టీ20 ప్రపంచకప్ లో ఇండియా సెమీఫైనల్ దూసుకెళ్లింది. సూపర్ 8లో వెస్టిండీస్ పై ఘన విజయంతో నాకౌట్ బెర్త్ పట్టేసింది. ఆదివారం (మార్చి 1) రాత్రి జరిగిన మ్యాచ్ లో ఇండియా 5 వికెట్ల తేడాతో విండీస్ ను ఓడించింది. అయితే ఇండియాపై పడి ఏడవడం అలవాటైన పాకిస్థానీలు మరోసారి తమ వక్రబుద్ధి చూపిస్తున్నారు.
ఇండియా వర్సెస్ వెస్టిండీస్

టీ20 ప్రపంచకప్ సూపర్ 8 మ్యాచ్ లో ఇండియా, వెస్టిండీస్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ 195 పరుగులు చేసింది. ఆ టీమ్ ఇన్నింగ్స్ లో విధ్వంసక బ్యాటర్ హెట్మయర్ వికెట్ వివాదాస్పదంగా మారింది. బుమ్రా బౌలింగ్ లో కీపర్ క్యాచ్ కోసం ఇండియా అప్పీల్ చేసింది.
అంపైర్ క్రిస్ గఫానీ ఔటిచ్చాడు. కానీ బ్యాట్ కు బాల్ తాకలేదని భావించిన హెట్మయర్ రివ్యూ కోరాడు. అల్ట్రా ఎడ్జ్ లో కూడా అది క్యాచ్ అని తేలింది. కానీ హెట్మయర్ మాత్రం దాన్ని నమ్మలేనట్లు పెవిలియన్ చేరిపోయాడు.
మహమ్మద్ అమీర్ కామెంట్లు
హెట్మయర్ వికెట్ పై పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థానీ షో 'హర్నా మానా హై'లో అతను మాట్లాడుతూ.. "హెట్మెయర్ ఔట్ కాంట్రవర్సీకి దారితీసింది. అతను ఔట్ కాదని నేను నమ్ముతున్నా. అతను ఇంకాసేపు క్రీజులో ఉంటే వెస్టిండీస్ స్కోరు 220-230కి చేరేది. అప్పుడు ఇండియా గెలిచేది కాదు. టోర్నీ నుంచి నిష్క్రమించేది’’ అని అమీర్ అన్నాడు.
కప్ గెలవలేదు
హెట్మయర్ ఔట్ తోనే ఆగకుండా ఈ టీ20 ప్రపంచకప్ లో ఇండియా కప్ గెలవలేదని మహమ్మద్ అమీర్ మరోసారి విషం కక్కాడు.
{{/usCountry}}హెట్మయర్ ఔట్ తోనే ఆగకుండా ఈ టీ20 ప్రపంచకప్ లో ఇండియా కప్ గెలవలేదని మహమ్మద్ అమీర్ మరోసారి విషం కక్కాడు.
{{/usCountry}}‘‘భారత్ మంచి క్రికెట్ ఆడటం లేదు. వాళ్ల ఫీల్డింగ్ బాలేదు. మూణ్నాలుగు క్యాచ్ లు వదిలేశారు. బుమ్రా మినహా ప్రతి బౌలర్ ఫెయిల్ అవుతున్నాడు. హార్దిక్ పాండ్య పెద్ద టీమ్స్ పై ఎప్పుడూ ఆడలేడని నేను ముందే చెప్పా. వరుణ్ చక్రవర్తి కూడా తేలిపోతున్నాడు. ఇండియా హాట్ ఫేవరెట్ కాదు. కప్ గెలవలేదు’’ అని అమీర్ అన్నాడు.
ఇప్పటికే ట్రోల్స్
టీ20 ప్రపంచకప్ లో ఇండియా సెమీస్ చేరలేదని గతంలో చెప్పిన మహమ్మద్ అమీర్ పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. పాకిస్థాన్ కు ఆట చేతగాక సూపర్ 8లోనే నిష్క్రమించిందని ఇండియన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. బాబా అమీర్ ఎక్కడా? అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఇప్పుడేమో భారత్ కప్ గెలవదని అమీర్ అంటున్నాడు.
లైవ్ షోలో
మరోవైపు ఓ లైవ్ క్రికెట్ విశ్లేషణ షోలో పాకిస్థానీ హోస్ట్ చేసిన పని వైరల్ గా మారింది. వెస్టిండీస్ పై ఇండియా విజయాన్ని తట్టుకోలేని అతను లైవ్ లోనే టీవీ పగలగొట్టాడు. ఈ వీడియోపై కూడా ఇండియన్ ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
తరచూ అడిగే ప్రశ్నలు
1. ఇండియా ఎన్నిసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచింది?
ఇండియా రెండు సార్లు టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. 2007లో ధోని కెప్టెన్సీలో, 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ విజేతగా నిలిచింది.
2. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సంజూ శాంసన్ నెలకొల్పిన సరికొత్త రికార్డు ఏమిటి?
వెస్టిండీస్పై 97 (నాటౌట్) పరుగులు చేయడం ద్వారా, టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఛేజింగ్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఇండియన్ బ్యాటర్ గా సంజూ శాంసన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లీ (82* పరుగులు) పేరిట ఉండేది.
3. సెమీఫైనల్లో భారత్ ఎవరితో తలపడుతుంది?
సూపర్-8లో వెస్టిండీస్పై ఘనవిజయంతో భారత్ సెమీఫైనల్ చేరింది. సెమీస్ లో మార్చి 5, గురువారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది.