కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సామాజిక భద్రత, ప్రయోజనాల కోసం కొత్త ఈపీఎఫ్ నిబంధనలను (EPF Scheme 2026) తీసుకువచ్చింది. జూన్ 29, 2026న నోటిఫై చేసిన ఈ కొత్త పథకం ప్రకారం.. నెలకు రూ. 1,800 పరిమితి దాటిన ప్రావిడెంట్ ఫండ్ (PF) కంట్రిబ్యూషన్ను ఇకపై 'ఐచ్ఛికం' (Voluntary)గా పరిగణించనున్నారు. ఈ కొత్త నిర్ణయం అటు కంపెనీలకు, ఇటు భారీ జీతాలు తీసుకునే ఉద్యోగులకు స్పష్టతనిచ్చింది. అయితే, పీఎఫ్ కంట్రిబ్యూషన్ రేటు, ప్రాథమిక వేతన పరిమితి, వార్షిక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

పాత 1952 నాటి ఈపీఎఫ్ చట్టం స్థానంలో, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020' అమలులో భాగంగా ఈ కొత్త 2026 స్కీమ్ను అమల్లోకి తెచ్చారు. ఇది చట్టపరమైన నిబంధనలను ఆధునీకరించడానికి ఉద్దేశించినదే తప్ప, ఉద్యోగుల హక్కులను తగ్గించేది కాదు.
అసలు ఏం మారింది?
పీఎఫ్ నిబంధనల ప్రకారం.. ఉద్యోగి, యాజమాన్యం ఇద్దరూ బేసిక్ శాలరీలో 12 శాతం చొప్పున పీఎఫ్ ఖాతాకు జమ చేయాలి. అయితే, ఈ నిర్బంధ కంట్రిబ్యూషన్ ప్రస్తుతం ఉన్న గరిష్ట వేతన పరిమితి రూ.15,000కు మాత్రమే వర్తిస్తుంది.
దీని అర్థం రూ.15,000 లో 12 శాతం చొప్పున ఉద్యోగి, యజమాని చెరో రూ.1,800 మాత్రమే విధిగా జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగి బేసిక్ జీతం ఈ నోటిఫైడ్ పరిమితిని దాటితే, ఆ పైన చేసే కంట్రిబ్యూషన్ సాధారణంగా వేతన పరిమితికే పరిమితం అవుతుంది. ఆపై మొత్తాన్ని ఐచ్ఛికంగా మార్చడమే ఈ కొత్త స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం.
గతంలో ఎలా ఉండేది?
1952 నాటి పాత నిబంధనల ప్రకారం.. రూ.15,000 వేతన పరిమితి అనేది కేవలం ఒక ఉద్యోగి కొత్తగా చేరినప్పుడు పీఎఫ్ పరిధిలోకి వస్తారా లేదా అని నిర్ణయించడానికే వాడేవారు. ఒకసారి పీఎఫ్ ఖాతా పరిధిలోకి వచ్చాక, చాలా కంపెనీలు ఉద్యోగి వాస్తవ బేసిక్ జీతం (Actual Basic Salary) ఎంతో, దానిపైనే 12 శాతం పీఎఫ్ లెక్కగట్టి జమ చేసేవి. యజమానులు కూడా అంతే మొత్తాన్ని కలిపేవారు.
దీనివల్ల ఎక్కువ జీతం ఉన్నవారి పీఎఫ్ ఖాతాలో భారీగా సొమ్ము జమ అయి, రిటైర్మెంట్ నాటికి పెద్ద ఫండ్ సిద్ధమయ్యేది. కొత్త నిబంధనల ప్రకారం ఈ అదనపు కంట్రిబ్యూషన్ నిర్బంధం కాదని, అది పూర్తిగా ఉద్యోగి, యాజమాన్యం ఇష్టపూర్వక నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
మీ జీతం లేదా పీఎఫ్ పొదుపుపై ప్రభావం ఉంటుందా?
{{/usCountry}}దీనివల్ల ఎక్కువ జీతం ఉన్నవారి పీఎఫ్ ఖాతాలో భారీగా సొమ్ము జమ అయి, రిటైర్మెంట్ నాటికి పెద్ద ఫండ్ సిద్ధమయ్యేది. కొత్త నిబంధనల ప్రకారం ఈ అదనపు కంట్రిబ్యూషన్ నిర్బంధం కాదని, అది పూర్తిగా ఉద్యోగి, యాజమాన్యం ఇష్టపూర్వక నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
మీ జీతం లేదా పీఎఫ్ పొదుపుపై ప్రభావం ఉంటుందా?
