ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు శనివారం సర్జరీ జరిగింది. దీంతో ఆయన ఆరోగ్యంపై సినీ, రాజకీయ ప్రముఖలు ఆరా తీస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ఫోన్ లో పరామర్శ…

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆదివారం పవన్ కల్యాణ్కు స్వయంగా ఫోన్ చేసిన ప్రధాని… ఆయన క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సమస్యలు, చికిత్స వివరాల గురించి మోడీ ఆరా తీశారు. దాదాపు నిమిషం పాటు సాగిన ఈ సంభాషణలో పవన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రజా సేవలో నిరంతరం శ్రమించే క్రమంలో ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించినట్లు సమాచారం.
ఫోన్ కాల్ మాత్రమే కాకుండా… ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా కూడా పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై ట్వీట్ చేశారు. “ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను”అని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కల్యాణ్… ఇటీవలి కాలంలో వరుస సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం పవన్ కళ్యాణ్ తన కార్యాలయ అధికారులతో పాలనాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన వ్యక్తిగత వైద్యుల సలహా తీసుకున్నారు. పరిస్థితిని గమనించిన వైద్యులు… ఆ రోజు జరగాల్సిన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని ఆసుపత్రికి రావాలని సూచించారు.
ఆసుపత్రిలో చేరిన పవన్ కళ్యాణ్కు వైద్యులు వివిధ రకాల పరీక్షలతో పాటు ఎం.ఆర్.ఐ. (MRI) స్కాన్ కూడా నిర్వహించారు. పరీక్షా ఫలితాలను విశ్లేషించిన నిపుణులు, తక్షణమే శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.
{{/usCountry}}ఆసుపత్రిలో చేరిన పవన్ కళ్యాణ్కు వైద్యులు వివిధ రకాల పరీక్షలతో పాటు ఎం.ఆర్.ఐ. (MRI) స్కాన్ కూడా నిర్వహించారు. పరీక్షా ఫలితాలను విశ్లేషించిన నిపుణులు, తక్షణమే శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.
{{/usCountry}}పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందిస్తూ.. శస్త్రచికిత్స తర్వాత ఆయన కనీసం వారం నుండి పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాతే ఆయన మళ్లీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.