ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. సోమవారం పాట్నాలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో జన్ సూరాజ్ పార్టీ శుభారంభం చేసింది. మొదటి మూడు రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యేసరికి ప్రశాంత్ కిషోర్ తన ప్రత్యర్థులపై ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
మూడో రౌండ్ లెక్కింపు ఫలితాలు ఇవే
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, మొత్తం 31 రౌండ్ల లెక్కింపులో మూడో రౌండ్ ముగిసేసరికి ప్రశాంత్ కిషోర్కు 5,032 ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా 3,870 ఓట్లు సాధించారు. దీంతో పీకే 1,162 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
మరోవైపు రాష్ట్రీయ జనతా దళ్ (RJD) అభ్యర్థి రేఖా కుమారి 767 ఓట్లతో మూడో స్థానంలో పరిమితమయ్యారు. ఆమె ప్రశాంత్ కిషోర్ కంటే 3,131 ఓట్ల వెనుకబడి ఉన్నారు. జూలై 30న జరిగిన ఈ ఉపఎన్నికల తుది ఫలితం మిగిలిన 28 రౌండ్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వెల్లడికానుంది.
బీజేపీ కోటలోనే పీకే సవాల్
పాట్నా సాహిబ్ లోక్సభ పరిధిలోకి వచ్చే బాంకీపూర్ నియోజకవర్గం దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని కోటగా ఉంది. 2010 నుంచి ఈ స్థానానికి బీజేపీ నేత నితిన్ నవీన్ ప్రాతినిధ్యం వహించగా, అంతకుముందు ఆయన తండ్రి నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ ఏడాది ఆరంభంలో నితిన్ నవీన్ రాజ్యసభకు ఎన్నికవ్వడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది.
సాధారణంగా నగర ప్రాంతాల్లో బీజేపీకి ఉండే బలమైన ఓటు బ్యాంకును తట్టుకుని పీకే ముందంజ సాధించడం బీహార్ రాజకీయంలో చర్చనీయాంశంగా మారింది.
సేఫ్ సీటు వద్దు.. మార్పే ముఖ్యం
{{/usCountry}}సాధారణంగా నగర ప్రాంతాల్లో బీజేపీకి ఉండే బలమైన ఓటు బ్యాంకును తట్టుకుని పీకే ముందంజ సాధించడం బీహార్ రాజకీయంలో చర్చనీయాంశంగా మారింది.
సేఫ్ సీటు వద్దు.. మార్పే ముఖ్యం
{{/usCountry}}ప్రచార సమయంలో ప్రశాంత్ కిషోర్ తాను సేఫ్ సీటు వెతుక్కోలేదని, కావాలనే బీజేపీ బలంగా ఉన్న స్థానాన్ని ఎంచుకున్నానని చెప్పారు.
"రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ సులువైన నియోజకవర్గాలను వెతుక్కుంటారు. కానీ బీహార్ మారాలంటే ప్రజలు కులమతాలకు అతీతంగా ఓటేయాలనే సందేశం ఇవ్వడానికే నేను బీజేపీ గెలుస్తూ వస్తున్న క్లిష్టమైన స్థానాన్ని ఎంచుకున్నాను. లాలూ ప్రసాద్ యాదవ్ వస్తారనే భయంతో బీజేపీకి, బీజేపీ వస్తుందనే భయంతో లాలూకు ఓట్లేసే పద్ధతి స్వస్తి పలకాలన్నదే నా ఉద్దేశం" అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
సుదీర్ఘ కాలంగా రాజకీయ సమీకరణాలను శాసించిన పికి, ఈ ఎన్నికల ఫలితాలు కొత్త ఊపునిస్తాయా లేక మిగిలిన రౌండ్లలో బీజేపీ పుంజుకుంటుందా అనేది వేచి చూడాలి.