దిల్లీలో 2012లో దేశాన్ని కుదిపేసిన 'నిర్భయ' దారుణాన్ని గుర్తుచేస్తూ గ్రేటర్ నోయిడాలో మరో ఘోరం వెలుగుచూసింది. కదులుతున్న ప్రైవేట్ స్లీపర్ బస్సులో 16ఏళ్ల బాలికపై బస్సు డ్రైవర్, కండక్టర్ దారుణంగా సమూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
తల్లి కోప్పడిందని ఇల్లు వదిలి వచ్చి..

ఉత్తరప్రదేశ్లోని మైన్పురి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక చదువు విషయంలో తల్లి కోప్పడటంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నోయిడా సెక్టార్ 63లో నివసిస్తున్న బంధువుల ఇంటికి బయలుదేరింది. ఆగస్టు 4న రాత్రి 9 గంటల సమయంలో కుండపోత వర్షం పడుతుండగా గ్రేటర్ నోయిడాలోని దట్టమైన చీకటితో నిండిన 'పరీ చౌక్' వద్ద ఆ బాలిక బస్సు దిగింది. అక్కడి నుంచి తాను వెళ్లాల్సిన ప్రదేశం ఇంకా 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అదే సమయంలో 'విశ్వనాథ్ ట్రావెల్స్' అనే ప్రైవేట్ సంస్థకు చెందిన ఒక స్లీపర్ బస్సు అక్కడకు చేరుకుంది. బస్సులో ప్రయాణికులెవరూ లేరు. సూరజ్పూర్ వర్క్షాప్ నుంచి తిరిగి వస్తున్న ఆ బస్సు డ్రైవర్ కుల్దీప్ (39), కండక్టర్ సందీప్ (26) బాలికను గమనించారు. తాము కూడా నోయిడా సెక్టార్ 63 వైపే వెళుతున్నామని నమ్మించి ఆమెను బస్సు ఎక్కించుకున్నారు.
స్లీపర్ బస్సులో ఘోరం!
బస్సు కదిలిన కొద్దిసేపటికే నిందితుల బుద్ధి మారింది. స్లీపర్ బెర్తులకు ఉన్న తెరలను ఆసరాగా చేసుకుని, బాలికపై కండక్టర్ లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఆ తర్వాత ఇద్దరూ కలసి ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. బాలిక కేకలు వేయడానికి ప్రయత్నించగా, తీవ్రంగా కొట్టి చంపేస్తామని బెదిరించారు.
అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను దిల్లీలోని కాశ్మీరీ గేట్ రింగ్ రోడ్డు సమీపంలో పడేసి పారిపోయారు. ధైర్యం తెచ్చుకున్న బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల వేట ప్రారంభమైంది.
దిల్లీలో పట్టుబడ్డ నిందితులు.. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ
{{/usCountry}}అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను దిల్లీలోని కాశ్మీరీ గేట్ రింగ్ రోడ్డు సమీపంలో పడేసి పారిపోయారు. ధైర్యం తెచ్చుకున్న బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల వేట ప్రారంభమైంది.
దిల్లీలో పట్టుబడ్డ నిందితులు.. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ
{{/usCountry}}బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బస్సు ప్రయాణించిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ఉత్తర దిల్లీలోని తిమార్పూర్ పార్కింగ్ స్థలంలో దాక్కున్న డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్లను అరెస్ట్ చేశారు.
నిందితులిద్దరూ గత రెండేళ్లుగా అదే ట్రావెల్స్ కంపెనీలో పనిచేస్తున్నారని తేలింది.
బాలికి గ్యాంగ్ రేప్నకు గురైన స్లీపర్ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం బస్సును పరిశీలించి బాలిక జుట్టు వెంట్రుకలు, ఇతర కీలక సాక్ష్యాలను సేకరించింది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రతపై ఈ ఘటన మళ్లీ అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.