దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వ్యవసాయ పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ సమృద్ధి నిధులు చేరేందుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 20వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం-కిసాన్ (PM-Kisan Samman Nidhi) పథకం కింద 23వ విడత నిధులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో జరగనున్న భారీ బహిరంగ సభ వేదికగా ప్రధాని ఈ నిధుల విడుదలకు శ్రీకారం చుట్టనున్నారు.

ఈ విడతలో అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రూ. 2,000 చొప్పున డీబీటీ ద్వారా లబ్ధి చేకూరనుంది. కాగా, చిన్న, సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని కింద ఏటా మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున మొత్తం రూ. 6,000 పెట్టుబడి సాయాన్ని కేంద్రం అందిస్తోంది.
మీ పేరుందో లేదో ఇలా తెలుసుకోండి
పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా మీ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల లిస్ట్లో మీ పేరు ఉందో లేదో సులభంగా చెక్ చేసుకోవచ్చు. దానికోసం ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి:
మొదట పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ https://pmkisan.gov.in/ ను సందర్శించండి.
హోమ్ పేజీలో కుడివైపున ఉండే ‘Beneficiary List’ (లబ్ధిదారుల జాబితా) ఆప్షన్పై క్లిక్ చేయండి.
ఇప్పుడు ఓపెన్ అయ్యే కొత్త పేజీలో మీ రాష్ట్రం, జిల్లా, సబ్-జిల్లా/బ్లాక్ మరియు మీ గ్రామం (Village) వివరాలను ఎంచుకోండి.
వివరాలన్నీ ఎంటర్ చేశాక 'Get Report' బటన్పై క్లిక్ చేయాలి.
వెంటనే మీ స్క్రీన్పై గ్రామంలోని అర్హులైన రైతుల పేర్ల జాబితా కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో వెతుక్కోవచ్చు.
e-KYC లేకపోతే డబ్బులు రావు
{{/usCountry}}వెంటనే మీ స్క్రీన్పై గ్రామంలోని అర్హులైన రైతుల పేర్ల జాబితా కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో వెతుక్కోవచ్చు.
e-KYC లేకపోతే డబ్బులు రావు
{{/usCountry}}పీఎం కిసాన్ 23వ విడత నిధులు పొందాలనుకునే రైతులు తమ అకౌంట్కు ఇ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని వారి ఖాతాల్లో డబ్బులు జమ కావు. రైతులు పీఎం కిసాన్ పోర్టల్లోని 'Farmer Corner' లో ఉన్న 'e-KYC' ఆప్షన్ను ఎంచుకోవాలి. అక్కడ మీ ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి, ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ (OTP) ని నమోదు చేయడం ద్వారా ఇంట్లోనే కూర్చుని వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు.
ఒకవేళ మొబైల్ నంబర్ లింక్ లేని వారు సమీపంలోని మీ-సేవా లేదా సీఎస్సీ (CSC) సెంటర్కు వెళ్లి బయోమెట్రిక్ (వేలిముద్ర) ద్వారా కూడా కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.