న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించడం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు బుధవారం దిల్లీలో ఈసీ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. నామినేషన్ రద్దును పూర్తిగా చట్టవిరుద్ధం, ఏకపక్షం అని కాంగ్రెస్ ఎంపీలు అభిషేక్ మను సింఘ్వీ, కేసీ వేణుగోపాల్ తీవ్రంగా ఖండించారు.
క్రిమినల్ కేసుల్లేవు.. అదంతా అపోహే

సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడారు. మీనాక్షి నటరాజన్పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ఆయన స్పష్టం చేశారు.
"చట్టప్రకారం ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసూ లేదు, రుజువూ కాలేదు. అలాంటప్పుడు అఫిడవిట్లో దేని గురించి వెల్లడించాలి? ఇదంతా కేవలం ఒక అపోహతో రిటర్నింగ్ అధికారి తీసుకున్న తప్పుడు నిర్ణయం" అని సింఘ్వీ పేర్కొన్నారు.
రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఈసీకి సమర్పించిన సుదీర్ఘ నివేదికలో డిమాండ్ చేసింది.
అసలేం జరిగింది?
రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన అఫిడవిట్లో కొన్ని కీలక సమాచారాలను దాచారంటూ బీజేపీ నేత రాహుల్ కొఠారి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ (CJM) కోర్టు జారీ చేసిన సమన్ల వివరాలను ఆమె అఫిడవిట్లో పేర్కొనలేదని బీజేపీ ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా స్క్రూటినీ అనంతరం ఆమె నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఈ నిర్ణయానికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు దిల్లీ, భోపాల్లలోని ఈసీ కార్యాలయాల ఎదుట భారీ ధర్నాలకు దిగారు.
రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు: మీనాక్షి
ఈ వివాదంపై మీనాక్షి నటరాజన్ కూడా స్పందించారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ దక్కించుకోవాల్సిన రాజ్యసభ సీటును అక్రమ మార్గాల్లో లాక్కునేందుకే బీజేపీ ఇలాంటి కుతంత్రాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాత్రం ఎన్నికల అధికారి నిర్ణయాన్ని స్వాగతించారు. క్రిమినల్ రికార్డులను దాచినందుకే ఆమె నామినేషన్ రద్దయిందని ఆయన సమర్థించారు.
న్యాయపరమైన చిక్కులు లేవు: సింఘ్వీ వివరణ
{{/usCountry}}ఈ వివాదంపై మీనాక్షి నటరాజన్ కూడా స్పందించారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ దక్కించుకోవాల్సిన రాజ్యసభ సీటును అక్రమ మార్గాల్లో లాక్కునేందుకే బీజేపీ ఇలాంటి కుతంత్రాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాత్రం ఎన్నికల అధికారి నిర్ణయాన్ని స్వాగతించారు. క్రిమినల్ రికార్డులను దాచినందుకే ఆమె నామినేషన్ రద్దయిందని ఆయన సమర్థించారు.
న్యాయపరమైన చిక్కులు లేవు: సింఘ్వీ వివరణ
{{/usCountry}}ఈసీ అధికారులను కలవడానికి ముందే అభిషేక్ మను సింఘ్వీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా కోర్టు కేవలం నోటీసు మాత్రమే ఇచ్చిందని, ఆ నోటీసుపై కోర్టు ఇంకా ఎలాంటి విచారణను (Cognizance) అధికారికంగా స్వీకరించలేదని స్పష్టం చేశారు. ఆమె వివరణ విన్న తర్వాతే విచారణకు స్వీకరించాలా వద్దా అనేది కోర్టు తేలుస్తుందని, కాబట్టి దీనిని క్రిమినల్ కేసుగా పరిగణించలేమని వివరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, అఫిడవిట్లో తప్పులు ఉన్నాయనడం ముమ్మాటికీ అబద్ధమని కొట్టిపారేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర పరిశీలన జరుపుతామని ఈసీ హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.
మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు కావడంతో మధ్యప్రదేశ్ నుంచి బరిలో ఉన్న ముగ్గురు బీజేపీ అభ్యర్థుల రాజ్యసభ ఎన్నిక దాదాపు ఏకగ్రీవం కానుంది.