మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన 'మున్సిపల్ కురుక్షేత్రం' మొదలైంది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సహా రాష్ట్రంలోని 29 నగర పాలక సంస్థలకు గురువారం ఉదయం 7:30 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5:30 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 893 వార్డుల్లోని 2,869 సీట్ల కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
అభ్యర్థుల జాతకం తేల్చనున్న 3.48 కోట్ల ఓటర్లు

ఈ ఎన్నికల బరిలో మొత్తం 15,931 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో ముంబై నుంచి 1,700 మంది, పూణే నుంచి 1,166 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.48 కోట్ల మంది ఓటర్లు ఈ నిర్ణయాత్మక ఘట్టంలో భాగస్వాములు కాబోతున్నారు. ముంబై, పూణేలతో పాటు పింప్రి-చించ్వాడ్, కొల్హాపూర్, వసాయ్-విరార్, కళ్యాణ్-డోంబివిలి, నాగ్పూర్, సోలాపూర్, అమరావతి, థానే, పర్బానీ వంటి కీలక నగరాల్లో పోలింగ్ వాడీవేడిగా సాగుతోంది.
కట్టుదిట్టమైన భద్రత.. పింక్ బూత్ల సందడి
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక్క ముంబైలోనే 25,000 మందికి పైగా పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు.
"ప్రతి ఓటింగ్ కేంద్రం వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నాం. ముంబై అంతటా ఓటర్లను ప్రోత్సహించేందుకు సెల్ఫీ పాయింట్లు, మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ బూత్లు ఏర్పాటు చేశాం" అని బీఎంసీ అధికారులు వెల్లడించారు.
ఈవీఎంల పంపిణీ పూర్తి చేసి, కౌంటింగ్ కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూమ్లను పటిష్టం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం (జనవరి 16) ఫలితాలను ప్రకటించనున్నారు.
ముంబైపై గురి.. ఠాక్రే సోదరుల ఐక్యపోరు
అన్నిటికంటే ప్రధానంగా ముంబై (BMC) పీఠంపైనే అందరి కళ్లు ఉన్నాయి. గత 26 ఏళ్లుగా శివసేన గుప్పిట్లో ఉన్న బీఎంసీని ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీజేపీ నేతృత్వంలోని 'మహాయుతి' కూటమి గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే, విడిపోయిన ఠాక్రే సోదరులు (రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే) 2005 తర్వాత మళ్లీ చేతులు కలపడం ఈ ఎన్నికల్లో అతిపెద్ద మలుపు. శివసేన (UBT), ఎంఎన్ఎస్ కలిసి పోటీ చేస్తుండగా.. అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (SP) తో కొన్ని చోట్ల పొత్తు పెట్టుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఓటరును వేధిస్తున్న ప్రధాన సమస్యలు
{{/usCountry}}అన్నిటికంటే ప్రధానంగా ముంబై (BMC) పీఠంపైనే అందరి కళ్లు ఉన్నాయి. గత 26 ఏళ్లుగా శివసేన గుప్పిట్లో ఉన్న బీఎంసీని ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీజేపీ నేతృత్వంలోని 'మహాయుతి' కూటమి గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే, విడిపోయిన ఠాక్రే సోదరులు (రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే) 2005 తర్వాత మళ్లీ చేతులు కలపడం ఈ ఎన్నికల్లో అతిపెద్ద మలుపు. శివసేన (UBT), ఎంఎన్ఎస్ కలిసి పోటీ చేస్తుండగా.. అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (SP) తో కొన్ని చోట్ల పొత్తు పెట్టుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఓటరును వేధిస్తున్న ప్రధాన సమస్యలు
{{/usCountry}}నగరాల్లో నిత్యం ప్రజలను ఇబ్బంది పెట్టే సమస్యలే ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మారాయి. వర్షాకాలంలో ముంబైని ముంచెత్తే వరదలు, అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్, గుంతల రోడ్లు, కలుషిత గాలి వంటి అంశాల ఆధారంగానే ఓటర్లు తమ తీర్పును ఇవ్వనున్నారు.
పాలకపక్షం మహిళలకు బస్సు ప్రయాణంలో 50 శాతం రాయితీ ఇస్తామని హామీ ఇవ్వగా.. విపక్ష కూటమి గృహ కార్మికులకు నెలకు రూ. 1,500 భృతి ఇస్తామని వాగ్దానం చేసింది.