మహీంద్రా XUV 7XO లాంచ్​ రేపే- బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీ అవుతుందా?

మహీంద్రా నుంచి మోస్ట్ అవైటెడ్ ఎస్‌యూవీ 'ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ' రేపు (జనవరి 5న) విడుదల కానుంది. ఎక్స్​యూవీ700కి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా వస్తున్న ఈ కారులో ట్రిపుల్ స్క్రీన్ సెటప్, అడ్వాన్స్‌డ్ ఏడాస్ వంటి విప్లవాత్మక మార్పులు ఉండనున్నాయి.

Published on: Jan 4, 2026, 12:20:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో పోటీని మరో స్థాయికి తీసుకెళుతూ, మహీంద్రా తన సరికొత్త ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓను రేపు (జనవరి 5) మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతోంది. గతంలో ఎక్స్​యూవీ500, ప్రస్తుతం ఎక్స్​యూవీ700గా మనకు సుపరిచితమైన మోడల్‌కు ఇది అత్యాధునిక 'ఫేస్‌లిఫ్ట్' వెర్షన్. ఇప్పటికే టీజర్లతో అంచనాలను పెంచేసిన మహీంద్రా, సోమవారం ఈ కారు పూర్తి ధరలను, ఫీచర్లను అధికారికంగా వెల్లడించనుంది.

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ..
మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ..

మీరు ఈ కొత్త ఫ్యామిలీ ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే లాంచ్‌కు ముందే ఈ ఎస్​యూవీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ..

1. ఎక్స్‌టీరియర్: మరింత పవర్‌ఫుల్ లుక్..

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ డిజైన్ చాలా బోల్డ్‌గా, స్టైలిష్​గా ఉండబోతోంది.

ముందు భాగం: రీడిజైన్ చేసిన సరికొత్త గ్రిల్, దాని పైభాగంలో స్లీక్ ఎల్‌ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు ఉంటాయి. ఇందులో కొత్త డ్యూయల్-పాడ్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, అగ్రెసివ్ బంపర్ ఉండనున్నాయి.

దీని లుక్ ఇటీవలే విడుదలైన ఎక్స్​ఈవీ 9ఎస్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ పోలి ఉంటుంది.

సైడ్ అండ్​ రియర్: కొత్తగా డిజైన్ చేసిన 18-ఇంచ్​ అలాయ్ వీల్స్, బాడీలోకి కలిసిపోయే 'ఫ్లష్' డోర్ హ్యాండిల్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, రూఫ్ స్పాయిలర్, షార్క్-ఫిన్ యాంటెన్నా ఈ కారుకు ప్రీమియం లుక్ ఇస్తాయి. టీజర్లలో చూపిన విధంగా 'ఎక్స్​ఈవీ 9ఎస్​' తరహాలోనే సరికొత్త 'రెడ్' కలర్ వేరియంట్ రాబోతోంది.

2. ఇంటీరియర్: లగ్జరీ అండ్ టెక్నాలజీ..

ఎక్స్​యూవీ 700తో పోలిస్తే ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ క్యాబిన్ మరింత ఆధునికంగా ఉంటుంది.

ట్రిపుల్ స్క్రీన్ సెటప్: ఈ ఎస్​యూవీ డాష్‌బోర్డ్‌లో మూడు స్క్రీన్లు ఉంటాయి. ఒకటి ఇన్‌ఫోటైన్‌మెంట్ కోసం, రెండోది డ్రైవర్ డిస్‌ప్లే, మూడోది కారులోని ఇతర ఫంక్షన్లను నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఉంటుంది.

కొత్త స్టీరింగ్: సరికొత్త లోగోతో కూడిన 'టూ-స్పోక్' ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ప్రయాణాన్ని మరింత సుఖతరం చేస్తుంది. వైట్ థీమ్ వల్ల క్యాబిన్ లోపల చాలా విశాలంగా అనిపిస్తుంది.

3. అదిరిపోయే ఫీచర్లు..

ఫీచర్ల విషయంలో మహీంద్రా ఈసారి కూడా ఎక్కడా తగ్గలేదు.

12.3 ఇంచ్​ టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, 16-స్పీకర్ల హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ సీట్లు, వెన్లటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం ఈ మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఎస్​యూవీలో ఉంటుంది.

వెనుక సీటు ప్రయాణికుల కోసం కూడా వెన్లటిలేషన్, వైర్‌లెస్ ఛార్జర్, ‘బ్రింగ్ యువర్ ఓన్ డివైజ్’ ఫీచర్లను అందిస్తున్నారు.

4. భద్రత: ఏ విషయంలోనూ రాజీ లేదు..

సేఫ్టీకి మారుపేరుగా నిలిచే మహీంద్రా ఈ ఫ్యామిలీ ఎస్​యూవీలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు (6 స్టాండర్డ్), ఈఎస్‌సీ, హిల్‌ హోల్డ్ అసిస్ట్‌లను అందిస్తోంది. టాప్ వేరియంట్లలో 540-డిగ్రీ కెమెరాతో పాటు అడ్వాన్స్‌డ్ అడాస్ లెవల్-2 ఉంటుంది. దీనివల్ల అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి సదుపాయాలు లభిస్తాయి.

5. అంచనా ధర..

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 15 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రేపటి లాంచ్​తో దీనిపై క్లారిటీ వస్తుంది.

ఇప్పటికే రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

ఈ ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ.. మార్కెట్​లో టాటా సఫారీ, మహీంద్రా స్కార్పియో-ఎన్, హ్యుందాయ్ అల్కాజార్, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More