Oppo K14x : ఒప్పో నుంచి 6500 ఎంఏహెచ్​ బ్యాటరీ స్మార్ట్​ఫోన్- కే14ఎక్స్​ ధర ఎంతంటే..

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అయ్యింది. 6,500 ఎంఏహెచ్​ బ్యాటరీతో ఒప్పో కే14ఎక్స్​ ఇండియాలోకి వచ్చింది. ఈ మొబైల్​ ఫీచర్స్​, ధర సహా ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Feb 10, 2026, 14:01:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒప్పో తన సరికొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్​ని మంగళవారం ఇండియాలో లాంచ్​ చేసింది. దాని పేరు ఒప్పో కే14ఎక్స్​. ఇదొక 5జీ గ్యాడ్జెట్​. భారీ బ్యాటరీ, వేగవంతమైన డిస్‌ప్లే దీని ప్రధాన ఆకర్షణలు. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు, ధర, ఫీచర్లు ఇక్కడ తెలుసుకోండి..

ఒప్పో కే14ఎక్స్​ స్మార్ట్​ఫోన్​..
ఒప్పో కే14ఎక్స్​ స్మార్ట్​ఫోన్​..

ఒప్పో కే14ఎక్స్​ 5జీ- ధర, లభ్యత..

ఒప్పో కే14ఎక్స్​ 5జీ స్మార్ట్​ఫోన్​ రెండు వేరియంట్లలో లభిస్తుంది:

4జీబీ ర్యామ్​ + 128జీబీ స్టోరేజ్: రూ. 14,999

6జీబీ ర్యామ్​ + 128జీబీ స్టోరేజ్: రూ. 16,999

ఆఫర్లు: లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఎస్బీఐ, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్‌పై రూ. 1,500 వరకు ఇన్​స్టంట్​ డిస్కౌంట్​ పొందవచ్చు.

సేల్: ఈ ఒప్పో కే14ఎక్స్​ 5జీ స్మార్ట్​ఫోన్​ ఫిబ్రవరి 16 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకానికి రానుంది. ఇది ఐసీ బ్లూ, ప్రిజం వైలెట్ వంటి రంగుల్లో లభిస్తుంది.

ఒప్పో కే14ఎక్స్​- ప్రధాన ఫీచర్లు..

డిస్‌ప్లే: ఈ ఒప్పో కే14ఎక్స్​ స్మార్ట్​ఫోన్​ 6.75- ఇంచ్​ హెచ్​డీ+ ఎల్​సీడీ స్క్రీన్, 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 1,125 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

ప్రాసెసర్: ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ వాడారు.

బ్యాటరీ అండ్​ ఛార్జింగ్: ఈ ఒప్పో కొత్త స్మార్ట్​ఫోన్​లోని 6500 ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ ఒకే ఛార్జ్‌తో 17.6 గంటల యూట్యూబ్ ప్లేబ్యాక్‌ను ఇస్తుంది. దీనికి 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

కెమెరా: వెనుక వైపు 50ఎంపీ మెయిన్ కెమెరా + 2ఎంపీ మోనోక్రోమ్ కెమెరా ఈ గ్యాడ్జెట్​లో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్​ కోసం ఇందులో 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15పై ఈ మొబైల్​ నడుస్తుంది.

ఇతర ఫీచర్లు: IP64 రేటింగ్ (వాటర్​ అండ్​ డస్ట్​ ప్రొటెక్షన్​), సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5ఎంఎం ఆడియో జాక్.

మరి మీరు ఈ ఒప్పో కే14ఎక్స్​ స్మార్ట్​ఫోన్​ని కొంటున్నారా?

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More