Stock market crash : స్టాక్​ మార్కెట్లు ఢమాల్​- ఇన్వెస్టర్లకు రూ. 12లక్షల కోట్ల నష్టం..

Stock market crash : దేశీయ స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలే ఇందుకు కారణం.

Published on: Mar 4, 2026, 09:18:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పశ్చిమాశియాలో ఇరాన్​- అమెరికా, ఇజ్రాయెల్​ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాల స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాలను చూస్తున్నాయి. ఈ తరుణంలోనే దేశీయ స్టాక్​ మార్కెట్​లు సైతం బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ నష్టాలతో ప్రారంభించాయి.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

బీఎస్​ఈ సెన్సెక్స్​ 1694 పాయింట్లు పడి 78.545 వద్ద ప్రారంభమైంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ50 477 పాయింట్లు కోల్పోయి 24,389 వద్ద ట్రేడింగ్​ సెషన్​ని మొదలుపెట్టింది.

ఒకానొక సందర్భంలో సెన్సెక్స్​ 1,750 పాయింట్లు కోల్పోయి 78,481 వద్ద ఇంట్రాడే- లోని నమోదు చేసింది. నిఫ్టీ50 ఏకంగా 500 పాయింట్లు డౌన్​ అయ్యి 24,335కి కూడా చేరింది.

సెన్సెక్స్​30లో 4 ఐటీ స్టాక్స్​లు (ఇన్ఫోసిస్​, టీసీఎస్​, హెచ్​సీఎల్​టెక్​, టెక్​ఎం) మినహా అన్ని నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎల్​ అండ్​ టీ 6శాతం నష్టపోగా, టాటా స్టీల్​ దాదాపు 4శాతం డౌన్​లో ఉంది.

మొత్తం మీద బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో కనిపిస్తున్న రక్తపాతం కారణంగా మదుపర్లు ఏకంగా రూ. 12లక్షల కోట్లను పోగొట్టుకున్నారు. బీఎస్​ఈ మార్కెట్​ క్యాపిటలైజేషన్​ రూ.457 లక్షల కోట్ల నుంచి రూ. 445 లక్షల కోట్లకు పడిపోయింది.

స్టాక్​ మార్కెట్​ క్రాష్​- పతనానికి కారణాలు ఏంటి?

పశ్చిమాసియాలో అనిశ్చితి:- అమెరికా- ఇజ్రాయెల్​ దేశాలు శనివారం ఇరాన్​పై దాడి చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్​ సుప్రీం లీడర్​ అయతొల్లా అల్​ ఖమేనీ మృతిచెందారు. ఇరాన్​ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఈ పరిణామాలతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉల్లికిపడ్డాయి. ఈ కారణాల వల్ల సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ప్రపంచ స్టాక్​ మార్కెట్​లతో పాటు దేశీయ సూచీలు భారీగా నష్టపోయాయి.

ముడి చమురు- హోలీ సందర్భంగా మంగళవారం స్టాక్​ మార్కెట్​లకు సెలవు లభించింది. అయితే, ముడి చమురు సరఫరాకు జీవనాధారంగా భావించే హర్ముజ్​ జలసంధిని మూసివేస్తున్నట్టు ఇరాన్​ చేసిన ప్రకటనలు మంగళవారం తీవ్ర కలకలం సృష్టించాయి. అమెరికా స్టాక్​ మార్కెట్​లతో పాటు ప్రపంచ దేశాలు సూచీలు భారీ నష్టాలను చూశాయి.

ఈ పరిణామాల మధ్య బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని సెన్సెక్స్​, నిఫ్టీలు అతి భారీ నష్టాలతో ప్రారంభించాయి.

ముడి చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే దేశాల్లో ఇండియా ఒకటి. చమురు ధరలు పెరిగితే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ఇది స్టాక్​ మార్కెట్​లకు మంచిది కాదు!

ఆర్థిక నిపుణుల ప్రకారం భారత దేశంలో వాడుతున్న చమురులో 90శాతం దిగుమతులదే వాటా. బ్యారెల్​ మీద ఒక్క డాలరు పెరిగినా దేశానికి రూ. 16వేల కోట్ల అదనపు ఖర్చు అవుతుంది!

“తాజా పరిణామాల మధ్య భారత్​కి ఉన్న ప్రధాన సమస్య.. ముడి చమురు ధర పెరుగుదల, ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై వీటి ప్రభావం. మార్కెట్​ పరంగా చూసుకుంటే వాణిజ్య లోటు పెరిగిపోతుంది. జీడీపీ తగ్గే అవకాశం ఉంది. ఇదే ఇన్వెస్టర్లకున్న భయం. ఇంకో 3, 4 వారాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటే సూచీలు కూడా పెరుగుతాయి,” అని జియోజిత్​ ఇన్వెస్ట్​మెంట్​కి చెందిన విజయ్​కుమార్​ తెలిపారు.

ఇక్కడ అన్నింటి కన్నా ఆందోళనకర విషయం ఏంటంటే.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎప్పుడు తగ్గుతాయి? అన్న ప్రశ్నకు సమాధానం లేకపోవడం! ఈ అనిశ్చితి సైతం మార్కెట్​లకు వేధిస్తోంది.

రూపాయి పతనం- అంతర్జాతీయ పరిణామాల మధ్య రూపాయి మారకం విలువ జీవితకాల గరిష్ఠానికి పడిపోయింది. ప్రస్తుతం డాలరుతో పోల్చితే రూపాయి విలువ 92.15 వద్ద ఉంది. రూపాయి పతనం సైతం స్టాక్​ మార్కెట్​లకు మంచిది కాదు. రూపాయి పడిపోతూ ఉంటే, ఎఫ్​ఐఐల (ఫారిన్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్లు) అమ్మకాలు పెరుగుతాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More