ప్రధాన మంత్రి పౌర సహాయ, అత్యవసర పరిస్థితుల్లో ఉపశమన నిధి (పీఎం కేర్స్) కార్పస్ నిధులు గణనీయంగా పెరిగాయి. దేశీయ, విదేశీ విరాళాలు చాలారకే తగ్గినప్పటికీ నిధి మొత్తం పెరిగింది. ఇటీవల విడుదల చేసిన అడిటెడ్ ఆర్థిక నివేదికల ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 7,173.03 కోట్లుగా ఉన్న కార్పస్, 2024-25 నాటికి 17.8 శాతం వృద్ధితో రూ. 8,452.07 కోట్లకు చేరుకుంది.
వడ్డీల రాబడి

పీఎం కేర్స్ ఫండ్కు వచ్చే విరాళాల్లో స్పష్టమైన తగ్గుదల నమోదైంది. 2023-24లో రూ. 681.81 కోట్లుగా ఉన్న దేశీయ విరాళాలు 2024-25 నాటికి రూ. 479.05 కోట్లకు పడిపోయాయి. ఇవి దాదాపు 30 శాతం మేర క్షీణించాయి. విదేశీ విరాళాలు రూ. 1.14 కోట్ల నుంచి రూ. 93 లక్షలకు పరిమితమయ్యాయి.
విరాళాలు తగ్గినప్పటికీ నిధి పరిమాణం పెరగడానికి ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ ఆదాయమే కీలకంగా మారింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై 2024-25లో రూ. 469.38 కోట్ల వడ్డీ ఆదాయం లభించింది. సంవత్సర ప్రారంభంలో నిధికి చెందిన రూ. 6,641.57 కోట్లు బ్యాంక్ డిపాజిట్లలో ఉన్నాయి.
ఏజెన్సీల రీఫండ్లు, బ్యాంక్ నిల్వలు
అమలు చేసే వివిధ ఏజెన్సీల నుంచి ఖర్చు కాకుండా మిగిలిపోయిన నిధులు తిరిగొచ్చాయి. ఏజెన్సీల నుంచి రూ. 324.66 కోట్లు రీఫండ్ రూపంలో పీఎం కేర్స్ ఖాతాకు చేరాయి. మునుపటి ఏడాదితో (రూ. 84.31 కోట్లు) పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇవి కాకుండా బ్యాంక్ టిడిఎస్ రీఫండ్ రూపంలో రూ. 13.49 లక్షలు లభించాయి.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభ నిల్వను మినహాయించి, పీఎం కేర్స్ నిధికి మొత్తం రూ. 1,279.91 కోట్ల ఆదాయం సమకూరింది. మార్చి 31, 2025 నాటికి నిధికి చెందిన రూ. 7,846.65 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉండగా, సేవింగ్స్ ఖాతాలో రూ. 605.41 కోట్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
వ్యయం కేవలం 0.01 శాతమే
ఆదాయం వేల కోట్లలో ఉన్నప్పటికీ, 2024-25లో చేసిన ఖర్చు మాత్రం అతి తక్కువగా ఉంది. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకానికి రూ. 87.85 లక్షలు మాత్రమే వెచ్చించారు. 2023-24లో ఈ పథకానికి రూ. 15.38 కోట్లు వ్యయం చేయగా, ఈ సారి ఆ వ్యయం 94 శాతం మేర క్షీణించింది. మొత్తం నిధి రూ. 8,452 కోట్లలో ఈ ఖర్చు కేవలం 0.01 శాతానికి సమానం.
పారదర్శకతపై విమర్శలు
{{/usCountry}}ఆదాయం వేల కోట్లలో ఉన్నప్పటికీ, 2024-25లో చేసిన ఖర్చు మాత్రం అతి తక్కువగా ఉంది. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకానికి రూ. 87.85 లక్షలు మాత్రమే వెచ్చించారు. 2023-24లో ఈ పథకానికి రూ. 15.38 కోట్లు వ్యయం చేయగా, ఈ సారి ఆ వ్యయం 94 శాతం మేర క్షీణించింది. మొత్తం నిధి రూ. 8,452 కోట్లలో ఈ ఖర్చు కేవలం 0.01 శాతానికి సమానం.
పారదర్శకతపై విమర్శలు
{{/usCountry}}పీఎం కేర్స్ నిధుల వినియోగం, పారదర్శకతపై సమాచార హక్కు కార్యకర్త అంజలి భరద్వాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. "రూ. 8,452 కోట్ల భారీ నిధి అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం 0.01 శాతం మాత్రమే ఎందుకు ఖర్చు చేశారు? అంత పెద్ద మొత్తాన్ని ఎందుకు ఉపయోగించకుండా ఉంచారు? రూ. 324 కోట్లు ఏజెన్సీల నుంచి ఎందుకు రీఫండ్ అయ్యాయో వివరణ లేదు. ఏ ఏజెన్సీలు ఆ డబ్బును వెనక్కి ఇచ్చాయి? నాసీరకం పరికరాల జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి ఈ రీఫండ్లు చేశారా? అడిట్ నివేదికకు సంబంధించిన అనుబంధ పత్రాలను వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు?" అని సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఆమె ప్రశ్నించారు.
2020లో ఏర్పాటైన ట్రస్ట్
కోవిడ్-19 వంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపశమన చర్యలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం 2020 మార్చి 27న పీఎం కేర్స్ ఫండ్ను ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో రిజిస్టర్ అయిన ఈ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్కు ప్రధాని నరేంద్ర మోదీ ఛైర్మన్గా ఉన్నారు. రక్షణ, హోం, ఆర్థిక మంత్రులు ఇందులో ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ నిధికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేయదు, కేవలం స్వచ్ఛంద విరాళాలు మాత్రమే స్వీకరిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు, వెంటిలేటర్ల ఏర్పాటుకు ఈ నిధులను వాడారు. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆర్థిక, విద్యా సాయం అందించేందుకు 2021 మే నెలలో ప్రత్యేక పథకం ప్రారంభించారు. పీఎం కేర్స్ సమాచార హక్కు చట్టం (RTI) పరిధిలోకి రాదని ప్రధాని కార్యాలయం గతంలో స్పష్టం చేసింది.
ముంబైకి చెందిన కేకేసీ అండ్ అసోసియేట్స్ ఎల్ఎల్పీ సంస్థ 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అడిట్ పూర్తి చేసి, 2026 ఆగస్టు 7న సంతకం చేసింది. ఈ అడిట్ నివేదికలను ఇటీవల వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఎస్ఎఆర్సి (SARC) అండ్ అసోసియేట్స్ అడిట్ చేయగా, ఆ నివేదికలను 2024 డిసెంబర్లో అప్లోడ్ చేశారు.