శ్రీరామ్ ఫైనాన్స్ క్యూ1 ఫలితాలు అదుర్స్: 60% పెరిగిన నికర లాభం
ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ శ్రీరామ్ ఫైనాన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో పటిష్ట పనితీరు కనబరిచింది. క్యూ1 లో కంపెనీ నికర లాభం 60 శాతం పెరిగి రూ.3,447 కోట్లకు చేరుకుంది.
ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ (NBFC) శ్రీరామ్ ఫైనాన్స్ 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (Q1FY27) బంపర్ ఫలితాలను ప్రకటించింది. శుక్రవారం (జులై 24) విడుదల చేసిన త్రైమాసిక నివేదిక ప్రకారం, కంపెనీ స్టాండలోన్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 60 శాతం పెరిగి రూ.3,447 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.2,156 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.

కంపెనీ నికర వడ్డీ ఆదాయం (NII) కూడా భారీగా పుంజుకుంది. గత ఏడాది క్యూ1 లో ఉన్న రూ.5,773 కోట్లతో పోలిస్తే ఈసారి 33.6 శాతం వృద్ధితో రూ.7,712 కోట్లకు చేరింది.
నిర్వహణలోని ఆస్తులు రూ.3.13 లక్షల కోట్లు
కంపెనీ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల (AUM) విలువ గణనీయంగా పెరిగింది. జూన్ 30, 2026 నాటికి శ్రీరామ్ ఫైనాన్స్ ఎయుఎమ్ వార్షిక ప్రాతిపదికన 15.26 శాతం పెరిగి రూ.3,13,798.39 కోట్లకు చేరుకుందని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో సంస్థ తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి ఇది రూ.2,72,249.01 కోట్లుగా ఉంది. మార్చి 31, 2026 నాటికి ఉన్న రూ.3,02,273.75 కోట్లతో పోల్చినా కంపెనీ రుణాలు ఇవ్వడంలో స్థిరమైన ప్రగతి సాధించింది.
ఆస్తుల నాణ్యత, నిబంధనలు
జూన్ త్రైమాసికంలో కంపెనీ ఆస్తుల నాణ్యత స్థిరంగానే ఉంది. స్థూల నిష్క్రియాత్మక ఆస్తులు (Gross NPA) మార్చి త్రైమాసికంలో ఉన్న 4.58 శాతం నుంచి స్వల్పంగా పెరిగి 4.64 శాతానికి చేరాయి. నికర ఎన్పీఏ (Net NPA) మాత్రం ఎలాంటి మార్పు లేకుండా 2.33 శాతం వద్దే కొనసాగింది.
ఈ త్రైమాసికంలో రుణ నష్టాలు, కేటాయింపుల (Provisions) మొత్తం రూ.1,463 కోట్లకు పెరిగింది. గత త్రైమాసికంలో ఇవి రూ.1,409 కోట్లుగా ఉన్నాయి. ఇక కంపెనీ రిటర్న్ ఆన్ అసెట్స్ (RoA) గత ఏడాది ఉన్న 2.76 శాతం నుంచి 3.93 శాతానికి మెరుగుపడగా, రిటర్న్ ఆన్ ఈక్విటీ (RoE) 12.76 శాతంగా నమోదైంది.
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్, విశ్లేషణ
ఫలితాల ప్రకటన వేళ బిఎస్ఈ (BSE)లో శ్రీరామ్ ఫైనాన్స్ షేరు రూ.1,023.55 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో రూ.1,050 వద్ద గరిష్ఠాన్ని, రూ.992.75 వద్ద కనిష్ఠాన్ని తాకి తీవ్ర తీవ్ర హెచ్చుతగ్గులకు గురైంది.
"రూ.985–980 శ్రేణి ఈ షేరుకు అత్యంత కీలకమైన సపోర్ట్ జోన్. ఒకవేళ షేరు ధర ఈ స్థాయి కంటే కిందకు పడిపోతే రూ.960 వరకు పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి. పైకి లేచే క్రమంలో 20 రోజుల ఈఎమ్ఏ (EMA) అయిన రూ.1,030–1,035 పరిధి తక్షణ నిరోధకంగా పనిచేస్తుంది" అని ఎస్బీఐ సెక్యూరిటీస్ టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ రీసెర్చ్ హెడ్ సుదీప్ షా విశ్లేషించారు.
జూన్ 15 నుంచి ఈ షేరు రూ.981 నుంచి రూ.1,087 శ్రేణిలోనే కన్సాలిడేట్ అవుతోందని, దిగువ స్థాయిల్లో కొనుగోలు ఆసక్తి కనిపిస్తున్నప్పటికీ టెక్నికల్ ఇండికేటర్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


