Stock Market : అమ్మో మండే! స్టాక్​ మార్కెట్​ భయాలు మళ్లీ మొదలు- ఈరోజు కూడా నష్టాలు తప్పవా?

Crude Oil prices : ఇరాన్​ యుద్ధం వేళ చమురు ధర భారీగా పెరుగుతోంది. ఫలితంగా ప్రపంచ స్టాక్​ మార్కెట్​లు అల్లాడిపోతున్నాయి. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఆసియా మార్కెట్​లు భారీ నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి. దేశీయ సూచీలు సైతం అదే బాట పడతాయని గిఫ్ట్​ నిఫ్టీ సూచిస్తోంది.

Published on: Mar 30, 2026, 08:15:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా యుద్ధం నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1690 పాయింట్లు పడి 73,583 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 487 పాయింట్లు కోల్పోయి 22,820 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1433 పాయింట్లు పడి 52,275 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ.4,367.30 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,566.15 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ నెలలో ఎఫ్​ఐఐల విక్రయాలు రూ. 1లక్ష కోట్లు దాటేశాయి. భారత స్టాక్​ మార్కెట్​ చరిత్రలో ఎఫ్​ఐఐలు ఈ స్థాయిలో అమ్మకాలు చేయడం ఇదే మొదటిసారి!

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 261 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 22,450 లెవల్స్​ కన్నా దిగువకు పడితే మరింత వీక్​నెస్​ కనిపించవచ్చు. 22,000 దగ్గర సపోర్ట్​ ఉంది. 23,200 వద్ద రెసిస్టెన్స్​ ఉంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.73 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 1.67శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 2.1 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. జపాన్​ నిక్కీ, సౌత్​ కొరియా కాస్పీ 3.9శాతం మేర నష్టపోయయి.

Mutual funds : ఇక మ్యూచువల్ ఫండ్స్​ని బహుమతిగా ఇవ్వొచ్చు! సెబీ 'గిఫ్ట్ కార్డ్' రూల్స్ ఇవే..

చమురు ధరలు..

ఇరాన్​ యుద్ధం అనిశ్చితి వేళ ముడి చమురు ధరలు సోమవారం మరింత పెరిగాయి. బ్రెంట్​ క్రూడ్​ 3.10శాతం పెరిగి బ్యారెల్​కి 116.06 డాలర్లకు చేరింది.

చమురు ధరలు పెరగడం స్టాక్​ మార్కెట్​లకు అస్సలు మంచి విషయం కాదు.

స్టాక్స్​ టు బై..

ఓఎన్​జీసీ- బై రూ. 281.95, స్టాప్​ లాస్​ రూ. 275, టార్గెట్​ రూ. 297

ఆస్టర్​ డీఎం హెల్త్​కేర్​- బై రూ. 668, స్టాప్​ లాస్​ రూ. 654, టార్గెట్​ రూ. 700

నాల్కో- బై రూ. 371, స్టాప్​ లాస్​ రూ. 363, టార్గెట్​ రూ. 390

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More