Electric cars : దూసుకెళుతున్న మహీంద్రా బీఈ 6- ఇక బీ07 వంతు! లాంచ్​ ఎప్పుడంటే..

మహీంద్రా తన తదుపరి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'బీ07' లాంచ్ టైమ్‌లైన్‌ను 2027కు మార్చింది. బార్న్ ఎలక్ట్రిక్ సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ కారు, ఇప్పటికే మార్కెట్​లో దుమ్మురేపుతున్న బీఈ6, ఎక్స్​ఈవీ మోడళ్ల కంటే అడ్వాన్స్‌డ్​గా ఉండబోతోంది.

Published on: Feb 27, 2026, 06:45:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎస్​యూవీలకు పెట్టింది పేరైనా మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ.. ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతున్న టాటా మోటార్స్​కి గట్టిపోటీని ఇస్తోంది. ఇందులో భాగంగానే గతేడాది.. బార్న్​ ఎలక్ట్రిక్​ సిరీస్​లో భాగంగా లాంచ్​ అయిన మహీంద్రా బీఈ 6, ఎక్స్​ఈవీ 9ఈ, ఎక్స్​ఈవీ 9ఎస్​కి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మరీ ముఖ్యంగా బీఈ 6 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీకి మంచి క్రేజ్​ కనిపిస్తోంది. ఈ మోడల్​ భారత రోడ్లపై దూసుకెళుతోంది. ఇక ఇప్పుడు ఇదే జోరును కొనసాగిస్తూ.. మహీంద్రా సంస్థ తన నెక్ట్స్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని ఇండియాలో లాంచ్​ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

మహీంద్రా బీ07 లాంచ్​ అప్​డేట్​.. (Representative image)
మహీంద్రా బీ07 లాంచ్​ అప్​డేట్​.. (Representative image)

ప్రస్తుతం అంతర్గతంగా 'బీ07' అనే కోడ్ నేమ్‌తో పిలుస్తున్న ఈ కొత్త ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 2027లో మార్కెట్​లోకి అడుగుపెట్టనుంది. నిజానికి ఇది 2026 చివరి నాటికే రావాల్సి ఉన్నప్పటికీ, కంపెనీ ఈ గడువును మరుసటి ఏడాదికి పొడిగించింది. ఈ విషయాన్ని మహీంద్రా ఆటో అండ్ ఫార్మ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజూరికర్ స్వయంగా వెల్లడించారు.

మహీంద్రా బీ07 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ- పేరు మారనుంది..

'బీ07' అనేది కేవలం కంపెనీ పెట్టుకున్న కోడ్ నేమ్ మాత్రమేనని, మార్కెట్​లోకి వచ్చే సమయానికి దీనికి సరికొత్త బ్రాండ్ పేరును ఖరారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇది 2022లో ప్రదర్శించిన 'బీఈ.07' కాన్సెప్ట్ ఆధారంగా తయారవుతోంది.

మార్కెట్​లో మహీంద్రా ఈవీల జోరు..

మహీంద్రా ఇప్పటికే తన ఎలక్ట్రిక్ వ్యూహాన్ని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తోంది. 2022లో చూపించిన 5 కాన్సెప్ట్ కార్లలో ఇప్పటికే మూడు రోడ్ల మీదకు వచ్చాయి:

BE.05 మోడల్ ఇప్పుడు BE6 పేరుతో సేల్ అవుతోంది.

ఎక్స్​యూవీ.ఈ8, ఎక్స్​యూవీ.ఈ9 మోడళ్లు వరుసగా ఎక్స్​ఈవీ 9ఎస్​, ఎక్స్​ఈవీ 9ఈలుగా మారాయి.

ఈ కార్లకు కస్టమర్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. కేవలం ఏడాది లోపే బీఈ 6, ఎక్స్​ఈవీ 9ఈ మోడళ్లు కలిపి ఏకంగా 41,000 యూనిట్ల విక్రయాలను సాధించడం విశేషం. తాజాగా విడుదలైన ఎక్స్​ఈవీ 9ఎస్​ కూడా మంచి అమ్మకాలను నమోదు చేస్తోంది. ఈ ఊపును 'బీ07' మరింత పెంచుతుందని కంపెనీ ధీమాగా ఉంది.

మహీంద్రా బీ07- టెక్నాలజీ, పవర్..

రాబోయే బీ07 ఎస్‌యూవీ మహీంద్రా సుప్రసిద్ధ 'INGLO' ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందుతోంది. ఇందులో కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా 60 కేడబ్ల్యూహెచ్​ నుంచి 80 కేడబ్ల్యూహెచ్​ వరకు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. డిజైన్ పరంగా ప్రస్తుత ఈవీల మాదిరిగానే మోడ్రన్ లుక్‌ను కలిగి ఉంటుంది.

మహీంద్రా బీ07- హై-టెక్ ఇంటీరియర్..

కాన్సెప్ట్ వెర్షన్‌లో చూపించిన విధంగానే, ఈ కారులో డాష్‌బోర్డ్ అంతటా విస్తరించి ఉండే భారీ ట్రిపుల్-స్క్రీన్ సెటప్, పనోరమిక్ సన్‌రూఫ్, ఫిజికల్ బటన్లు లేని టచ్-బేస్డ్ కంట్రోల్స్ ఉండబోతున్నాయి. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్​), కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఓవర్-ది-ఎయిర్ (ఓటీఏ) అప్‌డేట్స్ వంటి ఫీచర్లు ఈ కారు సొంతం.

ఈ మహీంద్రా బీ07 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీకి సంబంధించి రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. మహీంద్రా బీ07 ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం (రేంజ్​) ప్రయాణిస్తుంది?

సమాధానం- మహీంద్రా బీ07 ఎస్‌యూవీలో 60 kWh నుంచి 80 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ఈ కారు ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో సుమారు 450 నుంచి 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుందని అంచనా. అంతేకాకుండా, ఇది 175 kW ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది, దీని ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే 5% నుంచి 80% వరకు ఛార్జింగ్ చేసుకోవచ్చు.

2. మార్కెట్​లో ఈ కారు ధర ఎంత ఉండవచ్చు, దీనికి పోటీదారులు ఎవరు?

సమాధానం- మహీంద్రా బీ07 ధర సుమారు రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇది ప్రీమియం మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో వస్తున్నందున, మార్కెట్​లో దీనికి పోటీగా టాటా హారియర్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఈవీ, మారుతీ సుజుకీ ఈ విటార వంటి మోడళ్లు నిలవనున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More