...
...
Next Story

Stocks to buy : ట్రేడర్స్​ అలర్ట్​- ఎస్బీఐ, ఇన్ఫోసిస్​ షేర్​ ప్రైజ్​టార్గెట్స్​ ఇవే..

Stock market Updates : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్, ముడి చమురు ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 20, 2026, 08:14:00 IST
Advertisement

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 505 పాయింట్లు పెరిగి 78,494 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 157 పాయింట్లు వృద్ధిచెంది 24,354 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 479 పాయింట్లు పెరిగి 56,566 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్..
స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 683 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,722 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 110 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం వీక్లీ ఛార్ట్​లో నిఫ్టీ50 వరుసగా మూడో వారం బుల్లిష్​ క్యాండిల్​ని ఫార్మ్​ చేసింది. ఇది కొనుగోళ్ల జోరుకు సంకేతం.

“నిఫ్టీ50 డైలీ ఛార్ట్​లో కూడా లాంగ్​ బుల్​ క్యాండిల్​ ఏర్పడింది. టెక్నికల్​గా చూసుకుంటే మార్కెట్​లో అప్​ట్రెండ్​ కనిపిస్తోంది. నిఫ్టీ50కి ప్రస్తుతం 24,400 వద్ద బలమైన రెసిస్టెన్స్​ ఉంది. అది దాటితే 24,800 వరకు కూడా వెళ్లొచ్చు. 24,100 వద్ద కీలక సపోర్ట్​ ఉంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

కాగా అమెరికా- ఇరాన్​ మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో బిగినర్లు అప్రమత్తంగా ఉండాలని, ట్రేడింగ్​ విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్టాక్​ మార్కెట్​ నిపుణులు సూచిస్తున్నారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

హర్ముజ్​ జలసంధిపై ఇరాన్ మళ్లీ ఆంక్షలు విధించడంతో ముడి చమురు ధర జంప్​ అయ్యింది. బ్రెంట్​ క్రూడ్​ 5.47శాతం పెరిగి బ్యారెల్​కి 95.32డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

సుమిటోమో కెమికల్- బై రూ. 442, స్టాప్​ లాస్​ రూ. 426, టార్గెట్​ రూ. 474

కమిన్స్​ ఇండియా- బై రూ. 5141, స్టాప్​ లాస్​ రూ. 4960, టార్గెట్​ రూ. 5503

ఎస్బీఐ- బై రూ. 1080, స్టాప్​ లాస్​ రూ. 1055, టార్గెట్​ రూ. 1130

ఇన్ఫోసిస్​- బై రూ. 1320, స్టాప్​ లాస్​ రూ. 1280, టార్గెట్​ రూ. 160

ఇండిగో- బై రూ. 4634, స్టాప్​ లాస్​ రూ. 4600, టార్గెట్​ రూ. 4750

మజగాన్ డాక్​ షిప్​బిల్డర్స్​- బై రూ. 2615, స్టాప్​ లాస్​ రూ. 2565, టార్గెట్​ రూ. 2770

జీపీపీఎల్​- బై రూ. 160.9, స్టాప్​ లాస్​ రూ. 156, టార్గెట్​ రూ. 174

డైనమిక్​ కేబుల్స్​- బై రూ. 332.95, స్టాప్​ లాస్​ రూ. 325, టార్గెట్​ రూ. 355

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe