10,050ఎంఏహెచ్​ భారీ బ్యాటరీతో ఓప్పో ప్యాడ్ ఎయిర్ 5.. అదిరిపోయే ఫీచర్లతో లాంచ్​

ఓప్పో తన ప్యాడ్ ఎయిర్ లైనప్‌లో సరికొత్త ‘ఓప్పో ప్యాడ్ ఎయిర్ 5’ను చైనాలో విడుదల చేసింది. 12.1 ఇంచ్​ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300-అల్ట్రా చిప్‌సెట్, భారీ బ్యాటరీతో వచ్చిన ఈ టాబ్లెట్ త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా వచ్చే అవకాశం ఉంది.

Published on: Dec 25, 2025, 16:01:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టెక్ దిగ్గజం ఓప్పో తన టాబ్లెట్ శ్రేణిని మరింత విస్తరిస్తూ ‘ఓప్పో ప్యాడ్ ఎయిర్ 5’ని చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. ఎడ్యుకేషన్​, ఎంటర్​టైన్​మెంట్​, మల్టీ టాస్కింగ్ కోసం వెతుకుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని ఈ సరికొత్త టాబ్లెట్‌ను రూపొందించింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు శక్తివంతమైన హార్డ్‌వేర్‌ను ఇందులో జోడించారు. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఒప్పో ప్యాడ్​ ఎయిర్​ 5 లాంచ్​.. (Representative image)
ఒప్పో ప్యాడ్​ ఎయిర్​ 5 లాంచ్​.. (Representative image)

ఒప్పో ప్యాడ్​ ఎయిర్​ 5- ధర, లభ్యత..

8జీబీ + 128జీబీ: సుమారు రూ. 24,000 (1,899 యువాన్​)

8జీబీ + 256జీబీ: సుమారు రూ. 28,000 (2,199 యువాన్​)

12జీబీ + 256జీబీ: సుమారు రూ. 32,000 (2,499 యువాన్​)

ఇదే ర్యామ్​, స్టోరేజ్​లతో కూడిన ప్రత్యేకమైన ‘సాఫ్ట్ లైట్’ వెర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ధర సుమారు రూ. 31,000 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 31 నుంచి ఇవి అధికారికంగా సేల్స్​లోకి రానున్నాయి.

స్టార్​లైట్​ పౌడర్​, స్పేస్​ గ్రే కలర్స్​లో ఈ ట్యాబ్​ అందుబాటులో ఉంటుంది.

అద్భుతమైన డిస్‌ప్లే.. స్మూత్ పర్ఫార్మెన్స్:

ఓప్పో ప్యాడ్ ఎయిర్ 5లో 12.1 ఇంచ్​ భారీ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అమర్చారు. ఇది 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్‌తో పాటు 2.8కే రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అంటే మీరు గేమ్‌లు ఆడినా లేదా సినిమాలు చూసినా ఎక్స్​పీరియెన్స్​ ఎంతో స్మూత్‌గా ఉంటుంది. ఇక 900 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ వల్ల పగటిపూట వెలుతురులో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.

పవర్ ప్యాక్డ్ హార్డ్‌వేర్: ఈ టాబ్లెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300-అల్ట్రా ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి తోడు 12జీబీ వరకు ర్యామ్ ఉండటం వల్ల ఒకేసారి ఐదారు యాప్స్ వాడినా హ్యాంగ్ అయ్యే ప్రసక్తే ఉండదు.

ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16తో ఈ ఒప్పో ప్యాడ్​ ఎయిర్​ 5 పనిచేస్తుంది.

భారీ బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్:

టాబ్లెట్లలో బ్యాటరీ చాలా ముఖ్యం. అందుకే ఓప్పో ఇందులో 10,050ఎంఏహెచ్​ భారీ బ్యాటరీని ఇచ్చింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా నిశ్చింతగా వాడుకోవచ్చు. దీనికి 33డబ్ల్యూ సూపర్​వీఓఓసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

కెమెరా- ఇతర ఫీచర్లు:

ఫోటోలు, వీడియో కాల్స్ కోసం వెనుక వైపు 8 మెగాపిక్సెల్, ముందు వైపు 8 మెగాపిక్సెల్ కెమెరాలను ఇచ్చారు. కనెక్టివిటీ పరంగా వై-ఫై 6, బ్లూటూత్, సెల్యులార్ వెర్షన్‌లో 5జీ సపోర్ట్ ఉన్నాయి. కేవలం 6.83ఎంఎం మందంతో, సుమారు 599 గ్రాముల బరువుతో ఇది చాలా స్లిమ్‌గా ఉంటుంది.

ఈ టాబ్లెట్ త్వరలోనే గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారతదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాల సమాచారం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More