పారస్ డోగ్రా కెప్టెన్సీలోని జమ్ము కశ్మీర్ ఈ తుదిపోరులో అసలైన ఛాంపియన్ లాగే ఆడింది. మ్యాచ్ డ్రాగా ముగిసినా కర్ణాటకపై ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యంతో జమ్ము కశ్మీర్ విజేతగా నిలిచింది.

శుభమ్ అదుర్స్

రంజీ ట్రోఫీ ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జమ్ము కశ్మీర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 584 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌటైంది. శుభమ్ పుందిర్ 121 రన్స్ తో అదరగొట్టాడు. యావర్ హాసన్ 88, సాహిల్ లోత్రా 72, కెప్టెన్ పారస్ 70, కన్హయ్య 70 కూడా రాణించారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ధ్ 5 వికెట్లు తీసుకున్నాడు.

చెలరేగిన ఆఖిబ్

అనంతరం రెండో ఇన్నింగ్స్ ను జమ్ము కశ్మీర్ 342/4 స్కోరు దగ్గర డిక్లేర్ చేసింది. ఓపెనర్ ఖమ్రాన్ ఇక్బావ్ 160 నాటౌట్ గా నిలిచాడు. సాహిల్ లోత్రా 101 రన్స్ తో అదరగొట్టాడు. అయిదో రోజు కర్ణాటక బ్యాటింగ్ చేసినా ఈ టార్గెట్ ఛేజ్ చేసే ఛాన్స్ లేకపోవడంతో రెండు టీమ్స్ కెప్టెన్ డ్రాకు ఒప్పుకొన్నారు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధారంగా జమ్ము కశ్మీర్ గెలిచింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks