భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో రికార్డు క్రియేట్ చేశాడు. 360 డిగ్రీల ఆటతీరుతో అదరగొట్టే సూర్య సిక్సర్ల రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం (అక్టోబర్ 29) కానెబెర్రాలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ టీ20లో సూర్య అరుదైన ఫీట్ అందుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల లిస్ట్ లో టాప్-5లో చోటు దక్కించుకున్నాడు.
150 సిక్సర్లు

సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో సిక్సర్లతో అదరగొట్టాడు. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సరైన సమయంలో ఫామ్ అందుకున్నట్లు కనిపించాడు. ఈ క్రమంలోనే ఒక ప్రత్యేకమైన టీ20 మైలురాయిని చేరుకున్నాడు. టీ20లలో 150 సిక్సర్లు కొట్టిన ఐదవ బ్యాటర్గా సూర్య నిలిచాడు.
ఇండియన్ బ్యాటర్లలో రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ బ్యాటర్ సూర్యకుమార్. 10వ ఓవర్ మూడో బంతికి ఎల్లిస్ స్టంప్స్ లక్ష్యంగా షార్ట్ బాల్ వేశాడు. యాదవ్ దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకుని మిడ్-వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాది తన 150వ టీ20 సిక్సర్ను పూర్తి చేసుకున్నాడు.
రోహిత్ తర్వాత
భారత ఆటగాళ్లలో ప్రస్తుత టీ20 కెప్టెన్ అయిన సూర్య అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో రెండవ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ అంతర్జాతీయ టీ20లలో 205 సిక్సర్లు కొట్టాడు.
టాప్-5లో చోటు
{{/usCountry}}భారత ఆటగాళ్లలో ప్రస్తుత టీ20 కెప్టెన్ అయిన సూర్య అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో రెండవ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ అంతర్జాతీయ టీ20లలో 205 సిక్సర్లు కొట్టాడు.
టాప్-5లో చోటు
{{/usCountry}}ప్రపంచంలోని బిగ్ హిట్టర్లు కొట్టిన సిక్సర్ల జాబితా విషయానికి వస్తే, సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు టాప్-ఫైవ్లోకి ప్రవేశించాడు. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ జాబితాలో కూడా 205 సిక్సర్లతో రోహిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. సూర్య కంటే ముందున్న ఆటగాడు ఇంగ్లండ్ విధ్వంసక ఆటగాడు జోస్ బట్లర్. అతను 172 సిక్సర్లు కొట్టాడు.
భారత బ్యాటర్ల విషయానికొస్తే, సూర్యకుమార్ యాదవ్ అత్యంత సమర్థవంతమైన సిక్సర్ల హిట్టర్. తాజా గణాంకాల ప్రకారం, అతను తన టీ20 కెరీర్లో 1650 బంతులు ఎదుర్కొన్నాడు. అంటే సూర్య ప్రతి 11 బంతులకు ఒక సిక్స్ కొడతాడు. ఈ జాబితాలో తర్వాతి స్థానంలో ఉన్న హార్దిక్ పాండ్యా కంటే ఇది ఒక సిక్సర్కు మూడు బంతులు తక్కువ.
మ్యాచ్ వర్షార్పణం
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 1-2 తేడాతో ఓడిపోయింది. ఇప్పుడిక టీ20 సిరీస్ స్టార్ట్ అయింది. కానీ ఆ కిక్ ను పొందాలనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ టీ20 వర్షం కారణంగా రద్దయింది.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 9.4 ఓవర్లకు 97/1తో ఉన్న దశలో వచ్చిన వర్షం మ్యాచ్ ను తుడిచిపెట్టుకుపోయింది. అంతకుముందు ఓ సారి వర్షం అడ్డు పడటంతో ఓవర్లను 20 నుంచి 18కి తగ్గించారు. మ్యాచ్ రద్దయ్యే సమయానికి సూర్యకుమార్ యాదవ్ (39 నాటౌట్), శుభ్ మన్ గిల్ (37 నాటౌట్) క్రీజులో ఉన్నారు.