గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని నేడు, ఏప్రిల్ 3న భారతీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దేశంలోని ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలైన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లలో నేడు ఎలాంటి ట్రేడింగ్ కార్యకలాపాలు జరగవు.
ఈ వారంలో మార్కెట్లకు ఇది రెండో సెలవు కావడం గమనార్హం. అంతకుముందు మార్చి 31న మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లు మూతపడ్డాయి. అలాగే ఏప్రిల్ నెలలో ఇదే మొదటి సెలవు.
అధికారిక హాలిడే క్యాలెండర్ ప్రకారం, నేడు ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్) వంటి అన్ని విభాగాల్లో ట్రేడింగ్ నిలిచిపోయింది. శుక్రవారంతో పాటు శని, ఆదివారాలు కూడా సెలవులు కావడంతో తిరిగి ఏప్రిల్ 6, సోమవారం ఉదయం నుంచి మార్కెట్లు యథావిధిగా ప్రారంభమవుతాయి.
కమోడిటీ మార్కెట్ కూడా బంద్..
దేశంలోనే అతిపెద్ద కమోడిటీ ఎక్స్ఛేంజ్ అయిన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) కూడా గుడ్ ఫ్రైడే సందర్భంగా నేడు మూతపడింది. ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలోనూ ట్రేడింగ్ ఉండదు. దీనివల్ల బంగారం, వెండి, కాపర్, ముడి చమురు వంటి వస్తువుల ఫ్యూచర్స్ ట్రేడింగ్ నేడు పూర్తిగా నిలిచిపోయింది.
గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి..
భారత మార్కెట్లే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన స్టాక్ మార్కెట్లు కూడా నేడు గుడ్ ఫ్రైడే సెలవును పాటిస్తున్నాయి. అమెరికా మార్కెట్లతో పాటు మెజారిటీ ఆసియా, యూరోపియన్ మార్కెట్లు నేడు పనిచేయడం లేదు.
ఏప్రిల్లో మరిన్ని సెలవులు..
ఈ నెలలో మొత్తం రెండు రోజులు స్టాక్ మార్కెట్లకు సెలవులు ఉన్నాయి. నేటి గుడ్ ఫ్రైడే తర్వాత, ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్లు మళ్లీ మూతపడనున్నాయి. శని, ఆదివారాలు మినహాయించి ఈ నెలలో అదనంగా ఈ రెండు రోజులు ట్రేడింగ్ జరగదు.
ఈ ఏడాది మొత్తం 20 స్టాక్ మార్కెట్ సెలవులు ఉండగా, అందులో నాలుగు రోజులు వారాంతాల్లో (శని, ఆదివారాలు) వచ్చాయి. మిగిలిన 16 సెలవుల్లో ఇప్పటికే ఐదు రోజులు పూర్తయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇలా..
{{/usCountry}}ఈ ఏడాది మొత్తం 20 స్టాక్ మార్కెట్ సెలవులు ఉండగా, అందులో నాలుగు రోజులు వారాంతాల్లో (శని, ఆదివారాలు) వచ్చాయి. మిగిలిన 16 సెలవుల్లో ఇప్పటికే ఐదు రోజులు పూర్తయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇలా..
{{/usCountry}}ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గురువారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 185 పాయింట్లు పెరిగి 73,320 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50 34 పాయింట్లు వృద్ధిచెంది 22,713 వద్దకు చేరింది. బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 51,549 వద్ద సెషన్ని ముగించింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు 9,931.13 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,208.41 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.