సంజు శాంసన్.. భారత క్రికెట్లో ఈ పేరు ఇప్పుడో సంచలనం. టాలెంట్ ఉన్నా నిలకడ లేకపోవడంతో టీమ్ లోకి వస్తూ, వెళ్తూ ఉండే ఆటగాడిగా శాంసన్ కు పేరు ఉంది. కానీ ఆదివారం (మార్చి 1) అతను అద్భుతం చేశాడు. తన కెరీర్ను మార్చేసే ఇన్నింగ్స్ ఆడి, భారత్ను టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్లోకి చేర్చాడు. వెస్టిండీస్ తో డూ ఆర్ డై మ్యాచ్ లో ఇండియాను గెలిపించాడు.
కోహ్లి రికార్డు బ్రేక్

టీ20 ప్రపంచకప్ లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి రికార్డును సంజు శాంసన్ బ్రేక్ చేశాడు. వెస్టిండీస్ తో మ్యాచ్ లో 196 పరుగుల ఛేజింగ్ లో శాంసన్ 97 నాటౌట్ గా నిలిచాడు. దీంతో టీ20 ప్రపంచకప్ లో ఛేజింగ్ లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డును శాంసన్ బద్దలు కొట్టాడు. కోహ్లి 2016లో ఆస్ట్రేలియాపై, 2022లో పాకిస్థాన్ పై 82 పరుగుల చొప్పున చేశాడు.
సంజు శాంసన్ కామెంట్లు
11 సంవత్సరాల క్రితం భారత్ తరపున టీ20 డెబ్యూ చేసిన సంజు శాంసన్.. వెస్టిండీస్ పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తర్వాత ఎమోషనల్ అయ్యాడు. "ఈ ఇన్నింగ్సే నాకు ఇప్పుడు ప్రపంచం లాంటిది. క్రికెట్ మొదలెట్టినప్పటి నుంచే దేశం కోసం ఆడాలని కలలు కన్నా. నేను ఎదురు చూస్తున్న రోజు ఇది. నా జర్నీలో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. నేను చేయగలనా లేదా అని నాపై నాకు అనుమానాలూ ఉన్నాయి. కానీ ఇప్పుడు సాధించా. ఎంతో సంతోషంగా ఉంది’’ అని సంజు శాంసన్ తెలిపాడు.
బయట కూర్చుని
"నేను చాలా కాలంగా ఈ ఫార్మాట్లో ఆడుతున్నా. బెంచ్పై కూర్చుని విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి గొప్ప ఆటగాళ్ల నుంచి నేర్చుకున్నా. వాళ్లు ఎలా ఆడుతున్నారో గమనించడం నాకు చాలా ఉపయోగపడింది. నేను 60 మ్యాచ్ లే ఆడాను. కానీ డగౌట్లో కూర్చుని 100 మ్యాచ్ లు చూశా’’ అని సంజు శాంసన్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.
డూ ఆర్ డై మ్యాచ్
{{/usCountry}}"నేను చాలా కాలంగా ఈ ఫార్మాట్లో ఆడుతున్నా. బెంచ్పై కూర్చుని విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి గొప్ప ఆటగాళ్ల నుంచి నేర్చుకున్నా. వాళ్లు ఎలా ఆడుతున్నారో గమనించడం నాకు చాలా ఉపయోగపడింది. నేను 60 మ్యాచ్ లే ఆడాను. కానీ డగౌట్లో కూర్చుని 100 మ్యాచ్ లు చూశా’’ అని సంజు శాంసన్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.
డూ ఆర్ డై మ్యాచ్
{{/usCountry}}టీ20 ప్రపంచకప్ లో ఇండియా సెమీఫైనల్ చేరాలంటే కచ్చితంగా వెస్టిండీస్ పై గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ డూ ఆర్ డై పోరులో సంజు శాంసన్ మేటి ఇన్నింగ్స్ తో భారత్ విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఛేజింగ్ లో శాంసన్ చెలరేగడంతో భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఇండియా టార్గెట్ రీచ్ అయింది. మార్చి 5న సెమీస్ లో ఇంగ్లాండ్ తో భారత్ ఆడనుంది.