బెయిలు హక్కు.. నిర్ధోషి అని తేలేవరకు విచారణ ఖైదీగా ఉంచడం సరికాదు: సుప్రీంకోర్టు
యూఏపీఏ (UAPA) వంటి కఠిన చట్టాల కింద కేసు నమోదైనా సరే.. నిందితుడికి బెయిల్ రావడం అనేది అతని ప్రాథమిక హక్కు అని, విచారణ సాకుతో ఏళ్ల తరబడి జైల్లో బంధించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
"బెయిల్ మంజూరు చేయడం అనేది ఒక సాధారణ పద్ధతి.. జైల్లో ఉంచడం అనేది కేవలం ఒక అసాధారణ చర్య మాత్రమే" అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్కు చెందిన సయ్యద్ ఇఫ్తికార్ ఆండ్రాబీ అనే వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. 2020 నుంచి అంటే దాదాపు ఆరేళ్లుగా ఒక వ్యక్తి విచారణ ఖైదీగా జైల్లోనే ఉండటంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

పాత తీర్పులను తోసిపుచ్చుతూ..
గతంలో ఉమర్ ఖలీద్ వంటి వారి బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన తీరును ప్రస్తుత ధర్మాసనం తప్పుబట్టింది. ముఖ్యంగా 'గుల్ఫిషా ఫాతిమా' కేసులో బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పు సరికాదని పేర్కొంది. "రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం ప్రతి వ్యక్తికీ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. యూఏపీఏ చట్టం ఆ హక్కును పూర్తిగా కాలరాయలేదు. విచారణలో అసాధారణ జాప్యం జరిగినప్పుడు నిందితుడు నిర్దోషిగా బయటకు వచ్చే వరకు జైల్లోనే ఉండాలని చెప్పడం న్యాయం అనిపించుకోదు" అని ధర్మాసనం వివరించింది.
ఖచ్చితంగా అమలు చేయాల్సిందే
గతంలో 'కె.ఎ. నజీబ్' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతి కోర్టు శిరోధార్యంగా భావించాలని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. "ఈ చట్టం కింద బెయిల్ నిబంధనలు కఠినంగా ఉన్న మాట వాస్తవమే, కానీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల కంటే ఆ చట్టం పెద్దదేమీ కాదు," అని ఆయన స్పష్టం చేశారు. విచారణ పూర్తి కాకుండానే నిందితులను శిక్షించినట్లు జైల్లో ఉంచడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కోర్టు తేల్చి చెప్పింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. సుప్రీంకోర్టు తాజా తీర్పు సారాంశం ఏమిటి?
యూఏపీఏ వంటి కఠిన చట్టాల కింద కేసు ఉన్నప్పటికీ, విచారణలో జాప్యం జరిగితే నిందితుడికి బెయిల్ ఇవ్వడం అనేది ఒక ప్రాథమిక సూత్రమని, జైల్లోనే ఉంచడం అనేది ఒక అరుదైన సందర్భం మాత్రమేనని కోర్టు చెప్పింది.
2. బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు ఏ రాజ్యాంగ అధికరణలను ప్రస్తావించింది?
ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించే ఆర్టికల్ 21, 22లను కోర్టు ప్రధానంగా ప్రస్తావించింది.
3. ఈ తీర్పు ఇతర యూఏపీఏ కేసులపై ప్రభావం చూపుతుందా?
ఖచ్చితంగా.. ఉమర్ ఖలీద్తో పాటు ఏళ్ల తరబడి విచారణ కోసం జైళ్లలో ఎదురుచూస్తున్న అనేక మందికి ఈ తీర్పు ఒక ఆశాకిరణం లాంటిది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