{{/usCountry}}సాధారణ పీఎఫ్ చందాదారులకు దీనివల్ల తక్షణమే వచ్చే మార్పేమీ లేదు. ఏ కంపెనీలయితే ఇప్పటికే పీఎఫ్ కంట్రిబ్యూషన్ను కేవలం చట్టబద్ధ పరిమితి రూ.1,800కే పరిమితం చేశాయో, అక్కడ యథాతథ స్థితి కొనసాగుతుంది.
ఒకవేళ మీ కంపెనీ మీ పూర్తి బేసిక్ జీతంపై పీఎఫ్ కట్ చేస్తుంటే.. భవిష్యత్తులో కూడా యాజమాన్యం అంగీకారంతో దానిని అలాగే కొనసాగించవచ్చు. కాకపోతే, ఉద్యోగి ఎక్కువ పీఎఫ్ కట్ చేయాలని కోరినంత మాత్రాన, యాజమాన్యం కూడా అంతే మొత్తాన్ని మ్యాచింగ్ కంట్రిబ్యూషన్గా ఇవ్వాలనే చట్టపరమైన నిబంధన ఇకపై ఉండదు. కంపెనీ పాలసీ లేదా మీ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ ఆధారంగానే ఇది నిర్ణయిస్తారు.
పెన్షన్ (EPS) కాంట్రిబ్యూషన్ పరిస్థితి ఏంటి?
కొత్త నోటిఫికేషన్ వల్ల పెన్షన్ స్కీమ్ (EPS) నిబంధనల్లో ఎలాంటి మార్పూ రాలేదు. 2014 నాటి సవరణల ప్రకారమే యజమాని వాటా నుంచి 8.33 శాతం చొప్పున గరిష్టంగా రూ.1,250 (రూ.15,000 వేతన పరిమితిపై) పెన్షన్ ఖాతాకు వెళ్తుంది. మిగిలిన సొమ్ము యథాతథంగా ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు చేరుతుంది. హయ్యర్ పెన్షన్ నిబంధనల పరిధిలోకి వచ్చేవారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది.
మారకుండా అలాగే ఉన్న నిబంధనలు
ఈ కొత్త అప్డేట్ కేవలం పరిపాలనాపరమైన స్పష్టత కోసమే తప్ప, బెనిఫిట్స్ మార్చడానికి కాదు. కింది అంశాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి:
- ఉద్యోగి, యజమాని చెల్లించాల్సిన 12 శాతం పీఎఫ్ రేటు.
- నెలకు రూ.15,000గా ఉన్న ప్రాథమిక వేతన పరిమితి.
- ఈపీఎఫ్ఓ ఏటా ప్రకటించే వడ్డీ రేటు.
- కనీస నెలవారీ ఈపీఎస్ పెన్షన్ రూ.1,000.
ఎక్కువ జీతం ఉండి, వాస్తవ వేతనంపై పీఎఫ్ కట్ అవుతున్న ఉద్యోగులకు చట్టపరమైన స్పష్టత ఇవ్వడమే ఈ కొత్త నిబంధనల ఉద్దేశం.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ప్రశ్న 1: కొత్త ఈపీఎఫ్ స్కీమ్ 2026 ఎప్పటినుంచి అమల్లోకి వచ్చింది?
సమాధానం: కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త స్కీమ్ను జూన్ 29, 2026న నోటిఫై చేసింది. ఇది పాత 1952 నాటి నిబంధనల స్థానంలో అమల్లోకి వచ్చింది.
ప్రశ్న 2: నెలకు రూ.1,800 పరిమితి దాటితే పీఎఫ్ కట్ చేయకూడదా?
సమాధానం: కట్ చేయవచ్చు, కానీ అది చట్టబద్ధంగా నిర్బంధం కాదు. ఉద్యోగి, కంపెనీ ఇద్దరూ పరస్పరం అంగీకరిస్తే వాస్తవ బేసిక్ జీతంపై 12 శాతం చొప్పున పీఎఫ్ కంట్రిబ్యూషన్ను కొనసాగించవచ్చు.
ప్రశ్న 3: దీనివల్ల కంపెనీల బాధ్యతల్లో ఏమైనా మార్పు ఉందా?
సమాధానం: అవును. ఒక ఉద్యోగి తన పరిమితి కంటే ఎక్కువ పీఎఫ్ పొదుపు చేయాలనుకుంటే, యాజమాన్యం కూడా అంతే మొత్తాన్ని మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్గా ఇవ్వాలనే చట్టపరమైన బైండింగ్ ఇకపై లేదు. అది కంపెనీ పాలసీపై ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న 4: ఉద్యోగుల పెన్షన్ (EPS) నిబంధనలు ఏమైనా మారాయా?
సమాధానం: లేదు, పెన్షన్ నిబంధనలలో ఎలాంటి మార్పు లేదు. యజమాని వాటా నుండి గరిష్టంగా రూ.1,250 ఎప్పటిలాగే పెన్షన్ ఫండ్కు వెళ్తుంది.