కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన ఒక ప్రతినిధి బృందం కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసింది. వారు తమ మూడు ప్రధాన డిమాండ్ల జాబితాను నడ్డాకు సమర్పించారు. సీజేపీ తరపున సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా నడ్డాను కలిశారు. విద్యార్థుల డిమాండ్లపై నడ్డా, సీజేపీ బృందం సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఈ సమావేశం కోసం కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన ఇద్దరు ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, జేపీ నడ్డా వద్దకు వచ్చారు.

ఈ సందర్భంగా వారు తమ డిమాండ్ల జాబితాను జేపీ నడ్డాకు అందజేశారు. చర్చల కోసం ప్రభుత్వమే తమను సంప్రదించిందని సీజేపీ పేర్కొంది. ఇదిలా ఉండగా సోనమ్ వాంగ్చుక్ తన నిరాహార దీక్షను విరమించారు. 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్.. జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధుల భేటీ తర్వాత దీక్ష విరమిస్తున్నట్టుగా ప్రకటించారు.
సమావేశం అనంతరం తాను అశుతోష్ రాంకాతో కలిసి జేపీ నడ్డా నివాసంలో ఆయనను కలిసినట్లు సౌరవ్ దాస్ ఒక సోషల్ మీడియా పోస్ట్లో తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయడం లేదా ఆయన్ను పదవి నుంచి తొలగించడం వంటి తమ డిమాండ్లను ఆయనకు సమర్పించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని తగిన స్థాయిలో చర్చిస్తానని జేపీ నడ్డా వారికి హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి గట్టి హామీ లభించలేదు. తమ డిమాండ్లు నెరవేరే వరకు శాంతియుత నిరసన కొనసాగిస్తామని కాక్రోచ్ జనతా పారటీ స్పష్టం చేసింది.
కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చల్లో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు 3 కీలక డిమాండ్లను ముందుకు తెచ్చారు
1. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేయాలి
{{/usCountry}}1. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేయాలి
{{/usCountry}}2. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలి
3. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలి.
ఈ గందరగోళం మధ్య కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ల మధ్య ఒక కీలక సమావేశం జరిగింది. విద్యార్థుల పార్లమెంట్ మార్చ్ జరుగుతున్న వేళ జరిగిన ఈ సమావేశం సుమారు గంటసేపు కొనసాగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, హోం మంత్రి అమిత్ షా కాక్రోచ్ జనతా పార్టీ.. నిరసనపై చర్చించారు.
సీజేపీ పార్లమెంట్ మార్చ్ అనంతరం ప్రభుత్వం, ప్రతినిధి బృందం మధ్య చర్చలు కొనసాగుతుండగా పోలీసులు జంతర్ మంతర్ వద్ద నిరసనకారులను చెదరగొట్టడం ప్రారంభించారు. జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదేశాన్ని పోలీసులు ఖాళీ చేయించి, ధర్నా చేస్తున్న సీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. అంతేకాకుండా మార్చ్ సందర్భంగా పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ సమీపానికి చేరుకున్న నిరసనకారులను కూడా తొలగించారు. కాక్రోచ్ పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్తో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.