నథింగ్ ఫోన్ 3ఏ లైట్ లాంచ్ త్వరలోనే! ధర, ఫీచర్లు లీక్..
నథింగ్ సంస్థ నుంచి కొత్త స్మార్ట్ఫోన్ 'ఫోన్ 3a లైట్' త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారత్ సహా గ్లోబల్ మార్కెట్లోకి ఈ గ్యాడ్జెట్ నవంబర్ 4, 2025న లాంచ్ అయ్యే అవకాశం. యూరోప్లో ప్రారంభ ధర సుమారు రూ. 22 వేలుగా ఉండొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్తో పనిచేయనున్నట్టు సమాచారం.
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ నథింగ్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. భారత్తో పాటు గ్లోబల్ మార్కెట్ కోసం నథింగ్ ఫోన్ 3ఏ లైట్ స్మార్ట్ఫోన్ను తీసుకురావడానికి కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.

గతంలో ఈ స్మార్ట్ఫోన్ గీక్బెంచ్ లిస్టింగ్లో కనిపించింది. దాని ద్వారా కొన్ని కీలక వివరాలు బయటపడ్డాయి. తాజాగా, ఈ నథింగ్ ఫోన్ 3ఏ లైట్ ధర, విడుదల తేదీకి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి. తాజా నివేదిక ప్రకారం.. ఈ ఫోన్ ఒకే వేరియంట్లో, రెండు రంగుల ఆప్షన్స్తో అందుబాటులోకి రావచ్చు.
నథింగ్ ఫోన్ 3ఏ లైట్: ధర, విడుదల తేదీ (లీక్డ్)
ఫ్రెంచ్ పబ్లికేషన్ డీల్యాబ్స్ నివేదిక ప్రకారం.. నథింగ్ ఫోన్ 3ఏ లైట్ నవంబర్ 2025 ప్రారంభంలో యూరప్లో విడుదల కానుంది! నవంబర్ 4న యూరప్లో అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది.
ఫ్రాన్స్లో ఈ హ్యాండ్సెట్ ప్రారంభ ధర ఈయూఆర్ 249.99 (సుమారు రూ. 22,600)గా ఉండొచ్చు. కొన్ని యూరోపియన్ దేశాల్లో దీని ధర ఈయూఆర్ 239.99 (సుమారు రూ. 21,700) కంటే తక్కువగా కూడా ఉండవచ్చని నివేదిక వెల్లడించింది.
నథింగ్ ఫోన్ 3a లైట్ కేవలం ఒకే కాన్ఫిగరేషన్లో లభించే అవకాశం ఉంది. అదే 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్. ఇది బ్లాక్, వైట్ అనే రెండు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉండనుంది.
అయితే, ఈ రాబోయే నథింగ్ ఫోన్ 3a లైట్ ఖచ్చితమైన విడుదల తేదీ గురించి ఇప్పటివరకు అధికారిక సమాచారం ఏదీ అందుబాటులో లేదు. కాబట్టి, మరిన్ని వివరాల కోసం వేచి చూడాలి.
నథింగ్ ఫోన్ 3ఏ లైట్ స్పెసిఫికేషన్లు (అంచనా)
తాజా గీక్బెంచ్ లిస్టింగ్ ప్రకారం, ఈ స్మార్ట్ఫోన్ మోడల్ నంబర్ A001Tగా ఉంది. ఈ హ్యాండ్సెట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్తో పనిచేస్తుందని లిస్టింగ్ ద్వారా తెలిసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ అయి ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ చిప్సెట్కు మాలి-G615 MC2 జీపీయూ జత చేసే అవకాశం ఉంది.
ఈ ఫోన్ 8జీబీ ర్యామ్తో వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్గా ఆండ్రాయిడ్ 15ను కలిగి ఉంటుందని గీక్బెంచ్ లిస్టింగ్ ద్వారా స్పష్టమైంది.
గీక్బెంచ్లో ఈ రాబోయే స్మార్ట్ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్లో 1,003 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్లో 2,925 పాయింట్లు సాధించింది.
ఓపెన్సిఎల్ బెంచ్మార్క్లో ఈ ఫోన్ 2,467 పాయింట్లు సాధించినట్లుగా లిస్టింగ్లో వెల్లడైంది. ఇది గ్రాఫిక్స్ పనితీరును సూచిస్తుంది.
ఈ గ్యాడ్జెట్ ఇండియా లాంచ్పైనా వివరాలు తెలియాల్సి ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


