మహారాష్ట్రలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేడి స్టాక్ మార్కెట్ వర్గాలకు కూడా తాకింది. ఈ ఎన్నికల దృష్ట్యా గురువారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లకు సెలవు ప్రకటించారు. అయితే, ఒక స్థానిక సంస్థల ఎన్నికల కోసం దేశీయ స్టాక్ మార్కెట్లను పూర్తిగా స్తంభింపజేయడంపై జెరోధా (Zerodha) వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్ కామత్ తీవ్రంగా స్పందించారు.
"ఇది సరైన ప్రణాళిక కాదు"

నితిన్ కామత్ సోషల్ మీడియా వేదికగా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. "భారత స్టాక్ ఎక్స్ఛేంజీలకు అంతర్జాతీయ మార్కెట్లతో సంబంధాలు ఉంటాయి. అలాంటి కీలక వ్యవస్థలను ఒక స్థానిక మున్సిపల్ ఎన్నికల కోసం మూసివేయడం అనేది సరైన ప్రణాళిక లేకపోవడమే. భవిష్యత్తులో దీనివల్ల కలిగే పరిణామాలపై అవగాహన లోపానికి ఇది నిదర్శనం" అని నితిన్ కామత్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు.
ప్రముఖ అమెరికన్ ఇన్వెస్టర్ చార్లీ ముంగర్ చెప్పిన "ప్రయోజనం (Incentive) ఎక్కడుంటుందో చూపిస్తే.. ఫలితం (Outcome) ఎలా ఉంటుందో నేను చూపిస్తా" అనే కోట్ను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గ్లోబల్ ఇన్వెస్టర్ల ముందు మన పరపతి ఏంటి?
మార్కెట్ సెలవుపై మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. "ప్రస్తుతం ఈ సెలవును అడ్డుకోవడానికి ఎవరికీ ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టే ఈ సెలవు అమల్లో ఉంది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు మన మార్కెట్లను సీరియస్గా తీసుకోవాలంటే.. మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ఈ సంఘటన చెబుతోంది" అని నితిన్ కామత్ అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
కామత్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన వాదనతో ఏకీభవిస్తుండగా, మరికొందరు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
"భారత ఈక్విటీ మార్కెట్ అంటే కేవలం స్థానిక మార్కెట్ కాదు. ఇందులో ఎఫ్పీఐలు (FPIs), సావరిన్ ఫండ్స్ వంటి అంతర్జాతీయ పెట్టుబడులు ఉన్నాయి. ప్రభుత్వం ఓటు వేయడానికి ఉద్యోగులకు సగం రోజు సెలవు ఇస్తే సరిపోయేది. మిగతా సమయంలో మార్కెట్లు నడిచేవి" అని ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
{{/usCountry}}"భారత ఈక్విటీ మార్కెట్ అంటే కేవలం స్థానిక మార్కెట్ కాదు. ఇందులో ఎఫ్పీఐలు (FPIs), సావరిన్ ఫండ్స్ వంటి అంతర్జాతీయ పెట్టుబడులు ఉన్నాయి. ప్రభుత్వం ఓటు వేయడానికి ఉద్యోగులకు సగం రోజు సెలవు ఇస్తే సరిపోయేది. మిగతా సమయంలో మార్కెట్లు నడిచేవి" అని ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
{{/usCountry}}"విదేశీ మార్కెట్లు మూసి ఉన్నప్పుడు మనం మన మార్కెట్లను మూసివేస్తున్నామా? అంతర్జాతీయ అనుసంధానం ఉన్నప్పుడు ఇలాంటి సెలవులు ఎంతవరకు సమంజసం?" అని మరొకరు ప్రశ్నించారు.
మరికొందరు మాత్రం, రాజ్యాంగపరమైన ఓటు హక్కు వినియోగించుకోవడానికి సెలవు అవసరమని వాదించారు.
మహారాష్ట్రలో 29 మున్సిపల్ కార్పొరేషన్లకు గురువారం పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ట్రేడింగ్ను నిలిపివేశారు. తిరిగి శుక్రవారం (జనవరి 16) మార్కెట్లు యధావిధిగా ప్రారంభం కానున్నాయి.