...
...
Next Story

Kia upcoming SUV : సైరోస్​ కంటే పెద్దగా, సెల్టోస్​ కంటే చిన్నగా! కియా నుంచి కొత్త ఎస్​యూవీ..

భారత మార్కెట్లో కియా కంపెనీ సైరోస్, సెల్టోస్ మధ్యలో సరికొత్త ఎస్‌యూవీని తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. సుమారు 4.2 మీటర్ల పొడవుతో రానున్న ఈ మోడల్​పై ఇప్పటి వరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 18, 2026, 10:01:07 IST
Advertisement

భారత ఆటోమొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న కియా మోటార్స్ మరో కొత్త ఎస్‌యూవీని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీకి చెందిన పాపులర్ మోడల్స్ సైరోస్. సెల్టోస్ మధ్యలో ఈ కొత్త వాహనాన్ని ప్రవేశపెట్టాలని ప్రణాళిక రచిస్తోంది.

కియా నుంచి కొత్త ఎస్​యూవీ..
కియా నుంచి కొత్త ఎస్​యూవీ..

కొత్త తరం సెల్టోస్ ధరలు క్రమంగా పెరుగుతుండటంతో, స్థానికంగా ఉత్పత్తి చేసే లైనప్‌ను మరింత విస్తరించాలని కియా భావిస్తోంది. ఇందులో భాగంగానే సైరోస్ కంటే కాస్త పెద్దదిగా, సెల్టోస్ కంటే తక్కువ ధరలో ఈ కొత్త బీ-సెగ్మెంట్ మోడల్ సుమారు 4.2 మీటర్ల పొడవుతో మార్కెట్లోకి రానుందని అంచనా వేస్తున్నారు.

కియా కొత్త ఎస్​యూవీ- ధరల అంతరాన్ని పూడ్చే ప్రయత్నం..

ప్రస్తుతం సైరోస్ ధర రూ. 8.42 లక్షల నుంచి రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది సెల్టోస్ ధరలతో కొంత ఓవర్‌లాప్ అవుతుండగా, మరోవైపు కొన్ని వేరియంట్ల మధ్య పెద్ద ఖాళీ కూడా ఏర్పడుతోంది.

సైరోస్ కంటే పెద్ద వాహనం కోరుకునే వారికి, అలాగే సెల్టోస్ కంటే కాస్త తక్కువ బడ్జెట్‌లో లభించే చక్కని ప్రత్యామ్నాయంగా ఈ 4.2 మీటర్ల ఎస్‌యూవీ నిలవనుంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న కియా టెల్లురైడ్ వంటి మోడళ్ల నుంచి ప్రేరణ పొందిన సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌ను మరింత ఎక్కువ మందికి చేరువ చేయడానికి ఈ కొత్త మోడల్ చక్కటి వేదిక కానుంది.

Upcoming cars in India : ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న ఈవీలు, ఎస్​యూవీలు, సెడాన్​లు..

కియా కొత్త ఎస్​యూవీ- ఇంజిన్, పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు..

ఈ కియా కొత్త ఎస్‌యూవీ ఎక్స్​టీరియర్, క్యాబిన్ లేఅవుట్, ఫీచర్ల విషయంలో విభిన్నమైన శైలిని కలిగి ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఇందులో పలు రకాల ఇంజిన్ ఆప్షన్లను పరిశీలిస్తోంది.

  • 1.2 లీటర్ లేదా 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్
  • 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్
  • 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్

ఇదిలా ఉంటే, త్వరలో మార్కెట్లోకి రానున్న సోరెంటో, సెల్టోస్ మధ్య ఉన్న మరో పెద్ద ఖాళీని భర్తీ చేసే దిశగా కూడా కియా అడుగులు వేస్తోంది. సుమారు రూ. 35 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో రానున్న సోరెంటోతో పాటు మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్ఓ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేలా మరో సీ-సెగ్మెంట్ మోడల్‌ను కూడా కంపెనీ పరిశీలిస్తోంది.

హ్యుందాయ్ తన కొత్త తరం క్రెటా ఆధారిత హైబ్రిడ్ మోడల్‌ను తెస్తుండటంతో, కియా ఈ సెగ్మెంట్‌లో ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks