హార్ముజ్ జలసంధిలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ క్షిపణులు గగనతలంలో దూసుకుపోతుంటే, మరోవైపు అమెరికా బాంబర్లు టెహ్రాన్పై దాడులు చేస్తున్నాయి. అయితే ఈ భీకర పోరు నడుమ ఇరాన్ దౌత్య కార్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో సరికొత్త 'పరోక్ష యుద్ధాన్ని' సాగిస్తున్నాయి. తమదైన శైలిలో వ్యంగ్యాలు, చమత్కారాలతో అమెరికాను ఆటాడుకుంటున్నాయి.

తాజాగా జింబాబ్వేలోని ఇరాన్ మిషన్ ఈ సంక్షోభానికి ఓ వింత పరిష్కారాన్ని సూచించింది. "మర్యాదగా వ్యవహరించండి.. దారి తీసుకోండి" అని ఆ కార్యాలయం ట్వీట్ చేసింది. దీనికి ఫ్రాన్స్, స్పెయిన్ హ్యాష్ ట్యాగ్లను జత చేయడం గమనార్హం. అంటే శాంతియుతంగా చర్చలు జరుపుతున్న దేశాలకు తాము దారి ఇస్తున్నామనే సంకేతాలను ఇరాన్ పరోక్షంగా ఇచ్చింది.
నవ్వుపుట్టించేలా ఉన్నప్పటికీ, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ఈ మార్గాన్ని మళ్లీ తెరిపిస్తామని, ఇందుకోసం చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతున్నప్పటికీ, ప్రస్తుతం ఈ జలసంధి దాదాపు మూతబడే ఉంది.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్లే ఈ యుద్ధం మొదలైందని, అంతవరకు హార్ముజ్ మార్గం సాధారణంగానే పనిచేసిందని ఇరాన్ నాయకత్వం వాదిస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయం ఒక అడుగు ముందుకు వేసి తీవ్రమైన పోస్ట్ పెట్టింది. హార్ముజ్ జలసంధిలో అమెరికా జెండాలు కప్పిన శవపేటికలు తేలుతున్న చిత్రాన్ని పోస్ట్ చేసింది. "హార్ముజ్ జలసంధి గుండా దాటగలిగే ఏకైక అమెరికన్ వస్తువు ఇదే" అని దానికి క్యాప్షన్ ఇచ్చి తీవ్ర దుమారం రేపింది.
ఈ ఘర్షణల కారణంగా హార్ముజ్ గుండా జరిగే నౌకా రవాణా భారీగా పడిపోయింది. కేవలం కొన్ని నౌకలు మాత్రమే ఎలాగోలా ఈ మార్గాన్ని దాటగలుగుతున్నాయి. అందులోనూ టెహ్రాన్తో స్నేహపూర్వక సంబంధాలు ఉన్న దేశాల నౌకలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి.
{{/usCountry}}ఈ ఘర్షణల కారణంగా హార్ముజ్ గుండా జరిగే నౌకా రవాణా భారీగా పడిపోయింది. కేవలం కొన్ని నౌకలు మాత్రమే ఎలాగోలా ఈ మార్గాన్ని దాటగలుగుతున్నాయి. అందులోనూ టెహ్రాన్తో స్నేహపూర్వక సంబంధాలు ఉన్న దేశాల నౌకలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి.
{{/usCountry}}ఇంతటి దిగ్బంధం ఉన్నప్పటికీ, ఒమన్ తీర ప్రాంతాన్ని ఆనుకుని చాలా పరిమిత సంఖ్యలో నౌకలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇటీవల మూడు ఆయిల్ ట్యాంకర్లు ఈ మార్గం గుండా వెళ్లాయని, అందులో ఒక ట్యాంకర్లో జపాన్ కంపెనీకి కూడా వాటా ఉందని ఏఎఫ్పీ వార్తా సంస్థ వెల్లడించింది.
మరో విశేషమేమిటంటే, ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ లాజిస్టిక్స్ దిగ్గజం 'సీఎమ్ఏ సీజీఎమ్' (CMA CGM) నౌక ఈ జలసంధిని దాటిన తొలి పశ్చిమ యూరోపియన్ నౌకగా నిలిచింది. యుద్ధ విరమణ ప్రకటించాలని, బాంబు దాడులు ఆగితేనే ఈ జలసంధి పూర్తిగా తెరుచుకుంటుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పిలుపునిచ్చిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
భారతదేశం మాత్రం ఈ సంక్షోభంలోనూ తన ఉనికిని కాపాడుకుంటోంది. ఫిబ్రవరి 28 తర్వాత కనీసం ఎనిమిది భారతీయ నౌకలు ఈ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించాయి. పొరుగు దేశమైన పాకిస్తాన్ కూడా సురక్షిత రవాణా కోసం ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం.
ఇదంతా ఒకెత్తయితే, ఈ యుద్ధాన్ని ఆసరాగా చేసుకుని ఇరాన్ భవిష్యత్తుపై కన్నేసింది. ఈ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ప్రత్యేక పన్ను (Toll System) వసూలు చేసే యోచనలో టెహ్రాన్ ఉంది. ఇదే గనుక జరిగితే ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఈ ఇంధన రవాణా మార్గంపై ఇరాన్ శాశ్వత నియంత్రణ సాధించే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.