...
...
Next Story

Maruti Suzuki e Vitara : కస్టమర్లకు షాక్ ఇచ్చిన మారుతీ సుజుకీ- ఈ విటారా ధర పెంపు! ఎంతంటే..

Maruti Suzuki e Vitara price : మారుతీ సుజుకీ తన పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ విటారా' ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మార్కెట్లోకి విడుదలైన తర్వాత ఈ కారు ధరలు పెరగడం ఇదే మొదటిసారి. ఎంపిక చేసిన కొన్ని వేరియంట్లపై గరిష్టంగా రూ.30,000 వరకు ధర పెరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Jun 23, 2026, 10:43:55 IST
Advertisement

భారత ఆటోమొబైల్ రంగానికి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతీ సుజుకీ’ వాహనదారులకు షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో దేశీయ మార్కెట్లోకి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తన మొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘ఈ విటారా’ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ కారు ధర సవరించడం ఇదే తొలిసారి. అయితే, ఈ ధరల పెంపు అన్ని వేరియంట్లకు వర్తించదు. కేవలం ఎంపిక చేసిన కొన్ని మోడళ్లపై మాత్రమే ధరలను పెంచింది సంస్థ. కారు బేస్ వేరియంట్ మాత్రం పాత ధరకే లభించనుంది.

మారుతీ సుజుకీ ఈ విటారా..
మారుతీ సుజుకీ ఈ విటారా..

ఈ ధరల పెంపులో భాగంగా గరిష్టంగా రూ. 30,000 వరకు పెంచారు. ముఖ్యంగా ఎక్కువ ఫీచర్లు ఉండే టాప్-ఎండ్ వేరియంట్లపైనే ఈ ప్రభావం ఎక్కువగా పడింది. 49 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే బేస్ మోడల్ 'డెల్టా' వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇది ఎక్స్-షోరూమ్ వద్ద పాత ధర అయిన రూ. 15.99 లక్షలకే లభిస్తుంది. కానీ, పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే మిగిలిన వేరియంట్ల ధరలను మాత్రం కంపెనీ పెంచింది.

తాజా మార్పుల తర్వాత, మారుతీ ఈ విటారా శ్రేణి ప్రారంభ ధర రూ. 15.99 లక్షలుగా ఉండగా, టాప్-ఎండ్ వేరియంట్ల ధరలు ఇప్పుడు రూ. 20 లక్షల మార్కును దాటేశాయి. కారు తయారీ ఖర్చులు (ఇన్‌పుట్ కాస్ట్) పెరగడం వల్లే తమ పోర్ట్‌ఫోలియోలోని కార్ల ధరలను రూ. 30,000 వరకు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ కొన్ని వారాల క్రితమే ప్రకటించింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ విటారా ధరలను కూడా సవరించింది.

మారుతీ సుజుకీ ఈ విటారా- బ్యాటరీ ఆప్షన్లు, రేంజ్..

మారుతీ సుజుకీ ఈ విటారా ఎలక్ట్రిక్ కారు రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో ఒకటి 49 కేడబ్ల్యూహెచ్ యూనిట్ కాగా, మరొకటి పెద్దదైన 61 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్. మనం ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే గరిష్టంగా 543 కిలోమీటర్ల దూరం (డ్రైవింగ్ రేంజ్) ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. టెక్నాలజీ, సేఫ్టీ పరంగా కూడా ఈ కారులో అధినేత ఫీచర్లు ఉన్నాయి. కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, డ్యూయల్ స్క్రీన్ సెటప్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్)తో పాటు ప్రయాణికుల రక్షణ కోసం పటిష్టమైన సేఫ్టీ ఫీచర్లను ఇందులో అందించారు.

సరికొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీపై మారుతీ సుజుకీ కసరత్తు..!

స్పై చిత్రాల (టెస్టింగ్ ఫొటోలు) ప్రకారం.. ఈ కొత్త కారుకు స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్, ఎరోడైనమిక్ స్టైల్ వీల్స్, సాధారణ పుల్-టైప్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. కారు అద్దాలు (గ్లాస్ ఏరియా) పెద్దవిగా ఉండటం వల్ల లోపల కూర్చునే ప్రయాణికులకు మంచి కంఫర్ట్, విశాలమైన వాతావరణం లభిస్తుంది.

కారు వెనుక భాగంలో ఫ్లాట్ టెయిల్‌గేట్, రియర్ వైపర్, లావుపాటి బంపర్ ఉన్నాయి. ఇక ముందు భాగం డిజైన్, ముఖ్యంగా గ్రిల్, బంపర్ ఏరియా చూడటానికి కొంతవరకు ఈ విటారా కారును పోలి ఉంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీకి సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా రహస్యంగానే ఉంచింది. అయితే, మారుతీ సుజుకీ రాబోయే ఈవీ పోర్ట్‌ఫోలియోలోని భాగాలనే దీనికి కూడా ఉపయోగించనున్నారు. ఈ వితారా తర్వాత మారుతీ బ్రాండ్ నుంచి రాబోతున్న రెండో ఆల్-ఎలక్ట్రిక్ కారు ఇదే అయ్యే అవకాశం ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe