...
...
Next Story

సీబీఎస్ఈ పరీక్షలకు ముందు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి.. మీ డౌట్స్‌కు సమాధానాలు!

సీబీఎస్ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17, 2026న ప్రారంభమై మార్చి 17 వరకు కొనసాగుతాయి. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను సకాలంలో డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్షా కేంద్రానికి అవసరమైన వస్తువులను మాత్రమే తీసుకెళ్లాలి. విద్యార్థులు ఒక్కసారి ఈ ఆర్టికల్ చదివి ఏమేం తీసుకెళ్లాలలో చూడండి

Published on: Feb 16, 2026, 19:39:59 IST
Advertisement

సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17, 2026న మెుదలు. షెడ్యూల్ ప్రకారం వివిధ సబ్జెక్టులలో పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు పరీక్షకు ముందు తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్షా కేంద్రం, రిపోర్టింగ్ సమయ వివరాలను తనిఖీ చూసుకోవాలి. సమస్యలను నివారించడానికి సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని బోర్డు సూచించింది. విద్యార్థులు భయపడకుండా సరైన వ్యూహంతో పరీక్షలు రాయాలి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు
సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు

ఏ ఒక్క ప్రశ్నకూ ఎక్కువ సమయం వెచ్చించకండి. మీకు ఏదైనా ప్రశ్న కష్టంగా అనిపిస్తే, దానిని ఆపేసి.. తర్వాత తిరిగి చివరలో రండి. రేఖాచిత్రాలను స్పష్టంగా, సరైన లేబుల్‌లతో గీయండి. మీ సమాధానాలను తిరిగి చెక్ చేసుకోవడానికి చివరి 10-15 నిమిషాలు వెచ్చించండి. ముందుగా ప్రశ్నపత్రం మొత్తాన్ని జాగ్రత్తగా చదవండి. సులభమైన ప్రశ్నలను ముందుగా పరిష్కరిస్తే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు.

ప్రశ్న : పరీక్షా కేంద్రానికి ఏం తీసుకెళ్లాలి?

జవాబు : సీబీఎస్ఈ అడ్మిట్ కార్డ్, నీలి బాల్ పాయింట్ పెన్ను, పారదర్శకంగా ఉన్న జామెట్రీ బాక్స్, పెన్సిల్, ఎరేజర్, షార్పనర్, పారదర్శక ఉండే వాటర్ బాటిల్, సాధారణ గడియారం తీసుకెళ్లవచ్చు.

ప్రశ్న : పరీక్షా కేంద్రానికి ఏం తీసుకెళ్లకూడదు

జవాబు : మొబైల్ ఫోన్, స్మార్ట్‌వాచ్ లేదా కాలిక్యులేటర్, ఏవైనా రాతలతో చిట్టీలు, బ్లూటూత్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లవద్దు.

ప్రశ్న : పరీక్ష సమయంలో ఏం చేయకూడదు

జవాబు : తొందరపడి సమాధానం రాయకండి. ప్రశ్న సగం చదివేసి సమాధానం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండకండి. ఒకే ప్రశ్న గురించి సమయం ఎక్కువ వృథా చేయకుడదు. భయపడకండి, ప్రశాంతంగా ఉండండి. ముఖ్యంగా పక్కవారితో మాట్లాడే ప్రయత్నం చేయకండి.

ప్రశ్న : గణితంలో బాగా స్కోర్ ఎలా చేయాలి?

జవాబు : CBSE బోర్డు పరీక్షలకు విద్యార్థులు తమ పాఠశాల సూచించిన యూనిఫామ్ ధరించాలి, ఐడీ కార్డు వేసుకోవాలి. ప్రైవేట్ అభ్యర్థులు తేలికైన, సరళమైన దుస్తులు ధరించాలి. ఎక్కువ పాకెట్స్, బరువైన బటన్లు లేదా అలంకరణలు లేని దుస్తులు ధరించండి. చలికాలం అయితే ధరించడానికి ఒక సాధారణ స్వెటర్ (ఎటువంటి రాతలు లేదా పెద్ద లోగోలు లేకుండా, ఎక్కువ పాకెట్స్ ఉన్న జాకెట్లు లేదా హూడీలు ధరించడం మానుకోండి.

ప్రశ్న : అమ్మాయిలు ఏ విషయాలకు దూరంగా ఉండాలి?

జవాబు : భారీ ఆభరణాలు(గాజులు, పెద్ద చెవిపోగులు, నెక్లెస్‌లు మొదలైనవి), స్మార్ట్ వాచ్ లేదా ఏదైనా ఇతర డిజిటల వాచ్, చాలా పాకెట్స్ ఉన్న జాకెట్, పెద్ద జుట్టు ఉపకరణాలు లేదా క్లిప్‌లు, పరీక్ష సమయంలో ఇబ్బంది కలిగించే మేకప్ లేదా ఇతర వస్తువులు ఉండకూడదు.

ప్రశ్న : ప్రైవేట్ అభ్యర్థులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉందా?

జవాబు : ప్రైవేట్ అభ్యర్థులకు స్కూల్ యూనిఫాం తప్పనిసరి కాదు. కానీ వారు ఎక్కువ పాకెట్స్ లేదా డిజైన్లు లేని తేలికైన, సరళమైన దుస్తులను ధరించాలి. పరీక్షల సమయంలో పారదర్శకత కోసం, విద్యార్థులు అనవసరమైన సామగ్రిని తీసుకురావడాన్ని ఆపేందుకు దుస్తుల కోడ్‌లు అవసరం. ఇది కాపీయింగ్‌ను నిరోధించడానికి సహాయపడుతుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe