...
...
Next Story

6,6,6,6,6,6,6,6,.. వరుసగా 8 సిక్సర్లు.. 11 బాల్స్ లోనే ఫిఫ్టీ.. రంజీ మ్యాచ్ లో వరల్డ్ రికార్డు

దేశవాళీ రంజీ మ్యాచ్ లో హిస్టరీ క్రియేట్ అయింది. ప్రపంచ రికార్డు నమోదైంది. వరుసగా 8 సిక్సర్లు కొట్టడంతో పాటు 11 బాల్స్ లోనే ఫిఫ్టీ చేసిన మేఘాలయ ఆటగాడు చరిత్ర తిరగరాశాడు.

Published on: Nov 9, 2025, 19:41:01 IST
Advertisement

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో వరుసగా ఎనిమిది సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా మేఘాలయకు చెందిన ఆకాశ్ కుమార్ చౌదరి రికార్డు సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్ తో రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్ లో కేవలం 11 బంతుల్లో ఫిఫ్టీ బాదాడు. అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేశాడు.

11 బంతుల్లో 50

ఆకాశ్ కుమార్ (x/imArshit)
ఆకాశ్ కుమార్ (x/imArshit)

ఆదివారం (నవంబర్ 9) అరుణాచల్ ప్రదేశ్ తో రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్ లో మేఘాలయ తరపున 8వ స్థానంలో బ్యాటింగ్ చేసిన 25 ఏళ్ల చౌదరి రెండో రోజు సికె పిథావాలా గ్రౌండ్ లో ఈ అద్భుత ఘనత సాధించాడు. అతను 14 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మేఘాలయ 6 వికెట్లకు 628 పరుగులతో తమ మొదటి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడానికి సహాయపడ్డాడు.

11 బంతుల్లో అర్ధశతకంతో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు ఆకాశ్ కుమార్. 2012లో ఎసెక్స్ తో జరిగిన మ్యాచ్ లో లీసెస్టర్ షైర్ కు చెందిన వేన్ వైట్ 12 బంతుల్లో నెలకొల్పిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ రికార్డును చౌదరి బద్దలు కొట్టాడు.

8 సిక్సర్లు

మేఘాలయ ఆరు వికెట్లకు 576 పరుగులతో ఉన్నప్పుడు ఆకాశ్ కుమార్ క్రీజులోకి వచ్చాడు. ఓ బంతిని డాట్ ఆడాడు. రెండు సింగిల్స్ తీశాడు. ఆ తర్వాత 126వ ఓవర్ వేసిన లిమర్ దాబి బౌలింగ్ లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా గ్యారీ సోబర్స్, రవిశాస్త్రి తర్వాత నిలిచాడు.

1968 లో నాటింగ్ హామ్ షైర్, గ్లామోర్గాన్ మధ్య జరిగిన కౌంటీ మ్యాచ్ లో మాల్కం నాష్ బౌలింగ్ లో సోబర్స్ ఒక ఓవర్ లో ఆరు సిక్సర్లు సాధించిన ఘనతను నమోదు చేశాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీ 1984-85 మ్యాచ్ లో బరోడాతో బాంబే తరఫున ఆడుతున్నప్పుడు భారత మాజీ ఆల్ రౌండర్, మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి తిలక్ రాజ్ బౌలింగ్ లో వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe