ఫిబ్రవరి 14.. లోకమంతా ప్రేమ దినోత్సవంగా జరుపుకుంటే, లక్షలాది మంది చిన్నారుల జీవితాల్లో మాత్రం అది ఒక నవశకానికి నాంది పలికిన రోజు. "ఏ బిడ్డ కూడా ఖాళీ కడుపుతో బడికి వెళ్లకూడదు" అనే సంకల్పంతో మొదలైన 'సాయి ష్యూర్' పౌష్టిక ఆహార కార్యక్రమం నేడు విజయవంతంగా దశాబ్ద కాలాన్ని పూర్తి చేసుకుంది. పదేళ్ల కిందట చిన్నగా మొదలైన ఈ సేవ, నేడు దేశవ్యాప్త పోషకాహార ఉద్యమంగా ఎదిగి కోట్లాది మంది పిల్లల ఆరోగ్యాన్ని, తద్వారా దేశ భవిష్యత్తును బలోపేతం చేస్తోంది.
ఒక చిన్న సంఘటన.. ఒక మహా యజ్ఞం!

ఈ సేవా యజ్ఞానికి పునాది 2012 ఏప్రిల్లో పడింది. బెంగళూరు సమీపంలోని దొడ్డబెలే ప్రభుత్వ పాఠశాలలో ఉదయం ప్రార్థన సమయంలో కొందరు పిల్లలు కళ్లు తిరిగి పడిపోయారు. వారు ఉదయం ఏమీ తినకుండానే బడికి వచ్చారని తెలిసింది. ఈ హృదయ విదారక దృశ్యం 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ' మిషన్ వ్యవస్థాపకులు మధుసూదన్ సాయి మనసును కలిచివేసింది. వారి ఆదేశం మేరకు పిల్లలకు ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమం మొదలైంది.
క్రమంగా ఈ సేవా పరిధిని విస్తరిస్తూ 2015 నవంబర్లో 'శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్' రూపుదిద్దుకుంది. చిక్కబళ్లాపూర్ జిల్లాలోని 90 పాఠశాలలతో ప్రారంభమైన ఈ ప్రస్థానం, నేడు 25 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 1.50 లక్షల ప్రభుత్వ పాఠశాలలకు చేరుకుంది.
1.4 కోట్ల మంది చిన్నారులకు ఆసరా
మన దేశంలో దాదాపు 17 కోట్ల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ, ఉదయం అల్పాహార సౌకర్యం చాలా చోట్ల లేదు. ఆకలితో బడికి వచ్చే పిల్లల్లో ఏకాగ్రత లోపించడం, నీరసం వంటి సమస్యలు కనిపిస్తాయని ఉపాధ్యాయులు చెబుతుంటారు.
ఈ సమస్యకు పరిష్కారంగానే 'సాయి ష్యూర్' అనే పౌష్టిక మిశ్రమాన్ని ట్రస్ట్ పరిచయం చేసింది. కర్ణాటకలోని ముద్దేనహళ్లిలో FSSAI ప్రమాణాలకు అనుగుణంగా తయారయ్యే ఈ పొడిలో విటమిన్ D, B12, విటమిన్ C, జింక్ వంటి కీలక ఖనిజ లవణాలు ఉంటాయి. దక్షిణ భారత దేశంలో రాగి ఆధారితంగా, ఉత్తర భారతంలో గోధుమ ఆధారితంగా దీనిని అందిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 1 కోటి 4 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పౌష్టిక మిశ్రమాన్ని పాలలో కలుపుకొని తాగుతున్నారు.
ప్రభుత్వాల భాగస్వామ్యం.. రెట్టింపు వేగం
ఈ పథకం విశిష్టతను గుర్తించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు ట్రస్ట్తో చేతులు కలిపాయి.
- తెలంగాణ, అస్సాం: ఈ రాష్ట్రాల్లో పథకం అమలుకు అయ్యే ఖర్చులో 50 శాతాన్ని అక్కడి ప్రభుత్వాలే భరిస్తున్నాయి.
- కర్ణాటక: రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ పథకంలో 25 శాతం వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తోంది. ఇక్కడ ఇది 'క్షీరభాగ్య' పథకంతో కలిసి సాగుతోంది.
- పుదుచ్చేరి: 2018లోనే ఈ ట్రస్ట్తో అధికారిక ఒప్పందం చేసుకున్న తొలి రాష్ట్రంగా నిలిచింది.
- తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం' వంటి వాటికి కూడా ఈ సేవే స్ఫూర్తిగా నిలవడం విశేషం.
రైతు సంక్షేమం - ఆరోగ్య భారతం
{{/usCountry}}ఈ పథకం విశిష్టతను గుర్తించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు ట్రస్ట్తో చేతులు కలిపాయి.
- తెలంగాణ, అస్సాం: ఈ రాష్ట్రాల్లో పథకం అమలుకు అయ్యే ఖర్చులో 50 శాతాన్ని అక్కడి ప్రభుత్వాలే భరిస్తున్నాయి.
- కర్ణాటక: రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ పథకంలో 25 శాతం వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తోంది. ఇక్కడ ఇది 'క్షీరభాగ్య' పథకంతో కలిసి సాగుతోంది.
- పుదుచ్చేరి: 2018లోనే ఈ ట్రస్ట్తో అధికారిక ఒప్పందం చేసుకున్న తొలి రాష్ట్రంగా నిలిచింది.
- తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం' వంటి వాటికి కూడా ఈ సేవే స్ఫూర్తిగా నిలవడం విశేషం.
రైతు సంక్షేమం - ఆరోగ్య భారతం
{{/usCountry}}ఈ పథకం కేవలం పిల్లలకే కాదు, రైతులకు కూడా అండగా నిలుస్తోంది. కర్ణాటకలోని తిప్తూరు ప్రాంతానికి చెందిన సుమారు 3,000 మంది రైతుల నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన రాగులను ట్రస్ట్ సేకరిస్తోంది. మార్కెట్ ధర కంటే ఎక్కువ చెల్లించి వీటిని కొనుగోలు చేయడం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది.
సాధించిన ఫలితాలు (2024-25 నివేదిక ప్రకారం):
- 95%: పిల్లల్లో పోషకాహార లోపం తగ్గుముఖం పట్టింది.
- 99%: విద్యార్థులు ఉత్సాహంగా బడికి హాజరవుతున్నారు.
- 92%: పిల్లల్లో ఏకాగ్రత పెరిగినట్లు స్పష్టమైంది.
లక్ష్యం: ఆకలి లేని భారతావని
"మనం ఒక బిడ్డ ఆకలి తీర్చడమంటే కేవలం కడుపు నింపడం కాదు; పోషకాహార లోపం లేని భారతాన్ని నిర్మించడం" అని సద్గురు శ్రీ మధుసూదన్ సాయి ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం కోటి మందికి చేరువైన ఈ సేవను, దేశంలోని మిగిలిన 7 కోట్ల మంది చిన్నారులకు కూడా అందించడమే అన్నపూర్ణ ట్రస్ట్ తదుపరి లక్ష్యం. విద్య, వైద్యం, పోషకాహారం అనేవి ప్రతి బిడ్డ ప్రాథమిక హక్కులని, వాటిని ఉచితంగా అందించడమే అసలైన మానవ సేవ అని ఈ సంస్థ నిరూపిస్తోంది.