బంగ్లాదేశ్ లో హిందువులపై హత్యలు సంచలనంగా మారాయి. ఈ హత్యలను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆడకుండా సంచలన నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. బీసీసీఐ ఆదేశాలతో ముస్తాఫిజుర్ ను తమ జట్టు నుంచి కేకేఆర్ తప్పించింది.
ముస్తాఫిజుర్ ఔట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ఎడిషన్కు ముందు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్పై వేటు పడింది. తమ జట్టు నుండి విడుదల చేయాలనే ఆదేశాలు వచ్చిన తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ (KKR) శనివారం (జనవరి 3) స్పందించింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) సెక్రటరీ దేవాజిత్ సైకియా పీటీఐతో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో ఇటీవల హిందువులు హత్యకు గురైన కారణంగా ముస్తాఫిజుర్ ను వదులుకోవాలని కేకేఆర్ చెప్పినట్లు తెలిపాడు.
రూ.9.20 కోట్లు
ఇటీవల ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను రూ.9.20 కోట్లకు కేకేఆర్ కొనుక్కుంది. "రాబోయే ఐపీఎల్ సీజన్కు ముందు ముస్తాఫిజుర్ రెహ్మాన్ను జట్టు నుండి విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించింది. సరైన ప్రక్రియ, సంప్రదింపుల తర్వాత ఆటగాణ్ని రిలీజ్ చేశాం. ఐపీఎల్ నిబంధనలకు అనుగుణంగా కోల్కతా నైట్ రైడర్స్కు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకునే అవకాశాన్ని బీసీసీఐ ఇచ్చింది’’ అని కేకేఆర్ ప్రకటనలో తెలిపింది.
అసలు వివాదం ఏమిటి?
గత కొన్ని రోజులుగా కేకేఆర్, దాని సహ-యజమాని షారుక్ ఖాన్ ను పలువురు రాజకీయ నాయకులు, సోషల్ మీడియా యూజర్లు టార్గెట్ చేశారు. జాతీయ సెంటిమెంట్లను పట్టించుకోకుండా బంగ్లాదేశ్ ఆటగాడిని ఫ్రాంచైజీ కొనుగోలు చేయడంపై భారతదేశంలో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మైనంలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్ మరణం తర్వాత భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి.
షారుక్ ఖాన్ దేశద్రోహి
బీజేపీ నాయకుడు సంగీత్ సోమ్ ఇంతకుముందు బంగ్లాదేశ్ ఆటగాడిని టీమ్ లోకి తీసుకున్నందుకు షారుక్ ఖాన్ను "గద్దర్ (దేశద్రోహి)" అని పిలిచాడు. దీంతో బీసీసీఐ జోక్యం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా పిలుపులు పెరుగుతున్నాయి.
{{/usCountry}}బీజేపీ నాయకుడు సంగీత్ సోమ్ ఇంతకుముందు బంగ్లాదేశ్ ఆటగాడిని టీమ్ లోకి తీసుకున్నందుకు షారుక్ ఖాన్ను "గద్దర్ (దేశద్రోహి)" అని పిలిచాడు. దీంతో బీసీసీఐ జోక్యం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా పిలుపులు పెరుగుతున్నాయి.
{{/usCountry}}అధికారిక ఐపీఎల్ మార్గదర్శకాల ప్రకారం.. వేలంలో ఒక ఆటగాడిని ఎంచుకున్న తర్వాత ఏ ఫ్రాంచైజీ కూడా తన జట్టు నుండి విడుదల చేయలేదు. తుది నిర్ణయం ఐపీఎల్ పాలక మండలి లేదా బీసీసీఐ తీసుకోవాలి. ఇప్పుడు బీసీసీఐ ఆదేశాలతో కేకేఆర్ తమ టీమ్ నుంచి ముస్తాఫిజుర్ ను తప్పించింది.