పీఎన్‌బీలో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు: ఆగస్టు 9 వరకు దరఖాస్తులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఆగస్టు 9, 2026 వరకు pnb.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jul 22, 2026, 15:46:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) బ్యాంకింగ్ రారంగంలో కొలువు సాధించాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ pnb.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియకు ఆగస్టు 9, 2026ను చివరి తేదీగా నిర్ణయించారు.

పీఎన్‌బీలో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు: ఆగస్టు 9 వరకు దరఖాస్తులు
పీఎన్‌బీలో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు: ఆగస్టు 9 వరకు దరఖాస్తులు

అర్హత ప్రమాణాలు, వయోపరిమితి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం లేదా సంబంధిత నియంత్రణ మండలి గుర్తించిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆన్‌లైన్ నమోదు చేసుకునే నాటికే అభ్యర్థి వద్ద ఒరిజినల్ మార్కుల షీట్ లేదా డిగ్రీ సర్టిఫికేట్ ఉండటం తప్పనిసరి. ఆన్‌లైన్ అప్లికేషన్‌లో గ్రాడ్యుయేషన్‌లో సాధించిన మార్కుల శాతాన్ని కచ్చితంగా పేర్కొనాల్సి ఉంటుంది.

అభ్యర్థుల వయస్సు కనీసం 20 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా 30 ఏళ్లు దాటకూడదు. అటు బ్యాంకింగ్ ఉద్యోగుల ఎంపిక సంస్థ IBPS కూడా పీఓ, ఎస్‌ఓ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును జూలై 26 వరకు పొడిగించింది. ఆసక్తి గల వారు ibps.in లో దరఖాస్తు పూర్తి చేయవచ్చు.

నాలుగు దశల ఎంపిక విధానం

లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థులను మొత్తం నాలుగు దశల్లో ఎంపిక చేస్తారు.

  1. ఆన్‌లైన్ రాత పరీక్ష (Online Written Test)
  2. స్క్రీనింగ్ (Screening)
  3. లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (Language Proficiency Test - LLPT)
  4. వ్యక్తిగత ఇంటర్వ్యూ (Personal Interview)

ఆన్‌లైన్ రాత పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఇందులో మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంటుంది. ప్రతీ తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 1/4వ వంతు (25%) మార్కును కోత విధిస్తారు.

ఏ రాష్ట్ర స్థానిక పోస్టులకైతే దరఖాస్తు చేస్తున్నారో, ఆ రాష్ట్ర స్థానిక భాషను 10వ తరగతి లేదా 12వ తరగతిలో ఒక సబ్జెక్ట్‌గా చదవని అభ్యర్థులు తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (LLPT) రాయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూలలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జాబితాను రూపొందిస్తారు. ఎల్ఎల్ పీటీ అర్హత సాధించడంతో పాటు సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిన తర్వాతే నియామక ఉత్తర్వులు అందిస్తారు.

దరఖాస్తు రుసుము, చెల్లింపుల సమాచారం

దరఖాస్తు రుసుము కేటగిరీల వారీగా కింది విధంగా ఉంటుంది:

  • ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూబిడి (SC/ST/PwBD) అభ్యర్థులకు: 59
  • ఇతర కేటగిరీ అభ్యర్థులందరికీ: 1,180

డెబిట్ కార్డులు (రూపే, వీసా, మాస్టర్ కార్డ్), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డ్స్, మొబైల్ వ్యాలెట్లు లేదా యుపిఐ (UPI) ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించవచ్చు. ఇతర పూర్తి వివరాల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. పిఎన్‌బీ ఎల్‌బీవో నోటిఫికేషన్ ద్వారా ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు?

ఈ ప్రకటన ద్వారా మొత్తం 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టులను పంజాబ్ నేషనల్ బ్యాంక్ భర్తీ చేస్తోంది.

2. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఎప్పుడు?

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడానికి ఆగస్టు 9, 2026 చివరి తేదీ.

3. దరఖాస్తుదారులకు ఉండాల్సిన వయోపరిమితి ఎంత?

అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

4. రాత పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉందా?

అవును. ఆన్‌లైన్ రాత పరీక్షలో ప్రతీ తప్పు సమాధానానికి 1/4 వంతు మార్కు నెగెటివ్ మార్కింగ్‌గా కోత విధిస్తారు.

ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More